దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలో పట్టపగలు భారీ చోరీ జరిగింది. ఓ ఇంట్లో చొరబడిన నలుగురు దొంగలు రూ.50 లక్షల విలువైన సామగ్రిని దోచుకెళ్లారు. సీసీ టీవీ దృశ్యాల ఆధారంగా నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
దిల్లీలోని ఓ ప్రైవేట్ కంపెనీలో మహ్మద్ ఇమ్రాన్ పనిచేస్తున్నాడు. ఇమ్రాన్ కుటుంబసభ్యులు లేని సమయంలో అతని ఇంట్లోకి నలుగురు చొరబడ్డారు. వీరు లోపలికి వెళుతుండగా వరండాలో ఉన్న సీసీ కెమెరా దృశ్యాలను చిత్రీకరించింది.
ఇంట్లో నుంచి 75 తులాల బంగారం, వెండి, రెండున్నర వేలు అమెరికా డాలర్లను దొంగలు తస్కరించారు.
ఇదీ చూడండి: భూటాన్లో కూలిన భారత హెలికాప్టర్- ఇద్దరు పైలట్లు మృతి