'ఏది తాగితే.. కరోనా మైండ్ బ్లాక్ అయి.. కళ్లు తిరిగి పడిపోతుందో.. అదే గోమూత్రం' అంటున్నారు అఖిల భారత హిందూ మహాసభల అధ్యక్షుడు చక్రపాణి మహరాజ్ స్వామీజీ. కరోనాను తరిమికొట్టేందుకే దిల్లీలో గోమూత్రం పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
పార్టీకి విచ్చేసిన భక్తులంతా గ్లాసులు గ్లాసులు గోపంచకాన్ని సేవించి తన్మయత్వంలో మునిగితేలారు. గోమూత్రం తాగడం వల్ల 100శాతం కరోనా నయమవుతుందన్నారు స్వామీజీ. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం 2 చెంచాల గోపంచకాన్ని సేవించడం వల్ల ఆరోగ్యంగా ఉంటారని స్పష్టం చేశారు. ఈ గోమూత్ర వేడుకలను దేశమంతా ఇదే స్థాయిలో నిర్వహిస్తామని తెలిపారు.
"చూడండి నేను చెప్పేది ఒక్కటే.. జీవహత్యలు చేయడం వల్ల కరోనా ఉద్భవించింది. ఆ వైరస్ను శాంతింపజేసేందుకు మేము ప్రార్థనలు చేశాం. గోమూత్రంలో అన్ని తత్వాలు కలగలిసి ఉంటాయి. అందుకే నేను ఈ గోమూత్ర వేడుకను ఏర్పాటు చేశాను. కరోనా వల్ల చైనాలో వైద్యులే చనిపోతున్నారు. అందుకే చెబుతున్నా.. ప్రతి ఒక్కరు గోమూత్రం సేవించండి. యజ్ఞాలు చేసి, శాంతి పూజలు చేయండి. మంత్రులు కూడా రహస్యంగా గోపంచకాన్ని తాగుతారు. "
-చక్రపాణి మహారాజ్, స్వామీజీ
ఇదీ చదవండి:మాస్కుల లోటు తీర్చేందుకు కేరళ ముందడుగు