ETV Bharat / bharat

నలుగురు సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

నలుగురు నూతన సుప్రీం న్యాయమూర్తులు నేడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. జస్టిస్​ బి.ఆర్​ గవాయ్, జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ అనిరుద్దా బోస్​, జస్టిస్​ ఏ.ఎస్​.బోపన్నల రాకతో సుప్రీం కోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 31కి చేరింది.

author img

By

Published : May 24, 2019, 1:38 PM IST

Updated : May 24, 2019, 4:10 PM IST

నలుగురు సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం
నలుగురు సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

జస్టిస్​ బి.ఆర్​ గవాయ్, జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ అనిరుద్దా బోస్​, జస్టిస్​ ఏ.ఎస్​.బోపన్నలు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 27గా ఉన్న సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య వీరి రాకతో 31కి చేరింది.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ బుధవారం ఈ నలుగురు న్యాయమూర్తులకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

జస్టిస్​ అనిరుద్దా బోస్​, జస్టిస్​ ఏ.ఎస్.​ బోపన్నల పేర్లను ఇంతకుముందే కొలీజియం ప్రతిపాదించగా వారి నిజాయితీ, ప్రాంతాల ప్రాతినిధ్యం కారణాలుగా చూపించి కేంద్రం తిప్పి పంపించింది. ఈ అభ్యంతరాలను మే 8న తోసిపుచ్చిన కొలీజియం పదోన్నతికి యోగ్యతే ప్రధానమని అభిప్రాయపడింది. వీరిద్దరితో పాటు జస్టిస్​ బీఆర్​ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ పేర్లను కొత్తగా ప్రతిపాదించింది కొలీజియం.

జస్టిస్​ అనిరుద్దా బోస్​ ఇప్పటివరకు ఝార్ఖండ్​ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అఖిల భారత న్యాయమూర్తుల సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్నారు. జస్టిస్​ ఏఎస్​ బోస్​ గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.

జస్టిస్​ బీఆర్​ గవాయ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ సూర్యకాంత్‌ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించారు.

నలుగురు సుప్రీం న్యాయమూర్తుల ప్రమాణ స్వీకారం

జస్టిస్​ బి.ఆర్​ గవాయ్, జస్టిస్​ సూర్యకాంత్, జస్టిస్​ అనిరుద్దా బోస్​, జస్టిస్​ ఏ.ఎస్​.బోపన్నలు సుప్రీం కోర్టు న్యాయమూర్తులుగా నేడు ప్రమాణ స్వీకారం చేశారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. 27గా ఉన్న సుప్రీం న్యాయమూర్తుల సంఖ్య వీరి రాకతో 31కి చేరింది.

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ బుధవారం ఈ నలుగురు న్యాయమూర్తులకు నియామక ఉత్తర్వులు జారీ చేశారు.

జస్టిస్​ అనిరుద్దా బోస్​, జస్టిస్​ ఏ.ఎస్.​ బోపన్నల పేర్లను ఇంతకుముందే కొలీజియం ప్రతిపాదించగా వారి నిజాయితీ, ప్రాంతాల ప్రాతినిధ్యం కారణాలుగా చూపించి కేంద్రం తిప్పి పంపించింది. ఈ అభ్యంతరాలను మే 8న తోసిపుచ్చిన కొలీజియం పదోన్నతికి యోగ్యతే ప్రధానమని అభిప్రాయపడింది. వీరిద్దరితో పాటు జస్టిస్​ బీఆర్​ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌ పేర్లను కొత్తగా ప్రతిపాదించింది కొలీజియం.

జస్టిస్​ అనిరుద్దా బోస్​ ఇప్పటివరకు ఝార్ఖండ్​ హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. అఖిల భారత న్యాయమూర్తుల సీనియారిటీలో 12వ స్థానంలో ఉన్నారు. జస్టిస్​ ఏఎస్​ బోస్​ గువహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పని చేశారు. సీనియారిటీలో 36వ స్థానంలో ఉన్నారు.

జస్టిస్​ బీఆర్​ గవాయ్ బాంబే హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. జస్టిస్ సూర్యకాంత్‌ హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఇప్పటివరకు బాధ్యతలు నిర్వర్తించారు.


New Delhi, May 24 (ANI): Congress leader and son of former Prime Minister Lal Bahadur Shastri, Anil Shastri, said that the "negative campaign" against Prime Minister Narendra Modi has boomeranged. "Excessive negative campaign against the Prime Minister has not gone down well with the public," he told ANI. "Congress failed to address public issues," he added.
Last Updated : May 24, 2019, 4:10 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.