అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) పురస్కరించుకొని కేరళ మహిళా, శిశు సంక్షేమ శాఖ ఓ వినూత్న ఆలోచన చేసింది. 'లింగ సమానత్వాన్ని' చాటిచెబుతూ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులతో కలిపి ఫుట్బాల్ మ్యాచ్లను నిర్వహించింది.
"మహిళా దినోత్సవం పురస్కరించుకుని 'లింగ సమానత్వాన్ని' చాటిచెప్పాలనే ఉద్దేశంతో విద్యార్థినీ, విద్యార్థులకు ఫుట్బాల్ మ్యాచ్లను నిర్వహించాం. ప్రతి జట్టు తరుపున ఆరుగురు అమ్మాయిలు, ఏడుగురు అబ్బాయిలు పాల్గొన్నారు."- షీభా జార్జ్ ఐఏఎస్, మహిళా, శిశు సంక్షేమశాఖ
తిరువనంతపురం 'చంద్రశేఖరన్ నాయర్ స్టేడియం'లో శనివారం నిర్వహించిన ఈ ఫుట్బాల్ మ్యాచ్ల్లో వివిధ కళాశాలల విద్యార్థినీ, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
"ఇది ఒక గొప్ప ప్రయత్నం. అబ్బాయిలతో పోల్చితే అమ్మాయిలు ఏ విషయంలోనూ తక్కువకాదు. అబ్బాయిలతో కలిసి ఫుట్బాల్ మ్యాచ్లు ఆడడం చాలా ఆనందంగా ఉంది." -ఎస్ శుభ, విద్యార్థిని.