ETV Bharat / bharat

'వ్యాక్సిన్ వస్తే భారత్​లో వారికే తొలి ప్రాధాన్యం'

author img

By

Published : Oct 12, 2020, 7:27 AM IST

కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదటి ప్రాధాన్యం ఎవరికి? అనే విషయంపై స్పష్టతనిచ్చారు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్​. వృత్తిపరంగా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారితో పాటు ఎవరెవరికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నారో తెలిపారు.

health minister  harshvardhan clarity on vaccine preferences
వ్యాక్సిన్ వస్తే వారికే తొలి ప్రాధాన్యం: ఆరోగ్య మంత్రి

కొవిడ్‌-19 ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి వ్యాక్సిన్‌ వినియోగంలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఆయన ఆదివారం 'సండే సంవాద్‌' ద్వారా మాట్లాడుతూ కొవిడ్‌ అంశంపై దేశం నలుమూలల నుంచి ప్రజలు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మొదటి ఛాన్స్ వారికే​...

తొలినాళ్లలో వ్యాక్సిన్‌ పరిమిత మోతాదులోనే అందుబాటులోకి వస్తుందని, అందువల్ల వృత్తిపరంగా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు, ఆరోగ్యరీత్యా అధిక ముప్పు ఉన్న వారికి, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువ ఉన్నవారికి, మరణం ముప్పు పొంచి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

త్వరలో భారత్‌లో విభిన్న రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, అందులో కొన్ని.. నిర్దిష్ట వయసుల వారికి పనికొస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు, యువతకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు వస్తున్న వదంతులను ఆయన తోసిపుచ్చారు.

చర్చలు జరుగుతున్నాయ్...

అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై (ఎమర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ప్రజారోగ్య భద్రత, వ్యాక్సిన్‌ సమర్థతపై నిర్దిష్ట సమాచారం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్‌ టీకాలపై జరుగుతున్న క్లినికల్‌ ప్రయోగాలు 1, 2, 3 దశల్లో ఉన్నాయన్నారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. ఆ డేటా ఆధారంగానే టీకాల అత్యవసర అనుమతిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.

ఒకే సంస్థ నుంచి కష్టమే..

భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌లు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందని, క్యాడిలా హెల్త్‌కేర్‌ టీకాను 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. భారత్‌ లాంటి పెద్ద దేశంలో వ్యాక్సిన్‌ అవసరాలను ఒకే సంస్థ తీర్చలేదని పేర్కొన్నారు. జనాభా అవసరాలకు తగ్గట్టు సాధ్యమైనన్ని ఎక్కువ టీకాలను అనుమతించడానికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఫెలుదా పరీక్ష అంటే..

కరోనా నిర్ధారణ కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫెలూదా పరీక్షను కొద్దివారాల్లో ప్రవేశపెడతామని హర్షవర్ధన్‌ చెప్పారు. దీని పనితీరు ఇంచుమించుగా.. ప్రామాణిక ఆర్‌టీ పీసీఆర్‌ స్థాయిలోనే ఉందని వివరించారు.

అనేక రాష్ట్రాల్లో కొవిడ్‌ బాధితులకు మరోసారి ఇన్‌ఫెక్షన్‌ సోకుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. వాటిలో చాలా కేసులను రీ ఇన్‌ఫెక్షన్లుగా వర్గీకరించడం సరికాదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) విశ్లేషణలో వెల్లడైందన్నారు. బాధితులు కోలుకున్న తర్వాత చాలాకాలం పాటు వారిలోని మృత వైరస్‌లను ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష గుర్తిస్తుంటుందని తెలిపారు. వాటిని రీ ఇన్‌ఫెక్షన్‌గా భావించరాదన్నారు.

ఏ దేవుడూ చెప్పలేదు

రాబోయే పండగల సీజన్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హర్షవర్ధన్‌ సూచించారు. భారీగా గుమికూడటం వంటివి చేయరాదన్నారు. "ఆర్భాటంగా పండగలు చేసుకోవాలని, వాటికోసం ప్రాణాలు పణంగా పెట్టాలని ఏ మతం, దేవుడు చెప్పలేదు కదా" అని ఆయన పేర్కొన్నారు.

కొవిడ్‌-19 ముప్పు తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి వ్యాక్సిన్‌ వినియోగంలో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. ఆయన ఆదివారం 'సండే సంవాద్‌' ద్వారా మాట్లాడుతూ కొవిడ్‌ అంశంపై దేశం నలుమూలల నుంచి ప్రజలు అడిగిన వివిధ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.

మొదటి ఛాన్స్ వారికే​...

తొలినాళ్లలో వ్యాక్సిన్‌ పరిమిత మోతాదులోనే అందుబాటులోకి వస్తుందని, అందువల్ల వృత్తిపరంగా ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కొంటున్నవారు, ఆరోగ్యరీత్యా అధిక ముప్పు ఉన్న వారికి, ఇన్‌ఫెక్షన్‌ తీవ్రత ఎక్కువ ఉన్నవారికి, మరణం ముప్పు పొంచి ఉన్నవారికి తొలి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.

త్వరలో భారత్‌లో విభిన్న రకాల వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, అందులో కొన్ని.. నిర్దిష్ట వయసుల వారికి పనికొస్తాయని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవహారాలను దృష్టిలో ఉంచుకొని ఉద్యోగులు, యువతకు వ్యాక్సినేషన్‌లో ప్రాధాన్యం ఇవ్వబోతున్నట్లు వస్తున్న వదంతులను ఆయన తోసిపుచ్చారు.

చర్చలు జరుగుతున్నాయ్...

అత్యవసర పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ వినియోగానికి అనుమతులు ఇవ్వడంపై (ఎమర్జెన్సీ యూజ్‌ ఆథరైజేషన్‌) ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు తెలిపారు. అయితే ప్రజారోగ్య భద్రత, వ్యాక్సిన్‌ సమర్థతపై నిర్దిష్ట సమాచారం అవసరమని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌లో కొవిడ్‌ టీకాలపై జరుగుతున్న క్లినికల్‌ ప్రయోగాలు 1, 2, 3 దశల్లో ఉన్నాయన్నారు. వాటి ఫలితాలు రావాల్సి ఉందని తెలిపారు. ఆ డేటా ఆధారంగానే టీకాల అత్యవసర అనుమతిపై నిర్ణయం ఉంటుందని చెప్పారు.

ఒకే సంస్థ నుంచి కష్టమే..

భారత్‌ బయోటెక్‌, సీరం ఇన్‌స్టిట్యూట్‌లు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లను రెండు డోసుల్లో తీసుకోవాల్సి ఉంటుందని, క్యాడిలా హెల్త్‌కేర్‌ టీకాను 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. భారత్‌ లాంటి పెద్ద దేశంలో వ్యాక్సిన్‌ అవసరాలను ఒకే సంస్థ తీర్చలేదని పేర్కొన్నారు. జనాభా అవసరాలకు తగ్గట్టు సాధ్యమైనన్ని ఎక్కువ టీకాలను అనుమతించడానికున్న సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్లు చెప్పారు.

ఫెలుదా పరీక్ష అంటే..

కరోనా నిర్ధారణ కోసం స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఫెలూదా పరీక్షను కొద్దివారాల్లో ప్రవేశపెడతామని హర్షవర్ధన్‌ చెప్పారు. దీని పనితీరు ఇంచుమించుగా.. ప్రామాణిక ఆర్‌టీ పీసీఆర్‌ స్థాయిలోనే ఉందని వివరించారు.

అనేక రాష్ట్రాల్లో కొవిడ్‌ బాధితులకు మరోసారి ఇన్‌ఫెక్షన్‌ సోకుతున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ.. వాటిలో చాలా కేసులను రీ ఇన్‌ఫెక్షన్లుగా వర్గీకరించడం సరికాదని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) విశ్లేషణలో వెల్లడైందన్నారు. బాధితులు కోలుకున్న తర్వాత చాలాకాలం పాటు వారిలోని మృత వైరస్‌లను ఆర్‌టీ పీసీఆర్‌ పరీక్ష గుర్తిస్తుంటుందని తెలిపారు. వాటిని రీ ఇన్‌ఫెక్షన్‌గా భావించరాదన్నారు.

ఏ దేవుడూ చెప్పలేదు

రాబోయే పండగల సీజన్‌లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హర్షవర్ధన్‌ సూచించారు. భారీగా గుమికూడటం వంటివి చేయరాదన్నారు. "ఆర్భాటంగా పండగలు చేసుకోవాలని, వాటికోసం ప్రాణాలు పణంగా పెట్టాలని ఏ మతం, దేవుడు చెప్పలేదు కదా" అని ఆయన పేర్కొన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.