ETV Bharat / bharat

'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదతో కప్పుతున్నారు'

author img

By

Published : Dec 28, 2019, 10:35 PM IST

పౌరచట్టం, ఎన్​ఆర్​సీలపై విపక్షాలు చేస్తోన్న ఆరోపణలపై మండిపడ్డారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి మక్తార్​ అబ్బాస్​ నఖ్వీ. 'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదలతో కప్పుతున్నారు' అని ఎద్దేవా చేశారు.

Hiding mountain of truth with bushes of lies: Naqvi on anti-   CAA protests
'నిజమనే పర్వతాన్ని అబద్ధమనే పొదతో కప్పుతున్నారు'

దేశ వ్యాప్తంగా పౌరచట్టం, జాతీయ పౌర జాబితాపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ వారిపై మండిపడ్డారు. 'అబద్ధాల పొదతో నిజమనే కొండ'ను దాచటానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

"భారత్​లో ముస్లిం సోదరులను ఎవరూ బలవంతంగా ఉంచటం లేదు. దేశం మీద ఇష్టం, ప్రేమతోనే వారు ఇక్కడ జీవిస్తున్నారు. కొంత మంది రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏ, ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్​లపై దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాల పొదతో నిజమనే పర్వతాన్ని దాచటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా దేశంలోని ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి వివక్షలకు తావు లేకుండా అభివృద్ధి వైపు దృష్టి సారిస్తోంది."
-ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి.

మైనారిటీలకు పాకిస్థాన్​ నరక కూపమైతే భారత్​ స్వర్గధామమని నఖ్వీ అన్నారు. ఈ విషయాన్ని గుర్తించలేని కొన్ని శక్తులు దేశాన్ని బలహీన పరచటానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఆందోళనలను చేస్తోన్న వారిని 'అలా అయితే పాకిస్థాన్​ వెళ్లిపోండి' అని పోలీస్ అధికారి అన్న వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి. నిజంగా పోలీసు వారిని పాకిస్థాన్ వెళ్లమని అంటే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.

ఇదీ చూడండి:పోలీసులు నా మెడ పట్టుకుని కింద పడేశారు: ప్రియాంక

దేశ వ్యాప్తంగా పౌరచట్టం, జాతీయ పౌర జాబితాపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తోన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ వారిపై మండిపడ్డారు. 'అబద్ధాల పొదతో నిజమనే కొండ'ను దాచటానికి ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు.

"భారత్​లో ముస్లిం సోదరులను ఎవరూ బలవంతంగా ఉంచటం లేదు. దేశం మీద ఇష్టం, ప్రేమతోనే వారు ఇక్కడ జీవిస్తున్నారు. కొంత మంది రాజకీయ ప్రయోజనాల కోసం సీఏఏ, ఎన్ఆర్​సీ, ఎన్​పీఆర్​లపై దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధాల పొదతో నిజమనే పర్వతాన్ని దాచటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటి ద్వారా దేశంలోని ముస్లింలకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎటువంటి వివక్షలకు తావు లేకుండా అభివృద్ధి వైపు దృష్టి సారిస్తోంది."
-ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి.

మైనారిటీలకు పాకిస్థాన్​ నరక కూపమైతే భారత్​ స్వర్గధామమని నఖ్వీ అన్నారు. ఈ విషయాన్ని గుర్తించలేని కొన్ని శక్తులు దేశాన్ని బలహీన పరచటానికి ప్రయత్నిస్తున్నాయని విమర్శలు గుప్పించారు.

ఉత్తర్​ప్రదేశ్​లో ఆందోళనలను చేస్తోన్న వారిని 'అలా అయితే పాకిస్థాన్​ వెళ్లిపోండి' అని పోలీస్ అధికారి అన్న వ్యాఖ్యలపై స్పందించారు మంత్రి. నిజంగా పోలీసు వారిని పాకిస్థాన్ వెళ్లమని అంటే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అన్నారు.

ఇదీ చూడండి:పోలీసులు నా మెడ పట్టుకుని కింద పడేశారు: ప్రియాంక

Lucknow (UP), Dec 28 (ANI): Congress leader Priyanka Gandhi Vadra arrived at former IPS officer SR Darapuri's house to meet his family in Lucknow. Darapuri was arrested in anti- Citizenship Amendment Act (CAA) protests in Uttar Pradesh. Earlier, Priyanka Gandhi's vehicle was stopped by police while she was enroute to his place.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.