ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​ స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతం

author img

By

Published : Dec 19, 2020, 4:22 PM IST

జమ్ముకశ్మీర్​ జిల్లా అభివృద్ధి మండలి (డీడీసీ) ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం జరిగిన చివరి, 8వ విడత పోలింగ్​లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.91 శాతం ఓటింగ్​ నమోదైంది. మలి విడతలో 28 స్థానాలకు గానూ 168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈనెల 22న ఓట్ల లెక్కింపు జరగనుంది.

jammu and kashmir DDC Elections: voting percentage till 1pm
కశ్మీర్లో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతం

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్ధు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన డీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం జరిగిన తుది, 8వ విడత పోలింగ్​లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.91 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలి విడతలో 28 స్థానాలకుగానూ 168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితో పాటే 84 సర్పంచ్​ స్థానాలకు కూడా శనివారం పోలింగ్ జరిగింది.

22న ఓట్ల లెక్కింపు..

కశ్మీర్​​లో మొత్తం 280 డీడీసీ స్థానాలకు 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశ నవంబరు 28న ప్రారంభమైంది. చివరి దశ శనివారంతో పూర్తయింది. డీడీసీతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా 8 విడతల్లో జరిగాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఆర్టికల్​ 370 రద్ధు తర్వాత జరుగుతున్న ఎన్నికలు అయినందున పటిష్ఠ బందోబస్తు నడుమ ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ముగిశాయి. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బంగాల్​లో భాజపాదే అధికారం: సువేందు

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్ 370 రద్ధు తర్వాత తొలిసారి ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిన డీడీసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. శనివారం జరిగిన తుది, 8వ విడత పోలింగ్​లో మధ్యాహ్నం ఒంటిగంట వరకు 40.91 శాతం పోలింగ్ నమోదైంది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. మలి విడతలో 28 స్థానాలకుగానూ 168 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీటితో పాటే 84 సర్పంచ్​ స్థానాలకు కూడా శనివారం పోలింగ్ జరిగింది.

22న ఓట్ల లెక్కింపు..

కశ్మీర్​​లో మొత్తం 280 డీడీసీ స్థానాలకు 8 విడతలుగా ఎన్నికలు నిర్వహించారు. మొదటి దశ నవంబరు 28న ప్రారంభమైంది. చివరి దశ శనివారంతో పూర్తయింది. డీడీసీతో పాటు పంచాయతీ ఎన్నికలు కూడా 8 విడతల్లో జరిగాయి. డిసెంబర్​ 22న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఆర్టికల్​ 370 రద్ధు తర్వాత జరుగుతున్న ఎన్నికలు అయినందున పటిష్ఠ బందోబస్తు నడుమ ఎన్నికల క్రతువును విజయవంతంగా పూర్తి చేశారు అధికారులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎన్నికలు ముగిశాయి. ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో ఓటింగ్​లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి: బంగాల్​లో భాజపాదే అధికారం: సువేందు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.