ETV Bharat / bharat

ఫుడ్​ డెలివరీ బాయ్​కి 'కరోనా'.. వాళ్లందరికీ షాక్​! - delhi corona news

ఆన్​లైన్​లో ఆర్డర్​ కొట్టగానే క్షణాల్లో ఇంటి కాలింగ్​ బెల్​ కొట్టే ఫుడ్​ డెలివరీ సంస్థలకు చుక్కెదురైంది. దిల్లీలో ఓ సంస్థ డెలివరీ బాయ్​కి కరోనా పాజిటివ్​ అని తేలింది. ఈ ఘటనతో ఆహార సరఫరా వ్యాపారానికి గట్టిదెబ్బ పడింది.

Food delivery business expected to slump further as pizza delivery boy tests COVID-19 positive
డెలివరీ బాయ్​కి సోకిన కరోనా.. ఆ వ్యాపారాలను ముంచేస్తోందా?
author img

By

Published : Apr 17, 2020, 7:07 AM IST

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​ కారణంగా.. రోజుకో హోటల్​ వంటకం రుచి చూసిన కొన్ని జిహ్వలు.. గత కొద్ది రోజులుగా చప్పబడిపోయాయి. కానీ ఏం చేస్తాం ఏది ముట్టుకుంటే కరోనా పట్టుకుంటుందో తెలీదని చాలామంది సర్దిచెప్పుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆన్​లైన్​ ఆర్డర్లతో ఆహారాన్నే ఇంటికి తెప్పించుకుని.. కరోనాను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనిపెట్టేసిన మహమ్మారి వైరస్​.. దిల్లీలోని ఓ పిజ్జా డెలివరీ బాయ్​కి సోకింది. అతడితో పాటు 72 కుటుంబాలను నిర్బంధంలోకి నెట్టింది. ఇంకేముంది.. ఒక్క పాజిటివ్​ కేసుతో ఫుడ్​ డెలివరీ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

తూర్పు దిల్లీ మాళవీయ నగర్​కు చెందిన ఓ ప్రైవేట్​ సంస్థ డెలివరీ బాయ్​(19)కి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు కలిసిన 72 కుటుంబాలను నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఫలితంగా డెలివరీ బాయ్స్​ పేరు వింటేనే హడలిపోతున్నారు దిల్లీ వాసులు. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​లో ఆర్డర్లు పెట్టుకుని ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని ప్రజలను కోరుతున్నాయి సంక్షేమ సంఘాలు.

" సోదరా.. కొద్ది రోజుల పాటు ఇంటి వంటతోనే సరిపెట్టికో. ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసుకుని అనవసరంగా నిర్బంధంలోకి వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ విషయాన్ని మేము వాట్సాప్​ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కానీ, వైరస్​ వ్యాప్తిని ఎలా అరికట్టాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే బావుంటుంది."

- బీఎస్​ వోహ్రా, స్థానికుల సంక్షేమ సంఘం ప్రతినిధి

'జాగ్రత్తలు తీసుకుంటాం నమ్మండి'

ఫుడ్​ డెలివరీ బాయ్​కు కరోనా సోకడం.. ఆహార వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్​ వ్యాప్తి వల్ల ఇప్పటికే ఈ రంగం దారుణంగా దెబ్బతింది. ఫలితంగా తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. అంతేకాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వినియోగదారులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలైతే ఏకంగా.. యాప్​లోనే డెలివరీ బాయ్​ శరీర ఉష్ణోగ్రతను చూసేలా.. సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాయి.

"ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని మేము కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం. మా సిబ్బందిని చాలా జాగ్రత్తగా అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఉంచుతున్నాం. హోటల్లోనే వారిని క్వారంటైన్​లో ఉండేలా చేశాం. "

-ద బ్లూ హోటల్​ డైరెక్టర్​.

ఆహార డెలివరీ సంస్థలు.. తమ డెలివరీ బాయ్స్​కు​ కరోనా జాగ్రత్తలు పాటించేలా పూర్తి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చూస్తున్నామని చెప్పారు.

"మా సంస్థ సేవలందించే 50 వేలకు పైగా రెస్టారెంట్లలలో పూర్తి శానిటైజేషన్​ అమలవుతోంది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. " అంటూ వినియోగదారులకు ధైర్యం చెబుతోంది జొమాటో.

ఇదీ చదవండి: మోదీ లాక్​డౌన్-2​ ప్రసంగం సూపర్​హిట్​.. టీవీల్లోనే 20 కోట్ల వీక్షణలు

కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్​డౌన్​ కారణంగా.. రోజుకో హోటల్​ వంటకం రుచి చూసిన కొన్ని జిహ్వలు.. గత కొద్ది రోజులుగా చప్పబడిపోయాయి. కానీ ఏం చేస్తాం ఏది ముట్టుకుంటే కరోనా పట్టుకుంటుందో తెలీదని చాలామంది సర్దిచెప్పుకుంటున్నారు. కానీ కొందరు మాత్రం ఆన్​లైన్​ ఆర్డర్లతో ఆహారాన్నే ఇంటికి తెప్పించుకుని.. కరోనాను బోల్తా కొట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కనిపెట్టేసిన మహమ్మారి వైరస్​.. దిల్లీలోని ఓ పిజ్జా డెలివరీ బాయ్​కి సోకింది. అతడితో పాటు 72 కుటుంబాలను నిర్బంధంలోకి నెట్టింది. ఇంకేముంది.. ఒక్క పాజిటివ్​ కేసుతో ఫుడ్​ డెలివరీ సంస్థల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

తూర్పు దిల్లీ మాళవీయ నగర్​కు చెందిన ఓ ప్రైవేట్​ సంస్థ డెలివరీ బాయ్​(19)కి కరోనా సోకింది. ప్రస్తుతం అతడు కలిసిన 72 కుటుంబాలను నిర్బంధంలో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు అధికారులు. ఫలితంగా డెలివరీ బాయ్స్​ పేరు వింటేనే హడలిపోతున్నారు దిల్లీ వాసులు. ఈ నేపథ్యంలో ఆన్​లైన్​లో ఆర్డర్లు పెట్టుకుని ప్రమాదాన్ని కొనితెచ్చుకోవద్దని ప్రజలను కోరుతున్నాయి సంక్షేమ సంఘాలు.

" సోదరా.. కొద్ది రోజుల పాటు ఇంటి వంటతోనే సరిపెట్టికో. ఆన్​లైన్​లో ఆర్డర్​ చేసుకుని అనవసరంగా నిర్బంధంలోకి వెళ్లడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. ఈ విషయాన్ని మేము వాట్సాప్​ గ్రూపుల ద్వారా అవగాహన కల్పిస్తున్నాం. కానీ, వైరస్​ వ్యాప్తిని ఎలా అరికట్టాలో అర్థం కావట్లేదు. ప్రభుత్వం చొరవ తీసుకుంటే బావుంటుంది."

- బీఎస్​ వోహ్రా, స్థానికుల సంక్షేమ సంఘం ప్రతినిధి

'జాగ్రత్తలు తీసుకుంటాం నమ్మండి'

ఫుడ్​ డెలివరీ బాయ్​కు కరోనా సోకడం.. ఆహార వ్యాపారాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్​ వ్యాప్తి వల్ల ఇప్పటికే ఈ రంగం దారుణంగా దెబ్బతింది. ఫలితంగా తమ వ్యాపారాలను కాపాడుకునేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నారు వ్యాపారులు. అంతేకాకుండా జాగ్రత్తలు పాటిస్తున్నట్లు వినియోగదారులకు పూర్తి భరోసా ఇస్తున్నారు. కొన్ని ఫుడ్ డెలివరీ సంస్థలైతే ఏకంగా.. యాప్​లోనే డెలివరీ బాయ్​ శరీర ఉష్ణోగ్రతను చూసేలా.. సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెచ్చాయి.

"ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకొని మేము కొన్ని ముఖ్యమైన చర్యలు తీసుకున్నాం. మా సిబ్బందిని చాలా జాగ్రత్తగా అత్యంత పరిశుభ్ర వాతావరణంలో ఉంచుతున్నాం. హోటల్లోనే వారిని క్వారంటైన్​లో ఉండేలా చేశాం. "

-ద బ్లూ హోటల్​ డైరెక్టర్​.

ఆహార డెలివరీ సంస్థలు.. తమ డెలివరీ బాయ్స్​కు​ కరోనా జాగ్రత్తలు పాటించేలా పూర్తి శిక్షణ ఇస్తున్నట్లు తెలిపాయి. ప్రతి ఒక్కరు మాస్కులు ధరించేలా చూస్తున్నామని చెప్పారు.

"మా సంస్థ సేవలందించే 50 వేలకు పైగా రెస్టారెంట్లలలో పూర్తి శానిటైజేషన్​ అమలవుతోంది. మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. " అంటూ వినియోగదారులకు ధైర్యం చెబుతోంది జొమాటో.

ఇదీ చదవండి: మోదీ లాక్​డౌన్-2​ ప్రసంగం సూపర్​హిట్​.. టీవీల్లోనే 20 కోట్ల వీక్షణలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.