అతిభయంకరమైన కరోనా రోజురోజుకూ విజృంభిస్తోంది. వైరస్ ధాటికి ఇప్పటికే చైనాలో 259 మంది ప్రాణాలు కోల్పోయారు. 12 వేల మందికిపైగా ఈ వైరస్ సోకినట్టు ప్రాథమిక అంచనాలు తెలుపుతున్నాయి.
ఈ నేపథ్యంలో చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీతో చరవాణిలో సంభాషించారు జయశంకర్. మహమ్మారితో పోరాడుతున్న చైనా ప్రభుత్వానికి, ప్రజలకు అండగా ఉంటామని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. ఈ గడ్డు కాలాన్ని ఎదుర్కొనే శక్తి సామర్థ్యం డ్రాగన్ దేశానికి ఉందని అభిప్రాయపడిన ఆయన... త్వరలోనే వైరస్ నుంచి బయటపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
వుహాన్ నుంచి 324 మంది భారతీయ విద్యార్థులు స్వదేశానికి తిరిగి వచ్చిన నేపథ్యంలో.. ఇందుకు సహకరించిన చైనా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు జయశంకర్. భారత్ సహకారానికి ధన్యవాదాలు తెలిపారు వాంగ్ యీ. వైరస్ను ఎదుర్కోవడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు చైనా మంత్రి.
ఇదీ చదవండి: ప్రమాదంలో ఒకే కుటుంబంలోని ఆరుగురు మృతి