ETV Bharat / bharat

కర్ణాటక సర్కారుకు ఎమ్మెల్యేల 'రాజీ'నామా గండం - కాంగ్రెస్

కర్ణాటక రాజకీయాల్లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు ఆనంద్​ సింగ్, రమేశ్​ జర్కిహోలి​ రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల రాజీనామాలతో సంకీర్ణ ప్రభుత్వం మనుగడపై నీలినీడలు అలుముకున్నాయి.

కర్ణాటక: ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా
author img

By

Published : Jul 1, 2019, 4:36 PM IST

Updated : Jul 1, 2019, 5:02 PM IST

కర్ణాటక రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బళ్లారి జిల్లా విజయనగర శాసనసభ ఎమ్మెల్యే ఆనంద్​ సింగ్​, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్​ జర్కిహోలీ రాజీనామా పత్రాలను స్పీకర్​ కేఆర్​ రమేశ్​ కుమార్​కు సమర్పించారు. ఇరువురి రాజీనామాతో కాంగ్రెస్​లోని అసమ్మతి ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మళ్లీ పుంజుకుందనే ఊహాగానాలు పెరిగాయి.

ప్రస్తుత పరిణామాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఈ నెల 8న తిరిగి రానున్నారు.

మంత్రి పదవి ఆశించిన వారిలో సింగ్​ ఉన్నారు. గత ఏడాది కాంగ్రెస్​ అధిష్ఠానం తనకు పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ చేపట్టినా ఆయనకు పదవి దక్కలేదు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారనేది మరో వాదన.

రాజీనామా వెనుక రాజ్​నాథ్​?

ఆనంద్​ సింగ్​ రాజీనామా వెనుక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'ఆపరేషన్​ కమలం' చేపట్టిన నుంచి రాజ్​నాథ్​ను ఆనంద్​ సింగ్​ కలుస్తుండటమే ఈ ఊహాగానాలకు కారణంగా తెలుస్తోంది. రాజీనామా చేసే ముందు కేంద్ర మంత్రిని సింగ్​ కలిసినట్లు అతని అనుచరులు పేర్కొన్నారు.

కుమారస్వామి దృష్టి

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా కలలు కంటోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'భుట్టో' బుట్టలో పడిపోయాం: నట్వర్​ సింగ్

కర్ణాటక రాజకీయం కొత్త మలుపులు తిరుగుతోంది. తాజాగా ఇద్దరు కాంగ్రెస్​ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. బళ్లారి జిల్లా విజయనగర శాసనసభ ఎమ్మెల్యే ఆనంద్​ సింగ్​, గోకాక్ ఎమ్మెల్యే రమేశ్​ జర్కిహోలీ రాజీనామా పత్రాలను స్పీకర్​ కేఆర్​ రమేశ్​ కుమార్​కు సమర్పించారు. ఇరువురి రాజీనామాతో కాంగ్రెస్​లోని అసమ్మతి ఎమ్మెల్యేల్లో తిరుగుబాటు మళ్లీ పుంజుకుందనే ఊహాగానాలు పెరిగాయి.

ప్రస్తుత పరిణామాలు రాష్ట్ర ముఖ్యమంత్రి కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉన్నప్పుడు జరగటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఆయన ఈ నెల 8న తిరిగి రానున్నారు.

మంత్రి పదవి ఆశించిన వారిలో సింగ్​ ఉన్నారు. గత ఏడాది కాంగ్రెస్​ అధిష్ఠానం తనకు పదవి ఇస్తామని హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కానీ రెండు సార్లు మంత్రివర్గ విస్తరణ చేపట్టినా ఆయనకు పదవి దక్కలేదు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకున్నారనేది మరో వాదన.

రాజీనామా వెనుక రాజ్​నాథ్​?

ఆనంద్​ సింగ్​ రాజీనామా వెనుక కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ హస్తం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 'ఆపరేషన్​ కమలం' చేపట్టిన నుంచి రాజ్​నాథ్​ను ఆనంద్​ సింగ్​ కలుస్తుండటమే ఈ ఊహాగానాలకు కారణంగా తెలుస్తోంది. రాజీనామా చేసే ముందు కేంద్ర మంత్రిని సింగ్​ కలిసినట్లు అతని అనుచరులు పేర్కొన్నారు.

కుమారస్వామి దృష్టి

అమెరికా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి హెచ్​డీ కుమారస్వామి రాష్ట్ర పరిస్థితులపై ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు ట్వీట్​ చేశారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు భాజపా కలలు కంటోందని ఆరోపించారు.

ఇదీ చూడండి: 'భుట్టో' బుట్టలో పడిపోయాం: నట్వర్​ సింగ్

Intro:Body:

i


Conclusion:
Last Updated : Jul 1, 2019, 5:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.