ETV Bharat / bharat

రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!

'ఈరోజుల్లో రేడియోలో వార్తలు, విద్యా కార్యక్రమాలు వినేదెవరు?' అనుకునేవారికి.. 'హలో మోగీనంద్' సమాధానం చెప్పింది.​ 7 నెలల క్రితం ప్రారంభమైన ఆ క్యాంపస్​ రేడియోకు దేశ విదేశాల్లో విశేష ఆదరణ లభించింది. అందుకే మరింత ఉత్సాహంతో కొత్త కార్యక్రమాలను రూపొందిస్తోంది.

author img

By

Published : Aug 31, 2019, 5:12 AM IST

Updated : Sep 28, 2019, 10:45 PM IST

రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!
రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!

హిమాచల్​ప్రదేశ్​ నహన్​లోని ప్రభుత్వ పాఠశాల ప్రారంభించిన విద్యా రేడియో స్టేషన్ 'హలో మోగీనంద్' అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 7 నెలల్లో 7 వేల మంది శ్రోతలను సంపాదించుకుంది.

విద్యార్థులకు అవసరమయ్యే కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేస్తుంది ఈ రేడియో స్టేషన్​. ఇలాంటివి దేశంలో మరో 5 మాత్రమే ఉన్నాయి. క్యాంపస్​ రేడియోగా ప్రారంభమైన 'హలో మోగీనంద్​'.. మనదేశంలోనే కాక విదేశాల్లోనూ మారుమోగుతోంది.

పెరుగుతున్న శ్రోతల సంఖ్యను చూసి పాఠశాల నిర్వాహకుల ఉత్సాహం రెట్టింపైంది. సెప్టెంబర్ 12 తరువాత మరో 5 కొత్త విద్యా సంబంధిత కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

"ఈ రేడియో స్టేషన్‌ను ప్రారంభించడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. పాఠశాలకు హాజరుకాలేని పిల్లలు ఈ రేడియో ద్వారా పాఠాలు వినవచ్చు. రేడియో కొత్త షెడ్యూల్​ ప్రకారం విద్యా సంగీతం, ఇంటర్వ్యూ వంటి కార్యక్రమాలు జోడిస్తాం. 'బులందీ' పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాలు చేసిన వారిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం."

-సంజీవ్​ అథ్రి, రేడియో స్టేషన్ డైరెక్టర్

ఇదీ చూడండి:12వేల టెంకాయలతో నారికేళ గణనాథుడు!

రేడియో గురూ: పాఠాలు చెప్పే ఆకాశవాణికి శ్రోతలెందరో!

హిమాచల్​ప్రదేశ్​ నహన్​లోని ప్రభుత్వ పాఠశాల ప్రారంభించిన విద్యా రేడియో స్టేషన్ 'హలో మోగీనంద్' అనతికాలంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కేవలం 7 నెలల్లో 7 వేల మంది శ్రోతలను సంపాదించుకుంది.

విద్యార్థులకు అవసరమయ్యే కార్యక్రమాలు మాత్రమే ప్రసారం చేస్తుంది ఈ రేడియో స్టేషన్​. ఇలాంటివి దేశంలో మరో 5 మాత్రమే ఉన్నాయి. క్యాంపస్​ రేడియోగా ప్రారంభమైన 'హలో మోగీనంద్​'.. మనదేశంలోనే కాక విదేశాల్లోనూ మారుమోగుతోంది.

పెరుగుతున్న శ్రోతల సంఖ్యను చూసి పాఠశాల నిర్వాహకుల ఉత్సాహం రెట్టింపైంది. సెప్టెంబర్ 12 తరువాత మరో 5 కొత్త విద్యా సంబంధిత కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు సిద్ధమవుతున్నారు.

"ఈ రేడియో స్టేషన్‌ను ప్రారంభించడం వెనుక ఓ ప్రత్యేక కారణం ఉంది. పాఠశాలకు హాజరుకాలేని పిల్లలు ఈ రేడియో ద్వారా పాఠాలు వినవచ్చు. రేడియో కొత్త షెడ్యూల్​ ప్రకారం విద్యా సంగీతం, ఇంటర్వ్యూ వంటి కార్యక్రమాలు జోడిస్తాం. 'బులందీ' పేరిట ఒక ప్రత్యేక కార్యక్రమం ప్రారంభించి చుట్టుపక్కల ప్రాంతాల్లో వినూత్న కార్యక్రమాలు చేసిన వారిని ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాం."

-సంజీవ్​ అథ్రి, రేడియో స్టేషన్ డైరెక్టర్

ఇదీ చూడండి:12వేల టెంకాయలతో నారికేళ గణనాథుడు!

Tirumala (Andhra Pradesh), Aug 30 (ANI): Indian badminton player PV Sindhu visited Balaji Temple in AP's Tirumala on August 30. She had won gold medal at the BWF World Championships on August 25. Meanwhile, Union Minister of Law and Justice Ravi Shankar Prasad also offered prayers at the temple.
Last Updated : Sep 28, 2019, 10:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.