ETV Bharat / bharat

ఏనుగు మృతికి కారణం ఆ ముగ్గురే!

author img

By

Published : Jun 4, 2020, 5:22 PM IST

Updated : Jun 4, 2020, 7:21 PM IST

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన కేరళ ఏనుగు మృతి ఉదంతంలో ముగ్గురు అనుమానితులపై దృష్టి సారించినట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ వెల్లడించారు. మరోవైపు అటవీశాఖ కూడా ఈ ఘటనపై స్పందించింది. అనేకమంది అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు స్పష్టం చేసింది. బాధ్యులను ఎవరినీ విడిచిపెట్టబోమని తేల్చి చెప్పింది.

Death of wild elephant in Kerala: Forest dept says probe making "significant headway"
ఏనుగు మృతి ఉదాంతం: అధికారుల చేతిలో అనుమానితులు

కేరళలోని పాలక్కడ్​ జిల్లాలో ‌పైనాపిల్​లో పేలుడు పదార్థం పెట్టి ఏనుగును చంపిన ఘ‌ట‌న దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. ముగ్గురు అనుమానితులపై దృష్టి సారించినట్టు ట్వీట్​ చేశారు.

  • In a tragic incident in Palakkad dist, a pregnant elephant has lost its life. Many of you have reached out to us. We want to assure you that your concerns will not go in vain. Justice will prevail.

    — Pinarayi Vijayan (@vijayanpinarayi) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పాలక్కడ్​ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మీ ఆవేదన వృథాగా మిగిలిపోదు. నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాం."

-- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి.

మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీశాఖ కూడా స్పందించింది. దర్యాప్తులో సానుకూలంగా ముందడుగు వేస్తున్నట్టు స్పష్టం చేసింది. అనేకమంది అనుమానితులను పట్టుకుని ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించింది.

"ఏనుగును వేటాడారనే కారణంతో సెక్షన్​ డబ్ల్యూఎల్​(పీ)ఏ కింద కేసును నమోదు చేశాం. అనేకమంది అనుమానితులను విచారిస్తున్నాం. దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్​(ఎస్​ఐటీ) మంచి ఫలితాలతో ముందుకు సాగుతోంది. ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టం. కచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం."

-- అటవీశాఖ ట్వీట్​.

అయితే పైనాపిల్​ బాంబుతోనే ఎనుగు కింది దవడకు గాయమైనట్టు నిర్ధరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అటవీశాఖ పేర్కొంది. కానీ బాంబుతో గాయమయ్యే అవకాశముందని వెల్లడించారు.

ఏం జరిగిందంటే?

గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం కోసం కేరళ మల్లప్పురంలోని ఓ గ్రామానికి వచ్చింది. కొందరు స్థానికులు ఏనుగుకు ఒక పైనాపిల్‌ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. పైనాపిల్​ను తిన్న తర్వాత భారీ చప్పుడుతో పండు పేలిపోయింది.

రక్తమోడుతున్న నోటితోనే ఆ మూగజీవి గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడం వల్ల ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27న సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచింది.

ఈ ఘటన వెలుగు చూశాక దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. జంతువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రముఖులతో పాటు అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.

ఈ ఘటనను రాష్ట్రం, కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఏనుగు మృతిపై విచారణ చేపట్టేందుకు వన్యప్రాణి దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రకటించింది.

కేరళలోని పాలక్కడ్​ జిల్లాలో ‌పైనాపిల్​లో పేలుడు పదార్థం పెట్టి ఏనుగును చంపిన ఘ‌ట‌న దేశవ్యాప్తంగా కలకలం రేపింది. తాజాగా ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్​ స్పందించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోందని.. ముగ్గురు అనుమానితులపై దృష్టి సారించినట్టు ట్వీట్​ చేశారు.

  • In a tragic incident in Palakkad dist, a pregnant elephant has lost its life. Many of you have reached out to us. We want to assure you that your concerns will not go in vain. Justice will prevail.

    — Pinarayi Vijayan (@vijayanpinarayi) June 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"పాలక్కడ్​ జిల్లాలో గర్భంతో ఉన్న ఓ ఏనుగు ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది. మీ ఆవేదన వృథాగా మిగిలిపోదు. నేరస్థులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాం."

-- పినరయి విజయన్​, కేరళ ముఖ్యమంత్రి.

మరోవైపు ఈ ఘటనపై కేరళ అటవీశాఖ కూడా స్పందించింది. దర్యాప్తులో సానుకూలంగా ముందడుగు వేస్తున్నట్టు స్పష్టం చేసింది. అనేకమంది అనుమానితులను పట్టుకుని ప్రశ్నిస్తున్నట్టు వెల్లడించింది.

"ఏనుగును వేటాడారనే కారణంతో సెక్షన్​ డబ్ల్యూఎల్​(పీ)ఏ కింద కేసును నమోదు చేశాం. అనేకమంది అనుమానితులను విచారిస్తున్నాం. దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్​(ఎస్​ఐటీ) మంచి ఫలితాలతో ముందుకు సాగుతోంది. ఘటనకు కారణమైన వారిని వదిలిపెట్టం. కచ్చితంగా శిక్ష పడేటట్టు చేస్తాం."

-- అటవీశాఖ ట్వీట్​.

అయితే పైనాపిల్​ బాంబుతోనే ఎనుగు కింది దవడకు గాయమైనట్టు నిర్ధరించడానికి ఎలాంటి ఆధారాలు లేవని అటవీశాఖ పేర్కొంది. కానీ బాంబుతో గాయమయ్యే అవకాశముందని వెల్లడించారు.

ఏం జరిగిందంటే?

గర్భంతో ఉన్న ఓ ఏనుగు ఆహారం కోసం కేరళ మల్లప్పురంలోని ఓ గ్రామానికి వచ్చింది. కొందరు స్థానికులు ఏనుగుకు ఒక పైనాపిల్‌ ఆశచూపారు. ఆ పైనాపిల్‌లో పేలుడు పదార్థాలు పెట్టారు. పైనాపిల్​ను తిన్న తర్వాత భారీ చప్పుడుతో పండు పేలిపోయింది.

రక్తమోడుతున్న నోటితోనే ఆ మూగజీవి గ్రామం వదిలి వెళ్లిపోయింది. ఓ పక్క కడుపులో పెరుగుతున్న బిడ్డ.. మరోపక్క నరాలను మెలిపెట్టే బాధ.. దీనికి తోడు గాయంపై ఈగలు వాలుతుండటంతో.. ఏం చేయాలో తెలియక ఆ మూగజీవం వెల్లియార్‌ నదిలోకి దిగి గొంతు తడుపుకొంది. ఆ నీటి ప్రవాహంతో గాయానికి కొంత ఉపశమనం లభించడం.. ఈగల బాధ తప్పడం వల్ల ఏనుగు అక్కడే ఉండిపోయింది. చివరికి మే 27న సాయంత్రం 4 గంటలకు తుదిశ్వాస విడిచింది.

ఈ ఘటన వెలుగు చూశాక దేశ ప్రజల్లో తీవ్ర ఆగ్రహజ్వాలలు చెలరేగాయి. జంతువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా ప్రముఖులతో పాటు అనేకమంది సామాజిక మాధ్యమాల్లో పోస్టులు చేశారు.

ఈ ఘటనను రాష్ట్రం, కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఘటనకు సంబంధించిన పూర్తి నివేదిక పంపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించినట్లు తెలిపారు. అనంతరం ఏనుగు మృతిపై విచారణ చేపట్టేందుకు వన్యప్రాణి దర్యాప్తు బృందాన్ని నియమించినట్లు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్​ ప్రకటించింది.

Last Updated : Jun 4, 2020, 7:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.