ETV Bharat / bharat

ఎగ్జిట్​పోల్స్​ కుట్రలో భాగం : మమతా బెనర్జీ

ఎగ్జిట్​పోల్స్​ వట్టి వదంతులని, వాటిని ప్రజలు నమ్మరని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. ఈవీఎమ్​లను తారుమారు చేయడానికి కుట్ర జరుగుతోందని ఆమె ఆరోపించారు.

author img

By

Published : May 19, 2019, 9:26 PM IST

Updated : May 19, 2019, 10:56 PM IST

ఎగ్జిట్​పోల్స్​ కుట్రలో భాగం : మమతా బెనర్జీ
ఎగ్జిట్​పోల్స్​ కుట్రలో భాగం : మమతా బెనర్జీ

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయావకాశాలపై వెలువడిన ఎగ్జిట్​ పోల్స్​పై తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ సర్వేలన్నీ వట్టి వదంతులని, ప్రజలు వాటిని నమ్మరని అన్నారు. ఈవీఎమ్​లను తారుమారు చేసే కుట్రలో ఇది భాగమని ట్విట్టర్​లో ఆరోపించారు.

"ఎగ్జిట్ పోల్స్​ వదంతులను నేను నమ్మను. వీటి ద్వారా వేల సంఖ్యలోని ఈవీఎమ్​లను తారుమారు చేయడానికి కుట్ర పన్నుతున్నారు. అన్ని విపక్షాలు బలంగా ఏకమవ్వాలని కోరుతున్నాను. మనం కలిసి బలంగా, ఐకమత్యంతో పోరాడదాం."
-మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి

బంగాల్​లో విడుదలైన కొన్ని ఎగ్జిట్​పోల్స్ తృణమూల్ కాంగ్రెస్​కు 24 సీట్లు, భాజపాకు 16 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్​ కేవలం 2 స్థానాలు దక్కించుకుంటుందని, వామపక్షాలకు తీవ్ర నిరాశ తప్పదని పేర్కొన్నాయి.

ఒమర్​దీ అదే మాట...

తాజా ఎగ్జిట్​పోల్స్​పై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

"ప్రతి ఎగ్జిట్​పోల్ సర్వే తప్పుకాదు. టీవీలు ఆపేయాల్సిన సమయమిది. సామాజిక మాధ్యమాల నుంచీ బయటకురావాలి. 23న విడుదల అయ్యే ఎన్నిక ఫలితాల కోసం వేచిచూడండి."
-ఒమర్​ అబ్దుల్లా, నేషనల్​ కాన్ఫరెన్స్ నేత

ఏడు విడతల్లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో... భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని అన్ని సర్వేలు తెలిపాయి. గెలిచే స్థానాల్లో చిన్నపాటి తేడాలున్నా... భాజపా గెలుపు ఖాయమని స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి:ఎగ్జిట్​ పోల్స్​: ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయంటే...

ఎగ్జిట్​పోల్స్​ కుట్రలో భాగం : మమతా బెనర్జీ

సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ పార్టీల విజయావకాశాలపై వెలువడిన ఎగ్జిట్​ పోల్స్​పై తృణమూల్​ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. ఈ సర్వేలన్నీ వట్టి వదంతులని, ప్రజలు వాటిని నమ్మరని అన్నారు. ఈవీఎమ్​లను తారుమారు చేసే కుట్రలో ఇది భాగమని ట్విట్టర్​లో ఆరోపించారు.

"ఎగ్జిట్ పోల్స్​ వదంతులను నేను నమ్మను. వీటి ద్వారా వేల సంఖ్యలోని ఈవీఎమ్​లను తారుమారు చేయడానికి కుట్ర పన్నుతున్నారు. అన్ని విపక్షాలు బలంగా ఏకమవ్వాలని కోరుతున్నాను. మనం కలిసి బలంగా, ఐకమత్యంతో పోరాడదాం."
-మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి

బంగాల్​లో విడుదలైన కొన్ని ఎగ్జిట్​పోల్స్ తృణమూల్ కాంగ్రెస్​కు 24 సీట్లు, భాజపాకు 16 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. కాంగ్రెస్​ కేవలం 2 స్థానాలు దక్కించుకుంటుందని, వామపక్షాలకు తీవ్ర నిరాశ తప్పదని పేర్కొన్నాయి.

ఒమర్​దీ అదే మాట...

తాజా ఎగ్జిట్​పోల్స్​పై జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు.

"ప్రతి ఎగ్జిట్​పోల్ సర్వే తప్పుకాదు. టీవీలు ఆపేయాల్సిన సమయమిది. సామాజిక మాధ్యమాల నుంచీ బయటకురావాలి. 23న విడుదల అయ్యే ఎన్నిక ఫలితాల కోసం వేచిచూడండి."
-ఒమర్​ అబ్దుల్లా, నేషనల్​ కాన్ఫరెన్స్ నేత

ఏడు విడతల్లో జరిగిన లోక్​సభ ఎన్నికల్లో... భాజపా నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మళ్లీ అధికారం చేజిక్కించుకుంటుందని అన్ని సర్వేలు తెలిపాయి. గెలిచే స్థానాల్లో చిన్నపాటి తేడాలున్నా... భాజపా గెలుపు ఖాయమని స్పష్టం చేశాయి.

ఇదీ చూడండి:ఎగ్జిట్​ పోల్స్​: ఎవరి లెక్కలు ఎలా ఉన్నాయంటే...

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Giza - 19 May 2019
1. Various of damaged windows on bombed tourist bus
2. Damaged windshield of another vehicle with bus in background
3. Damaged windows on bus
4. Various of rescue officials and security at bomb scene
STORYLINE:
A roadside bomb hit a tourist bus on Sunday near the Giza Pyramids, wounding at least 17 people including tourists, Egyptian officials said.
The officials said the bus was travelling on a road close to the construction site of the Grand Egyptian Museum, which is located adjacent to the Giza Pyramids but is not yet open to tourists.
The bus was carrying at least 25 people mostly from South Africa, officials added.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : May 19, 2019, 10:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.