ETV Bharat / bharat

'దేశీయ రక్షణ సామర్థ్యంతోనే శాంతికి పునాది'

author img

By

Published : Oct 7, 2020, 10:07 PM IST

భారత శాంతికాముక దేశమని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఉద్ఘాటించారు. విదేశీ రాయబారుల బృందంతో వర్చువల్​గా భేటీలో ప్రసంగించిన ఆయన.. దేశీయ రక్షణ సామర్థ్యంతో శాంతి సాధ్యమవుతుందని చెప్పారు.

DEF-RAJNATH
రాజ్​నాథ్​ సింగ్

భారత్.. శాంతిని ప్రేమించే దేశమని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఉద్ఘాటించారు. దేశీయ రక్షణ సామర్థ్యాలే శాంతి సాధనకు పునాది అని భారత్ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్​నాథ్ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

త్వరలో జరగబోయే ఏరో ఇండియా ఎగ్జిబిషన్‌కు సంబంధించి విదేశీ రాయబారుల బృందంతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రసంగించారు రాజ్​నాథ్​. ఈ సమావేశంలో 75 దేశాలకు చెందిన రాయబారులు, రక్షణ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

రక్షణ రంగంలో..

కీలకమైన సైనిక సంస్థలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి కేంద్రంగా దేశాన్ని మార్చడానికి ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంస్కరణ చర్యలను రాజ్​నాథ్ ప్రముఖంగా ప్రస్తావించారు. రక్షణ తయారీ రంగంలో మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలవడటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

నాలుగో తరం యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు, బ్యాటిల్​ ట్యాంకులు, బాలిస్టిక్ క్షిపణుల తయారు చేసే అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ఎల్​జేపీ 'గారడీ'తో ఎవరికి నష్టం?

భారత్.. శాంతిని ప్రేమించే దేశమని రక్షణ మంత్రి రాజ్​నాథ్​ సింగ్ ఉద్ఘాటించారు. దేశీయ రక్షణ సామర్థ్యాలే శాంతి సాధనకు పునాది అని భారత్ విశ్వసిస్తుందని స్పష్టం చేశారు. చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో రాజ్​నాథ్ వ్యాఖ్యలు ప్రాముఖ్యం సంతరించుకున్నాయి.

త్వరలో జరగబోయే ఏరో ఇండియా ఎగ్జిబిషన్‌కు సంబంధించి విదేశీ రాయబారుల బృందంతో నిర్వహించిన వర్చువల్ సమావేశంలో ప్రసంగించారు రాజ్​నాథ్​. ఈ సమావేశంలో 75 దేశాలకు చెందిన రాయబారులు, రక్షణ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.

రక్షణ రంగంలో..

కీలకమైన సైనిక సంస్థలు, ఆయుధ వ్యవస్థల ఉత్పత్తి కేంద్రంగా దేశాన్ని మార్చడానికి ప్రభుత్వం ప్రారంభించిన వివిధ సంస్కరణ చర్యలను రాజ్​నాథ్ ప్రముఖంగా ప్రస్తావించారు. రక్షణ తయారీ రంగంలో మొదటి ఐదు దేశాల్లో ఒకటిగా నిలవడటమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

నాలుగో తరం యుద్ధ విమానాలు, అణు జలాంతర్గాములు, బ్యాటిల్​ ట్యాంకులు, బాలిస్టిక్ క్షిపణుల తయారు చేసే అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటని చెప్పారు రాజ్​నాథ్​.

ఇదీ చూడండి: బిహార్​ బరి: ఎల్​జేపీ 'గారడీ'తో ఎవరికి నష్టం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.