ETV Bharat / bharat

కశ్మీర్​లో నివాస పత్రం పొందిన తొలి ఐఏఎస్​ - ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్ చౌదరి

జమ్ముకశ్మీర్​లోని ఐఏఎస్​ అధికారి నవీన్​ కుమార్​ నివాస ధ్రువీకరణ పత్రం పొందిన తొలి స్థానికేతర సివిల్ సర్వెంట్​గా గుర్తింపు పొందారు. బిహార్​కు చెందిన నవీన్​ 1994 నుంచి జమ్ముకశ్మీర్​లో పనిచేస్తున్నారు.

IAS officer
నివాస పత్రం
author img

By

Published : Jun 26, 2020, 3:16 PM IST

బిహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్ చౌదరి జమ్ముకశ్మీర్‌లో నివాస ధ్రువీకరణ పత్రం పొందారు. జమ్ములోని గాంధీనగర్​ నివాసిగా నవీన్​ను ధ్రువీకరించారు తహసీల్దార్​ రోహిత్​ శర్మ. ఈ పత్రం పొందిన మొదటి స్థానికేతర సివిల్ సర్వెంట్​ నవీన్.

IAS officer
నివాస పత్రం

అధికరణ 370 రద్దుతో..

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత శాశ్వత నివాస చట్టాన్ని తొలగించారు. ఫలితంగా స్థానికేతరులకు నివాసితులుగా గుర్తించేందుకు అవకాశం ఏర్పడింది. కొత్తగా తీసుకొచ్చిన జమ్ముకశ్మీర్​ గ్రాంట్​ డొమిసిల్ నిబంధనలు-2020 ప్రకారం 15 ఏళ్లుగా అక్కడ నివసించేవారు నివాస పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటివరకు 33,157 మంది దరఖాస్తు చేసుకోగా 25వేల మందికి నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు అధికారులు.

1994 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్​ అధికారి నవీన్​ కుమార్​ జమ్ముకశ్మీర్​ కేడర్​కు ఎంపికయ్యారు.

బిహార్‌కు చెందిన ఐఏఎస్ అధికారి నవీన్ కుమార్ చౌదరి జమ్ముకశ్మీర్‌లో నివాస ధ్రువీకరణ పత్రం పొందారు. జమ్ములోని గాంధీనగర్​ నివాసిగా నవీన్​ను ధ్రువీకరించారు తహసీల్దార్​ రోహిత్​ శర్మ. ఈ పత్రం పొందిన మొదటి స్థానికేతర సివిల్ సర్వెంట్​ నవీన్.

IAS officer
నివాస పత్రం

అధికరణ 370 రద్దుతో..

జమ్ముకశ్మీర్​ స్వయం ప్రతిపత్తి రద్దు చేసిన తర్వాత శాశ్వత నివాస చట్టాన్ని తొలగించారు. ఫలితంగా స్థానికేతరులకు నివాసితులుగా గుర్తించేందుకు అవకాశం ఏర్పడింది. కొత్తగా తీసుకొచ్చిన జమ్ముకశ్మీర్​ గ్రాంట్​ డొమిసిల్ నిబంధనలు-2020 ప్రకారం 15 ఏళ్లుగా అక్కడ నివసించేవారు నివాస పత్రం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇప్పటివరకు 33,157 మంది దరఖాస్తు చేసుకోగా 25వేల మందికి నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారు అధికారులు.

1994 బ్యాచ్​కు చెందిన ఐఏఎస్​ అధికారి నవీన్​ కుమార్​ జమ్ముకశ్మీర్​ కేడర్​కు ఎంపికయ్యారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.