ETV Bharat / bharat

ఏజేఎల్​ కేసులో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఛార్జిషీట్​

ఏజేఎల్​ భూకేటాయింపులకు సంబంధించిన కేసులో కాంగ్రెస్​ సీనియర్​ నేతలపై ఈడీ అభియోగ పత్రం దాఖలు చేసింది. ఈ కేసులో మొదటిసారి ఛార్జిషీటు దాఖలు చేసిన ఈడీ.. కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్​ వోరా, హరియాణా మాజీ సీఎం భూపేందర్​ సింగ్​ హుడా పేర్లను చేర్చింది.

author img

By

Published : Aug 27, 2019, 5:11 AM IST

Updated : Sep 28, 2019, 10:11 AM IST

ఏజేఎల్​ కేసులో ఇద్దరు కాంగ్రెస్ నేతలపై ఛార్జిషీట్​

అసోసియేట్​ జర్నల్స్​ లిమిటెడ్​ (ఏజేఎల్​)​​ కేసులో మొదటిసారి అభియోగ పత్రం దాఖలు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. 1992లో జరిగిన భూకేటాయింపులకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్​ నేత మోతీలాల్​ వోరా, హరియాణా మాజీ సీఎం భూపేందర్​సింగ్ హుడా పేర్లను ఛార్జిషీటులో చేర్చింది ఈడీ.

ఛండీగఢ్​ సమీపంలోని పంచకులలో ఏజేఎల్​ సంస్థకు భూములను కేటాయించారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మనీలాండరింగ్​ నియంత్రణ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి వోరా, హుడాలకు ప్రత్యక్ష పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. ఈ విషయంలో సీబీఐ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తోంది.

ఇదీ కేసు

1982లో ఏజేఎల్​కు హిందీ పత్రిక 'నవజీవన్​' నడపడానికి పంచకులలోని స్థలాన్ని కేటాయించారు. అయితే 1992 వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఫలితంగా హరియాణా పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్​యూడీఏ) ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

హరియాణా బీజేపీ నాయకుల విజ్ఞప్తితో సీబీఐ ఎఫ్​ఐఆర్ ఆధారంగా... 2016లో ఈడీ కూడా పీఎమ్​ఎల్​ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: 'ఏజేఎల్​' ప్లాట్​ స్వాధీనానికి ఈడీ సమాయత్తం

అసోసియేట్​ జర్నల్స్​ లిమిటెడ్​ (ఏజేఎల్​)​​ కేసులో మొదటిసారి అభియోగ పత్రం దాఖలు చేసింది ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​. 1992లో జరిగిన భూకేటాయింపులకు సంబంధించి కాంగ్రెస్ సీనియర్​ నేత మోతీలాల్​ వోరా, హరియాణా మాజీ సీఎం భూపేందర్​సింగ్ హుడా పేర్లను ఛార్జిషీటులో చేర్చింది ఈడీ.

ఛండీగఢ్​ సమీపంలోని పంచకులలో ఏజేఎల్​ సంస్థకు భూములను కేటాయించారు. ఈ వ్యవహారంలో అవకతవకలు జరిగాయని మనీలాండరింగ్​ నియంత్రణ చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించి వోరా, హుడాలకు ప్రత్యక్ష పాత్ర ఉందని ఈడీ ఆరోపించింది. ఈ విషయంలో సీబీఐ కూడా ఇప్పటికే కేసు నమోదు చేసి విచారిస్తోంది.

ఇదీ కేసు

1982లో ఏజేఎల్​కు హిందీ పత్రిక 'నవజీవన్​' నడపడానికి పంచకులలోని స్థలాన్ని కేటాయించారు. అయితే 1992 వరకు అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదు. ఫలితంగా హరియాణా పట్టణాభివృద్ధి సంస్థ (హెచ్​యూడీఏ) ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుంది.

హరియాణా బీజేపీ నాయకుల విజ్ఞప్తితో సీబీఐ ఎఫ్​ఐఆర్ ఆధారంగా... 2016లో ఈడీ కూడా పీఎమ్​ఎల్​ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది.

ఇదీ చూడండి: 'ఏజేఎల్​' ప్లాట్​ స్వాధీనానికి ఈడీ సమాయత్తం

Ramban (J and K), Aug 26 (ANI): Ramban district hosted the Annual Gurmat Samagam, one of the biggest religious congregations of Sikhs. The occasion tuned out to be an exemplar of communal harmony when the Muslim community too extended its help for the successful conduct of the event.
Last Updated : Sep 28, 2019, 10:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.