ETV Bharat / bharat

ఐక్యతా విగ్రహానికి రక్షణగా సీ​ఐఎస్ఎఫ్​ సిబ్బంది​

author img

By

Published : Aug 19, 2020, 9:16 PM IST

కరోనా విజృంభణ నేపథ్యంలో కొద్ది నెలలుగా మూతపడిన ఐక్యతా విగ్రహ సందర్శన త్వరలోనే పునఃప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ నెల 25 నుంచి అక్కడ 272మంది సీఐఎస్​ఎఫ్​ సిబ్బందిని మోహరిస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

Gujarat: 272 CISF personnel to guard Statue of Unity from August 25
ఐక్యతా విగ్రహానికి రక్షణగా 272మంది సీఎస్​ఐఎఫ్​ సిబ్బంది​

గుజరాత్ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​(సీఐఎస్​ఎఫ్​) సిబ్బంది మోహరింపునకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. తొలిదశలో భాగంగా ఈ నెల 25 నుంచి 272 మందిని అక్కడ మోహరించనున్నారు. ఈ మేరకు సీఐఎస్​ఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ రాజేశ్​ రంజన్​ పంపిన లేఖకు సమాధానమిచ్చింది కేంద్రం.

కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలలుగా ఐక్యతా విగ్రహ సందర్శనను నిలిపివేసింది ప్రభుత్వం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్​ 2 నుంచి సందర్శకులను అనుమతించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

గుజరాత్ కెవాడియాలోని ఐక్యతా విగ్రహం వద్ద సెంట్రల్​ ఇండస్ట్రియల్​ సెక్యూరిటీ ఫోర్స్​(సీఐఎస్​ఎఫ్​) సిబ్బంది మోహరింపునకు కేంద్ర హోంశాఖ అనుమతినిచ్చింది. తొలిదశలో భాగంగా ఈ నెల 25 నుంచి 272 మందిని అక్కడ మోహరించనున్నారు. ఈ మేరకు సీఐఎస్​ఎఫ్​ డైరెక్టర్​ జనరల్​ రాజేశ్​ రంజన్​ పంపిన లేఖకు సమాధానమిచ్చింది కేంద్రం.

కరోనా వ్యాప్తి కారణంగా కొన్ని నెలలుగా ఐక్యతా విగ్రహ సందర్శనను నిలిపివేసింది ప్రభుత్వం. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో సెప్టెంబర్​ 2 నుంచి సందర్శకులను అనుమతించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగాలకు ఒకే పరీక్ష- లాభాలు ఇవే...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.