ETV Bharat / bharat

క్లాస్​కు వెళ్లకుండానే ఐఐటీ నుంచి డిగ్రీ పట్టా!

author img

By

Published : Jul 1, 2020, 1:21 PM IST

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు సరికొత్త బంపర్​ ఆఫర్​ ప్రకటించింది కేంద్ర మానవ వనరుల అభివృధ్ధి శాఖ(హెచ్‌ఆర్డీ). కాలేజీకి వెళ్లకుండానే ఐఐటీలో కోర్సు చేసి, సర్టిఫికేట్​ పొందే అవకాశం కల్పిస్తోంది. జులై 1న నాసిక్​లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు కేంద్రమంత్రి శ్రీ రమేశ్​ పోఖ్రియాల్​. ఆ కోర్సు పూర్తి వివరాలు తెలుసుకుందాం...

iit madras first ever virtual drgree course
ప్రపంచంలోనే తొలిసారి.. క్లాస్​లకు వెళ్లకుండానే ఐఐటీ పట్టా?

ప్రతిరోజు కళాశాలకు వెళ్లకుండానే డిగ్రీ సర్టిఫికేట్​ పొందేందుకు మార్గం సుగమం చేసింది ఐఐటీ మద్రాస్​. ప్రపంచంలో తొలిసారి ఆన్​లైన్​ డిగ్రీ, డిప్లమో కోర్సులను ప్రవేశపెట్టింది. ప్రోగ్రామింగ్​, డేటా సైన్సెస్​లో ఈ అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఈ కోర్సుకు ఎవరు అర్హులు? ఎలా ఎంపిక చేస్తారు? వంటి వివరాలు చూద్దాం.

ఎలా అప్లై చేసుకోవాలి..?

డిప్లమోలో చేరాలనుకుంటే విద్యార్థి 10వ తరగతిలో మ్యాథ్స్​, ఇంగ్లీష్​ సబ్జెక్టులను కచ్చితంగా చదవాలి. వాటితో పాటు ఇంటర్​ పూర్తి చేయాలి. డిగ్రీలో చేరేందుకు అప్లికేషన్​ పెట్టుకున్న వాళ్లు, డిగ్రీ చదివిన వాళ్లు, మధ్యలోనే డిగ్రీ ఆపేసిన వాళ్లు అర్హులు. దీనికి ఓ అర్హత పరీక్ష ఉంటుంది. దరఖాస్తు రుసుం 3వేల రూపాయలు. ఇందులో 50 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​ కోర్సులో..

ఈ ఆన్​లైన్​ కోర్సు ప్రోగ్రామ్​లో మూడు లెవెల్స్​ ఉంటాయి. ఫౌండేషన్​ లెవల్​, డిప్లమో, డిగ్రీ. ఇందులో ఎప్పుడైనా విద్యార్థి నిష్క్రమించొచ్చు. లేదంటే మూడింటినీ పూర్తి చేయొచ్చు. ఇందులో మొత్తం 31 కోర్సులు ఉంటాయి. వాటిని మూడు నుంచి ఆరేళ్లలో పూర్తి చేయొచ్చు. ఆన్​లైన్​ కోర్సులు, ఎసైన్​మెంట్లు, క్విజ్​లు, పరీక్షలు వర్చువల్​గా జరుగుతాయి. వాటికి 116 క్రెడిట్​లు ఇస్తారు.

iit madras first ever virtual drgree course
సెమిస్టర్​ వారీగా కోర్సులు

కోర్సులను ఎంపికచేసుకున్న విద్యార్థులకు రెండు ఎంట్రీ ఆప్షన్లు ఉంటాయి.

1. రెగ్యులర్​:

12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ రెగ్యులర్​ ఎంట్రీ ద్వారా ఫౌండేషన్​ లెవల్​ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మ్యాథ్స్​, స్టాటిస్టిక్స్​, కంప్యుటేషనల్​ థింకింగ్​, పైథాన్​ ప్రోగ్రామింగ్​, ఇంగ్లీష్​ వంటి సబ్జెక్టులు ఉంటాయి. దీనిలోనే డిప్లమో, డిగ్రీ లెవల్​ కోర్సులు చేయొచ్చు.

2. డిప్లమో:

ఈ ఎంట్రీ ద్వారా కోర్సు నేర్చుకునేందుకు ప్రొఫెషనల్​ వర్కర్లకు అవకాశమిచ్చారు. డిప్లమో ఇన్​ ప్రోగ్రామింగ్​, డిప్లమో ఇన్​ డేటాసైన్స్​ చేరొచ్చు. ఈ కోర్సులను మద్రాస్​ ఐఐటీ అందిస్తోంది. వీరికి డిగ్రీ లెవల్​ కోర్సులు చదివేందుకు అవకాశం ఉండదు.

iit madras first ever virtual drgree course
ఎంట్రీ ఎలా

ఫీజులు...

ఈ కోర్సు మొత్తం ఫీజు రూ.2,42,000

  • ఫౌండేషన్​ లెవల్​: రూ.32,000 (8 కోర్సులకు)
  • డిప్లమో లెవల్​: రూ.1,12,000 (12 కోర్సులకు)
  • డిగ్రీ లెవల్​: రూ.1,00,000 (11 కోర్సులకు)

డేటా సైన్స్​లో విపరీతంగా అవకాశాలు పెరుగుతున్నాయి. 2026 నాటికి 11.5 మిలియన్​ జాబ్​లు ఈ కోర్సు ద్వారా వస్తాయని అంచనా. అందుకే ఈ కోర్సును ప్రత్యేకంగా అందిస్తోంది ఐఐటీ మద్రాస్​. త్వరలో ఆన్​లైన్​ ఆప్లికేషన్​ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు, అప్లికేషన్​ దరఖాస్తు తేదీల కోసం "onlinedegree.iitm.ac.in" వెబ్​సైట్​ చూడండి.

ప్రతిరోజు కళాశాలకు వెళ్లకుండానే డిగ్రీ సర్టిఫికేట్​ పొందేందుకు మార్గం సుగమం చేసింది ఐఐటీ మద్రాస్​. ప్రపంచంలో తొలిసారి ఆన్​లైన్​ డిగ్రీ, డిప్లమో కోర్సులను ప్రవేశపెట్టింది. ప్రోగ్రామింగ్​, డేటా సైన్సెస్​లో ఈ అవకాశాలు కల్పిస్తోంది. అయితే ఈ కోర్సుకు ఎవరు అర్హులు? ఎలా ఎంపిక చేస్తారు? వంటి వివరాలు చూద్దాం.

ఎలా అప్లై చేసుకోవాలి..?

డిప్లమోలో చేరాలనుకుంటే విద్యార్థి 10వ తరగతిలో మ్యాథ్స్​, ఇంగ్లీష్​ సబ్జెక్టులను కచ్చితంగా చదవాలి. వాటితో పాటు ఇంటర్​ పూర్తి చేయాలి. డిగ్రీలో చేరేందుకు అప్లికేషన్​ పెట్టుకున్న వాళ్లు, డిగ్రీ చదివిన వాళ్లు, మధ్యలోనే డిగ్రీ ఆపేసిన వాళ్లు అర్హులు. దీనికి ఓ అర్హత పరీక్ష ఉంటుంది. దరఖాస్తు రుసుం 3వేల రూపాయలు. ఇందులో 50 శాతం మార్కులు రావాల్సి ఉంటుంది.

ఆన్​లైన్​ కోర్సులో..

ఈ ఆన్​లైన్​ కోర్సు ప్రోగ్రామ్​లో మూడు లెవెల్స్​ ఉంటాయి. ఫౌండేషన్​ లెవల్​, డిప్లమో, డిగ్రీ. ఇందులో ఎప్పుడైనా విద్యార్థి నిష్క్రమించొచ్చు. లేదంటే మూడింటినీ పూర్తి చేయొచ్చు. ఇందులో మొత్తం 31 కోర్సులు ఉంటాయి. వాటిని మూడు నుంచి ఆరేళ్లలో పూర్తి చేయొచ్చు. ఆన్​లైన్​ కోర్సులు, ఎసైన్​మెంట్లు, క్విజ్​లు, పరీక్షలు వర్చువల్​గా జరుగుతాయి. వాటికి 116 క్రెడిట్​లు ఇస్తారు.

iit madras first ever virtual drgree course
సెమిస్టర్​ వారీగా కోర్సులు

కోర్సులను ఎంపికచేసుకున్న విద్యార్థులకు రెండు ఎంట్రీ ఆప్షన్లు ఉంటాయి.

1. రెగ్యులర్​:

12వ తరగతి పూర్తి చేసుకున్న విద్యార్థులు ఈ రెగ్యులర్​ ఎంట్రీ ద్వారా ఫౌండేషన్​ లెవల్​ కోర్సును ఎంపిక చేసుకోవచ్చు. ఇందులో మ్యాథ్స్​, స్టాటిస్టిక్స్​, కంప్యుటేషనల్​ థింకింగ్​, పైథాన్​ ప్రోగ్రామింగ్​, ఇంగ్లీష్​ వంటి సబ్జెక్టులు ఉంటాయి. దీనిలోనే డిప్లమో, డిగ్రీ లెవల్​ కోర్సులు చేయొచ్చు.

2. డిప్లమో:

ఈ ఎంట్రీ ద్వారా కోర్సు నేర్చుకునేందుకు ప్రొఫెషనల్​ వర్కర్లకు అవకాశమిచ్చారు. డిప్లమో ఇన్​ ప్రోగ్రామింగ్​, డిప్లమో ఇన్​ డేటాసైన్స్​ చేరొచ్చు. ఈ కోర్సులను మద్రాస్​ ఐఐటీ అందిస్తోంది. వీరికి డిగ్రీ లెవల్​ కోర్సులు చదివేందుకు అవకాశం ఉండదు.

iit madras first ever virtual drgree course
ఎంట్రీ ఎలా

ఫీజులు...

ఈ కోర్సు మొత్తం ఫీజు రూ.2,42,000

  • ఫౌండేషన్​ లెవల్​: రూ.32,000 (8 కోర్సులకు)
  • డిప్లమో లెవల్​: రూ.1,12,000 (12 కోర్సులకు)
  • డిగ్రీ లెవల్​: రూ.1,00,000 (11 కోర్సులకు)

డేటా సైన్స్​లో విపరీతంగా అవకాశాలు పెరుగుతున్నాయి. 2026 నాటికి 11.5 మిలియన్​ జాబ్​లు ఈ కోర్సు ద్వారా వస్తాయని అంచనా. అందుకే ఈ కోర్సును ప్రత్యేకంగా అందిస్తోంది ఐఐటీ మద్రాస్​. త్వరలో ఆన్​లైన్​ ఆప్లికేషన్​ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు, అప్లికేషన్​ దరఖాస్తు తేదీల కోసం "onlinedegree.iitm.ac.in" వెబ్​సైట్​ చూడండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.