సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో రైతుల చేపట్టిన నిరసనలకు మద్దతుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ సభ ఆధ్వర్యంలో మహారాష్ట్రలో రైతులు భారీ ర్యాలీ చేపట్టారు. నాసిక్ నుంచి ముంబయి వైపు నిర్వహించిన ర్యాలీలో 15వేల మంది ప్రజలు పాల్గొన్నారు. అటు పంజాబ్లోని లుథియానాలోనూ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించారు. జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహిస్తున్న ట్రాక్టర్ ర్యాలీలో పాల్గొననున్నట్లు వెల్లడించారు.
జనవరి 26న దిల్లీలో రైతులు నిర్వహించనున్న కిసాన్ పరేడ్లో ఉత్తర్ప్రదేశ్, ఉత్తరాఖండ్ నుంచి దాదాపు 25000 ట్రాక్టర్లు పాల్గొననున్నాయని భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేష్ టికాయత్ శనివారం తెలిపారు. దేశ రాజధానిలో ట్రాక్టర్ ర్యాలీకి దిల్లీ పోలీసులు ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ర్యాలీ నిర్వహించే మార్గాలను త్వరలో సంయుక్త్ కిసాన్ మోర్చా నిర్ణయిస్తుందని తికాయత్ అన్నారు.
ఇదీ చదవండి:'ట్రాక్టర్ ర్యాలీ తర్వాతే తదుపరి కార్యాచరణ'