మద్యానికి బానిసైన ఓ భర్త, అతడి భార్య మధ్య తలెత్తిన వివాదం.. విషాదంగా ముగిసింది. ఛత్తీస్గఢ్లోని భిలాయ్ కంటోన్మెంట్ ప్రాంతంలో రూ.50 ఇవ్వలేదని భార్యపై ఆగ్రహించిన భర్త.. ఆమెను ఇనుప రాడ్తో కొట్టి చంపాడు. అనంతరం తానూ చెయ్యి కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు.
ఇదీ జరిగింది..
రాజ్కుమార్ పటేల్(40), అనితా పటేల్(35) సుపేలా పోలీస్ స్టేషన్ పరిధిలోని భిలాయ్లో ఓ కిరాయి ఇంట్లో నివాసముంటున్నారు. ఇద్దరూ నిర్మాణ పనుల్లో కూలీలుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే.. రాజ్కుమార్ కొద్దిరోజులుగా కూలీకి వెళ్లడం మానేసి.. మద్యానికి బానిసయ్యాడు. కొద్దిరోజులుగా మతిస్తిమితం సరిగా లేని అతడు.. రూ. 50 కోసం భార్యతో వాగ్వాదానికి దిగాడు. డబ్బులు ఇచ్చేందుకు ఆమె నిరాకరించగా.. ఇనుప రాడ్తో తలపై బలంగా కొట్టాడు. తీవ్ర గాయాలైన ఆమె.. అక్కడిక్కడే మృతిచెందినట్టు స్థానికులు తెలిపారు.
![Husband killed his wife for Rs.50 at Bhilai Cantonment in Chhattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10187528_2.jpg)
![Husband killed his wife for Rs.50 at Bhilai Cantonment in Chhattisgarh](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/10187528_1.jpg)