ETV Bharat / bharat

లాక్​డౌన్ అతిక్రమిస్తే గదిలోకి నెట్టి 'మసాకలి 2.0'!

author img

By

Published : Apr 12, 2020, 7:34 PM IST

Updated : Apr 12, 2020, 7:56 PM IST

లాక్​డౌన్​ ఉల్లంఘించేవారికి రాజస్థాన్​ జైపుర్​ పోలీసులు బంపర్​ ఆఫర్​ ఇచ్చారు. ఎవరైనా అకారణంగా బయట తిరుగుతూ కనిపిస్తే వారిని ఒక గదిలోకి తీసుకెళ్లి 'మసాకలి 2.0' ప్రయోగిస్తామంటున్నారు.

Jaipur cops warn violaters they will face the music: Masakali 2.0 on loop
లాక్​డౌన్ అతిక్రమిస్తే గదిలోకి నెట్టి 'మసాకలి 2.0'!

రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో లాక్​డౌన్​ను ఉల్లంఘించే ముందు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే అలాంటివారిపై జైపుర్​ పోలీసులు 'మసాకలి 2.0'ను ప్రయోగిస్తారట. అసలేంటి ఇది అనుకుంటున్నారా?

లాక్​డౌన్​ సమయంలో వీధుల్లో అనవసరంగా తిరిగే వారిని ఓ గదిలోకి తీసుకెళ్లి... ఇటీవల విడుదలైన 'మసాకలి 2.0' పాటను మళ్లీమళ్లీ వినిపిస్తామని జైపుర్​ పోలీసులు ట్వీట్ చేశారు.

Jaipur cops warn violaters they will face the music: Masakali 2.0 on loop
జైపుర్​ పోలీసులు ట్వీట్​

'మొండిగా ప్రవర్తించకండి, మూర్ఖంగా ఉండకండి, ఇంట్లోనే ఉండండి' అంటూ మొదలయ్యే ఈ పాటను ప్రస్తావిస్తూ లాక్​డౌన్​ వేళ అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు కోరారు.

ఈ ట్వీట్​కు భారీ స్పందన వస్తోంది. ఈ ఆలోచన ఎంతో బాగుందని, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఒరిజినల్​ సాంగ్​తో పోలిస్తే ఈ రీమేక్​ పాట అంతగా ఆకట్టుకోలేదని సినీ తారలు, కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ పాట ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు ఉండటం వల్లే తీసుకున్నట్లు ​ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ పాట ఒరిజినల్​ను ఏఆర్​ రెహ్మాన్​ స్వరపరిచారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

రాజస్థాన్​ రాజధాని జైపుర్​లో లాక్​డౌన్​ను ఉల్లంఘించే ముందు ఇకపై ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ఎందుకంటే అలాంటివారిపై జైపుర్​ పోలీసులు 'మసాకలి 2.0'ను ప్రయోగిస్తారట. అసలేంటి ఇది అనుకుంటున్నారా?

లాక్​డౌన్​ సమయంలో వీధుల్లో అనవసరంగా తిరిగే వారిని ఓ గదిలోకి తీసుకెళ్లి... ఇటీవల విడుదలైన 'మసాకలి 2.0' పాటను మళ్లీమళ్లీ వినిపిస్తామని జైపుర్​ పోలీసులు ట్వీట్ చేశారు.

Jaipur cops warn violaters they will face the music: Masakali 2.0 on loop
జైపుర్​ పోలీసులు ట్వీట్​

'మొండిగా ప్రవర్తించకండి, మూర్ఖంగా ఉండకండి, ఇంట్లోనే ఉండండి' అంటూ మొదలయ్యే ఈ పాటను ప్రస్తావిస్తూ లాక్​డౌన్​ వేళ అందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని పోలీసులు కోరారు.

ఈ ట్వీట్​కు భారీ స్పందన వస్తోంది. ఈ ఆలోచన ఎంతో బాగుందని, నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

ఒరిజినల్​ సాంగ్​తో పోలిస్తే ఈ రీమేక్​ పాట అంతగా ఆకట్టుకోలేదని సినీ తారలు, కొంతమంది నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఈ పాట ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు ఉండటం వల్లే తీసుకున్నట్లు ​ పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ పాట ఒరిజినల్​ను ఏఆర్​ రెహ్మాన్​ స్వరపరిచారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
Last Updated : Apr 12, 2020, 7:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.