ETV Bharat / bharat

దౌత్యమార్గాలతో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు!

author img

By

Published : Aug 17, 2020, 4:13 PM IST

స్వదేశంలో తయారు చేసిన రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు రోడ్​మ్యాప్​ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. విదేశాల్లో ఈ ఉత్పత్తుల ఎగుమతులు ప్రోత్సహించేందుకు దౌత్య మార్గాలు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్నేహపూర్వక దేశాలతో చర్చించేందుకు వర్చువల్ మీటింగ్​లను నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.

India prepares roadmap to promote defence exports using diplomatic channels
దౌత్యమార్గాలతో రక్షణ ఉత్పత్తుల ఎగుమతులు!

రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఇందుకు సంబంధించిన రోడ్​మ్యాప్​ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ వ్యవస్థలు, ఆయుధాల ఎగుమతి ప్రోత్సహించేందుకు దౌత్య మార్గాలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు స్నేహపూర్వక దేశాల ప్రతినిధులతో వర్చువల్​గా చర్చలు జరపనున్నట్లు రక్షణ శాఖ ఉత్పత్తుల విభాగ కార్యదర్శి రాజ్​ కుమార్ తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆర్మీ మేక్ ప్రాజెక్ట్స్​ 2020" వెబినార్​లో పాల్గొన్న ఆయన... ఆయా దేశాలకు ఎలాంటి ఉత్పత్తులు, రక్షణ వ్యవస్థలు అవసరమో ఈ చర్చల ద్వారా తెలుసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

"స్నేహపూర్వక దేశాలకు అవసరమయ్యే రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు, వ్యవస్థల పూర్తి జాబితాను తయారు చేస్తున్నాం. రక్షణ శాఖ నేతృత్వంలో ఆన్​లైన్ వేదికగా చర్చలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎగుమతి చేసేందుకు ప్రస్తుతం మన వద్ద ఉన్న అవకాశాలను రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు(డీపీఎస్​యూ), పరిశ్రమ గుర్తిస్తాయి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు రక్షణ రంగ సంస్థలు, రాయబార కార్యాలయాలు, దౌత్యపరమైన వ్యవస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది."

-రాజ్ కుమార్, రక్షణ శాఖ ఉత్పత్తుల విభాగ కార్యదర్శి

101 రకాల ఆయుధాల దిగుమతిపై నిషేధం విధిస్తూ రక్షణ శాఖ ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 నాటికి దేశీయంగానే వీటిని తయారు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో నిషేధిత రక్షణ ఉత్పత్తుల రెండో జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు రాజ్​కుమార్ తెలిపారు. అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఐఐటీలు దృష్టిసారించాలి'

రక్షణ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. తాజాగా ఇందుకు సంబంధించిన రోడ్​మ్యాప్​ను రూపొందించినట్లు అధికారులు వెల్లడించారు. రక్షణ వ్యవస్థలు, ఆయుధాల ఎగుమతి ప్రోత్సహించేందుకు దౌత్య మార్గాలను వినియోగించుకోనున్నట్లు తెలిపారు.

ఈ మేరకు స్నేహపూర్వక దేశాల ప్రతినిధులతో వర్చువల్​గా చర్చలు జరపనున్నట్లు రక్షణ శాఖ ఉత్పత్తుల విభాగ కార్యదర్శి రాజ్​ కుమార్ తెలిపారు. ఫిక్కీ ఆధ్వర్యంలో నిర్వహించిన "ఆర్మీ మేక్ ప్రాజెక్ట్స్​ 2020" వెబినార్​లో పాల్గొన్న ఆయన... ఆయా దేశాలకు ఎలాంటి ఉత్పత్తులు, రక్షణ వ్యవస్థలు అవసరమో ఈ చర్చల ద్వారా తెలుసుకోనున్నట్లు స్పష్టం చేశారు.

"స్నేహపూర్వక దేశాలకు అవసరమయ్యే రక్షణ ఉత్పత్తులు, ఆయుధాలు, వ్యవస్థల పూర్తి జాబితాను తయారు చేస్తున్నాం. రక్షణ శాఖ నేతృత్వంలో ఆన్​లైన్ వేదికగా చర్చలు జరిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఎగుమతి చేసేందుకు ప్రస్తుతం మన వద్ద ఉన్న అవకాశాలను రక్షణ రంగ ప్రభుత్వ సంస్థలు(డీపీఎస్​యూ), పరిశ్రమ గుర్తిస్తాయి. ఎగుమతులను ప్రోత్సహించేందుకు రక్షణ రంగ సంస్థలు, రాయబార కార్యాలయాలు, దౌత్యపరమైన వ్యవస్థలతో ప్రభుత్వం కలిసి పనిచేస్తుంది."

-రాజ్ కుమార్, రక్షణ శాఖ ఉత్పత్తుల విభాగ కార్యదర్శి

101 రకాల ఆయుధాల దిగుమతిపై నిషేధం విధిస్తూ రక్షణ శాఖ ఆగస్టు 9న నోటిఫికేషన్ జారీ చేసింది. 2024 నాటికి దేశీయంగానే వీటిని తయారు చేసుకోవాలని నిర్ణయం తీసుకుంది.

ఈ నేపథ్యంలో నిషేధిత రక్షణ ఉత్పత్తుల రెండో జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు రాజ్​కుమార్ తెలిపారు. అవసరాలకు అనుగుణంగా పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్భంగా పారిశ్రామిక వర్గాలకు పిలుపునిచ్చారు.

ఇదీ చదవండి: 'గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ఐఐటీలు దృష్టిసారించాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.