ETV Bharat / bharat

నేడు మోదీతో మెర్కెల్​ భేటీ.. 20 ఒప్పందాలపై సంతకం!

author img

By

Published : Nov 1, 2019, 5:16 AM IST

Updated : Nov 1, 2019, 11:39 AM IST

జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్​తో నేడు ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మెర్కెల్​ నిన్న దిల్లీ చేరుకున్నారు. ఇరువురు అగ్రనేతల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనున్నాయి. దాదాపు 20 ఒప్పందాలపై సంతకాలు చేసే అవకాశం ఉంది.

నేడు మోదీతో మెర్కెల్​ భేటీ.. 20 ఒప్పందాలపై సంతకం!
నేడు మోదీతో మెర్కెల్​ భేటీ.. 20 ఒప్పందాలపై సంతకం!

రెండు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిన్న రాత్రి దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ ఆమెకు స్వాగతం పలికారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోదీతో నేడు మెర్కెల్​ చర్చలు జరపనున్నారు.

రాష్ట్రపతి భవన్​లో జరిగే స్వాగత కార్యక్రమంలో ఏంజెలా పాల్గొంటారు. అనంతరం రాజ్​ఘాట్​లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.

"ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబధాలు మరింత బలోపేతమవుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్.. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ​5వ- ఐజీసీ ( ఇంటర్​ గవర్నమెంటల్​ కన్సల్టేషన్స్​)కి మెర్కెల్​ సహ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏడాది లోపల ఇరువురు అగ్రనేతల మధ్య ఇది అయిదవ భేటీ." - రవీష్​ కుమార్​, విదేశాంగ అధికార ప్రతినిధి

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో సాయంత్రం భేటీ అవుతారు మెర్కెల్. లోక్​కల్యాణ్​ మార్గ్​లో ఉన్న మోదీ నివాసంలో ప్రధానితో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇరువురు అగ్రనేతల మధ్య కశ్మీర్​ అంశం చర్చకు వస్తుందా లేదా అనే విషయంపై జర్మనీ రాయబారి స్పందించారు. వారి మధ్య ఎలాంటి విషయమైన చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే కశ్మీర్​పై ఐరోపా సమాఖ్య అభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఏంజెలా మెర్కెల్​ వాణిజ్య బృందంతో శనివారం సమావేశమవుతారు. గురుగ్రామ్​​ మానేసర్​లోని కాంటినెంటల్​ ఆటోమేటివ్​ కంపోనెంట్స్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ను సందర్శిస్తారు.

నేడు మోదీతో మెర్కెల్​ భేటీ.. 20 ఒప్పందాలపై సంతకం!

రెండు రోజుల పర్యటనలో భాగంగా జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ నిన్న రాత్రి దిల్లీకి చేరుకున్నారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్​ ఆమెకు స్వాగతం పలికారు. వాణిజ్యం, ఇంధనం, రక్షణ వంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్రమోదీతో నేడు మెర్కెల్​ చర్చలు జరపనున్నారు.

రాష్ట్రపతి భవన్​లో జరిగే స్వాగత కార్యక్రమంలో ఏంజెలా పాల్గొంటారు. అనంతరం రాజ్​ఘాట్​లోని మహాత్మా గాంధీ సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు.

"ఇరు దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక సంబధాలు మరింత బలోపేతమవుతున్నాయి. జర్మనీ ఛాన్సలర్​ ఏంజెలా మెర్కెల్.. రెండు రోజుల భారత పర్యటనలో భాగంగా దిల్లీ చేరుకున్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో పాటు ​5వ- ఐజీసీ ( ఇంటర్​ గవర్నమెంటల్​ కన్సల్టేషన్స్​)కి మెర్కెల్​ సహ అధ్యక్షులుగా వ్యవహరిస్తారు. ఏడాది లోపల ఇరువురు అగ్రనేతల మధ్య ఇది అయిదవ భేటీ." - రవీష్​ కుమార్​, విదేశాంగ అధికార ప్రతినిధి

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో సాయంత్రం భేటీ అవుతారు మెర్కెల్. లోక్​కల్యాణ్​ మార్గ్​లో ఉన్న మోదీ నివాసంలో ప్రధానితో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య దాదాపు 20 ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని సమాచారం. అయితే ఇరువురు అగ్రనేతల మధ్య కశ్మీర్​ అంశం చర్చకు వస్తుందా లేదా అనే విషయంపై జర్మనీ రాయబారి స్పందించారు. వారి మధ్య ఎలాంటి విషయమైన చర్చకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే కశ్మీర్​పై ఐరోపా సమాఖ్య అభిప్రాయానికి తాము కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.

ఏంజెలా మెర్కెల్​ వాణిజ్య బృందంతో శనివారం సమావేశమవుతారు. గురుగ్రామ్​​ మానేసర్​లోని కాంటినెంటల్​ ఆటోమేటివ్​ కంపోనెంట్స్​ ఇండియా ప్రైవేట్​ లిమిటెడ్​ను సందర్శిస్తారు.

Leh (JandK), Oct 31 (ANI): Radha Krishna Mathur took the oath as the first first Lieutenant Governor of the Union Territory of Ladakh. After taking the oath, he said that efforts will be made to carry out development work in all areas of the Union Territory. "Development is composite, efforts will be made to carry out development work in all areas. A development package will be made, and education and health will play an important role in it."
Last Updated : Nov 1, 2019, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.