ETV Bharat / bharat

చైనాతో 'సరిహద్దు' చర్చలపై కేంద్రం​ సమీక్ష!

భారత్​-చైనా మధ్య మే నెల నుంచి సరిహద్దు ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని తగ్గించేందుకు ఇరు దేశాలు మిలిటరీ స్థాయిలో అనేకమార్లు చర్చించాయి. తాజాగా ఈ చర్చలపై సమీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం​ నిర్ణయించినట్టు సమాచారం. ఈ బాధ్యతను సీఎస్​జీకి అప్పజెప్పినట్టు తెలుస్తోంది.

author img

By

Published : Oct 15, 2020, 5:09 AM IST

Govt to carry out review of military talks with China on border standoff
చైనాతో 'సరిహద్దు' చర్చలపై భారత్​ సమీక్ష!

చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన మిలిటరీ స్థాయి చర్చలపై సీఎస్​జీ(చైనా స్టడీ గ్రూప్​) సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. బలగాల ఉపసంహరణ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాని వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

సరిహద్దులో భారత్​-చైనా మధ్య మే నెల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన కార్ప్స్​ కమాండర్​ స్థాయీ భేటీ 12గంటల పాటు సాగింది.

సీఎస్​జీలో రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగమంత్రి జై శంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, త్రిదళాధిపతి బిపిన్​ రావత్​తో పాటు త్రివిధ దళాల అధిపతులు సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చూడండి:- 'సరిహద్దులో శాంతికి భారత్​-చైనా అంగీకారం'

'చైనాదే బాధ్యత...'

సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో బలగాల ఉపసంహరణపై పీఎల్​ఏ(పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ) ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఓ భారత సైన్యాధికారి వెల్లడించారు.

మరోవైపు.. బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసి.. ఉద్రిక్తతలను తగ్గించే బాధ్యత చైనాదేనని తేల్చిచెబుతోంది భారత్​.

ఇప్పటి భారత్​ వేరు..

చైనాతో సరిహద్దు వెంబడి అప్రమత్తంగా ఉన్న తీరే మన దేశం మారిందన్న విషయాన్ని చాటుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ పేర్కొన్నారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పును ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. చైనా వివాదం గురించి కేబినెట్​ సమావేశంలో చర్చకు రాలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా విలేకరులకు తెలిపారు.

ఇదీ చూడండి:- చైనా ముందుకు దూకితే అది 'తుగ్లక్'​ పనే అవుతుంది!

చైనాతో సరిహద్దు ఉద్రిక్తత నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు జరిగిన మిలిటరీ స్థాయి చర్చలపై సీఎస్​జీ(చైనా స్టడీ గ్రూప్​) సమీక్ష నిర్వహించనున్నట్టు సమాచారం. బలగాల ఉపసంహరణ సమస్య ఇంకా ఓ కొలిక్కి రాని వేళ ఈ వార్త ప్రాధాన్యం సంతరించుకుంది.

సరిహద్దులో భారత్​-చైనా మధ్య మే నెల నుంచి ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. వీటిని తగ్గించేందుకు ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఏడుసార్లు మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. తాజాగా జరిగిన కార్ప్స్​ కమాండర్​ స్థాయీ భేటీ 12గంటల పాటు సాగింది.

సీఎస్​జీలో రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​, విదేశాంగమంత్రి జై శంకర్​, జాతీయ భద్రతా సలహాదారు అజిత్​ డోభాల్​, త్రిదళాధిపతి బిపిన్​ రావత్​తో పాటు త్రివిధ దళాల అధిపతులు సభ్యులుగా ఉన్నారు.

ఇదీ చూడండి:- 'సరిహద్దులో శాంతికి భారత్​-చైనా అంగీకారం'

'చైనాదే బాధ్యత...'

సరిహద్దు సమస్యను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో బలగాల ఉపసంహరణపై పీఎల్​ఏ(పీపుల్స్​ లిబరేషన్​ ఆర్మీ) ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఓ భారత సైన్యాధికారి వెల్లడించారు.

మరోవైపు.. బలగాల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేసి.. ఉద్రిక్తతలను తగ్గించే బాధ్యత చైనాదేనని తేల్చిచెబుతోంది భారత్​.

ఇప్పటి భారత్​ వేరు..

చైనాతో సరిహద్దు వెంబడి అప్రమత్తంగా ఉన్న తీరే మన దేశం మారిందన్న విషయాన్ని చాటుతోందని కేంద్ర మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ పేర్కొన్నారు. 2014 తర్వాత దేశంలో వచ్చిన మార్పును ప్రజలు అర్థం చేసుకున్నారని చెప్పారు. చైనా వివాదం గురించి కేబినెట్​ సమావేశంలో చర్చకు రాలేదని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా విలేకరులకు తెలిపారు.

ఇదీ చూడండి:- చైనా ముందుకు దూకితే అది 'తుగ్లక్'​ పనే అవుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.