ETV Bharat / bharat

అసోం-మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తత

author img

By

Published : Feb 10, 2021, 4:37 PM IST

అసోం-మిజోరం సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనలో పలు చోట్ల ఆస్తి నష్టం సంభవించగా, కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

assam, mizoram
అసోం మిజోరం సరిహద్దుల్లో ఉద్రిక్తత

అసోం, మిజోరం​ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మంత్రి సడక్​ యోజన కింద నిర్మిస్తున్న రోడ్డు విషయంలో అసోంలోని హైలకండీ జిల్లా కోచుర్తల్​ ప్రాంత ప్రజలకు, సరిహద్దు అవతల ఉన్న మిజోరం వాసులకు మధ్య వివాదమే ఇందుకు కారణం.

54 ఇళ్లు దగ్ధం..

మంగళవారం రాత్రి దుండగులు 54 ఇళ్లకు నిప్పంటించారని ఆరోపించిన కొచుర్తల్​ వాసులు.. ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందని వాపోయారు. ఇది మిజోరం​ వాసులు చేసిన పనేనని పేర్కొన్నారు. మిజోరం​ వాసులు కూడా అసోం ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బైరాబీ పోలీస్​ ఔట్​పోస్ట్​ వద్ద గ్రామ మండలి సభ్యుడు సహా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దుండగలు దాడి చేశారని ఆరోపించారు. అసోంలోని ఘర్మూరా ప్రాంతం నుంచి వచ్చిన వీరు స్థానిక అధ్యాపకుడి కుటుంబంపైన దాడి చేశారన్నారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

assam, mizoram
ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న కొచుర్తల్​ వాసులు
assam, mizoram
ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న కొచుర్తల్​ వాసులు

గతేడాది కూడా..

ఇరు రాష్ట్రాల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు ఇదివరకు కూడా నెలకొన్నాయి. గతేడాది ఆగస్టులో అసోంలోని లైలాపుర్​, మిజోరం​లోని వైరాంగ్తే గ్రామస్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన తర్వాత కేంద్రం, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇదీ చదవండి : శబరిమలకు భక్తుల రాకపై కేరళ కీలక నిర్ణయం

అసోం, మిజోరం​ సరిహద్దుల్లో ఉద్రిక్తత నెలకొంది. ప్రధాని మంత్రి సడక్​ యోజన కింద నిర్మిస్తున్న రోడ్డు విషయంలో అసోంలోని హైలకండీ జిల్లా కోచుర్తల్​ ప్రాంత ప్రజలకు, సరిహద్దు అవతల ఉన్న మిజోరం వాసులకు మధ్య వివాదమే ఇందుకు కారణం.

54 ఇళ్లు దగ్ధం..

మంగళవారం రాత్రి దుండగులు 54 ఇళ్లకు నిప్పంటించారని ఆరోపించిన కొచుర్తల్​ వాసులు.. ప్రాణభయంతో ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాల్సి వచ్చిందని వాపోయారు. ఇది మిజోరం​ వాసులు చేసిన పనేనని పేర్కొన్నారు. మిజోరం​ వాసులు కూడా అసోం ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా ఉన్న బైరాబీ పోలీస్​ ఔట్​పోస్ట్​ వద్ద గ్రామ మండలి సభ్యుడు సహా ఓ ప్రభుత్వ ఉద్యోగిపై దుండగలు దాడి చేశారని ఆరోపించారు. అసోంలోని ఘర్మూరా ప్రాంతం నుంచి వచ్చిన వీరు స్థానిక అధ్యాపకుడి కుటుంబంపైన దాడి చేశారన్నారు. ఈ దాడిలో వారు తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు.

assam, mizoram
ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న కొచుర్తల్​ వాసులు
assam, mizoram
ఇతర ప్రాంతాలకు తరలి వెళ్తున్న కొచుర్తల్​ వాసులు

గతేడాది కూడా..

ఇరు రాష్ట్రాల మధ్య ఇటువంటి ఉద్రిక్తతలు ఇదివరకు కూడా నెలకొన్నాయి. గతేడాది ఆగస్టులో అసోంలోని లైలాపుర్​, మిజోరం​లోని వైరాంగ్తే గ్రామస్థుల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటన తర్వాత కేంద్రం, ఇరు రాష్ట్ర ప్రభుత్వాల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

ఇదీ చదవండి : శబరిమలకు భక్తుల రాకపై కేరళ కీలక నిర్ణయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.