ETV Bharat / bharat

'కరోనాపై పోరులో 'బాహుబలి' ప్రధాని విఫలం'

author img

By

Published : May 31, 2020, 6:16 PM IST

Updated : May 31, 2020, 6:26 PM IST

'బాహుబలి' ప్రధాని మోదీ.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోలేక ప్రజలను తీవ్రమైన బాధలకు గురి చేస్తున్నారని కాంగ్రెస్​ నాయకుడు కపిల్​ సిబల్​​ ఆరోపించారు. మహమ్మారి విషయంలో అసమర్థంగా వ్యవహరించారని మండిపడ్డారు.

Even a 'Bahubali PM' could not face coronavirus pandemic: Sibal
కరోనా ఎదుర్కొవటంలో 'బాహుబలి' ప్రధాని విఫలం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​. 'బాహుబలి' ప్రధాని.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోలేక దేశ ప్రజలను దుఖంలోకి నెట్టేశారంటూ మండిపడ్డారు. మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది కాలం గడిచిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు సిబల్​.

"లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారు. మార్చి 24 తర్వాత ప్రభుత్వం.. తన విభజన ఎజెండాతోనే లాక్​డౌన్​ను అమలు చేసింది. ప్రభుత్వ ఎజెండా ప్రజలను విభజించటమే."

కపిల్​ సిబల్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఎన్​పీఆర్​, సీఏఏ, యూఏపీఏ చట్టాల గురించి ఉదహరిస్తూ.. ఉగ్రవాదం నిర్మూలించటానికే యూఏపీఏ చట్టాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. పార్లమెంట్​లో​ చెప్పారని.. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

'కూలీల విషయంలోనూ వైఫల్యం...'

వలస కార్మికులు ఎన్నో అవస్థలు పడుతూ.. కాలి నడకన తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారని, కొందరైతే మార్గం మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారని, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు సిబల్​. కూలీలను తరలించే విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

'నేపాల్​ భారత్​పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మరోపక్క చైనాతోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరి ప్రధాని మాత్రం వారికి ధీటైన సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో?' చెప్పాలి అని సిబల్​ ప్రశ్నించారు. చైనా సరిహద్దు వద్ద ఏం జరుగుతోందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:చైనా దుర్నీతి: చర్చలు జరుపుతూనే సైన్యం మోహరింపు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబల్​. 'బాహుబలి' ప్రధాని.. కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోలేక దేశ ప్రజలను దుఖంలోకి నెట్టేశారంటూ మండిపడ్డారు. మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం రెండోసారి అధికారం చేపట్టి ఏడాది కాలం గడిచిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు సిబల్​.

"లాక్​డౌన్​ సమయంలో ప్రజలు ఒకరికొకరు సాయం చేసుకున్నారు. మార్చి 24 తర్వాత ప్రభుత్వం.. తన విభజన ఎజెండాతోనే లాక్​డౌన్​ను అమలు చేసింది. ప్రభుత్వ ఎజెండా ప్రజలను విభజించటమే."

కపిల్​ సిబల్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఎన్​పీఆర్​, సీఏఏ, యూఏపీఏ చట్టాల గురించి ఉదహరిస్తూ.. ఉగ్రవాదం నిర్మూలించటానికే యూఏపీఏ చట్టాన్ని తీసుకువచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్​షా.. పార్లమెంట్​లో​ చెప్పారని.. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు.

'కూలీల విషయంలోనూ వైఫల్యం...'

వలస కార్మికులు ఎన్నో అవస్థలు పడుతూ.. కాలి నడకన తమ సొంత రాష్ట్రాలకు వెళ్తున్నారని, కొందరైతే మార్గం మధ్యలోనే ప్రాణాలు విడుస్తున్నారని, ఇది ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని ఆరోపించారు సిబల్​. కూలీలను తరలించే విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని ఆయన పేర్కొన్నారు.

'నేపాల్​ భారత్​పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. మరోపక్క చైనాతోనూ ప్రతిష్టంభన కొనసాగుతోంది. మరి ప్రధాని మాత్రం వారికి ధీటైన సమాధానం చెప్పకుండా ఎందుకు మౌనంగా ఉన్నారో?' చెప్పాలి అని సిబల్​ ప్రశ్నించారు. చైనా సరిహద్దు వద్ద ఏం జరుగుతోందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి:చైనా దుర్నీతి: చర్చలు జరుపుతూనే సైన్యం మోహరింపు

Last Updated : May 31, 2020, 6:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.