అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన మహిళలకు పురస్కారాలు ప్రదానం చేసింది కేంద్ర ప్రభుత్వం. దిల్లీలో జరిగిన 'నారీశక్తి పురస్కార్' కార్యక్రమంలో నారీమణులకు పురస్కారాలు ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. భారత యుద్ధవిమానాల తొలి మహిళా పైలట్లు మోహనా జితర్వాల్, అవనీ చతుర్వేది, భావనాకాంత్లకు అవార్డులు అందించారు కోవింద్.
103 ఏళ్ల బామ్మకు..
క్రీడారంగంలో విశేష సేవలు అందించిన 103 ఏళ్ల క్రీడాకారిణి మన్ కౌర్ను నారీశక్తి పురస్కారంతో సత్కరించారు కోవింద్. పుట్టగొడుగుల సాగుకు విశేష ప్రచారం కల్పించిన బిహార్కు చెందిన బీనాదేవికి అవార్డు అందజేశారు. ప్రస్తుతం దౌరీ గ్రామానికి సర్పంచ్గా పనిచేస్తున్నారు బీనాదేవి.
ఇదీ చూడండి: ఆకాశంలో అగ్గి పిడుగు: 'కవిత'కు వాయుసేన కీలక బాధ్యతలు