ETV Bharat / bharat

బ్యాంకు మోసాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు

బ్యాంకు మోసాలపై దర్యాప్తునకు నిపుణులతో కూడిన నలుగురు సభ్యుల సలహా మండలిని ఏర్పాటు చేసింది కేంద్ర నిఘా కమిషన్ (సీవీసీ). బ్యాంకుల్లో రూ.50 కోట్లకు పైబడిన మోసాలపై ఈ మండలి దర్యాప్తు చేస్తుంది.

author img

By

Published : Aug 26, 2019, 5:15 AM IST

Updated : Sep 28, 2019, 7:01 AM IST

బ్యాంకు మోసాలపై దర్యాప్తునకు కమిటీ ఏర్పాటు

బ్యాంకుల్లో జరుగుతోన్న మోసాలపై కేంద్ర నిఘా కమిషన్​ (సీవీసీ) దృష్టి సారించింది. రూ.50 కోట్లకు పైబడిన బ్యాంకు మోసాలపై దర్యాప్తు సహా చర్యలను సిఫార్సు చేసేందుకు నిపుణులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సీవీసీ నిర్ణయం తీసుకుంది.

అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ (ఏబీబీఎఫ్)​ పేరిట నలుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ ప్యానెల్‌కు విజిలెన్స్ మాజీ కమిషనర్ టీఎమ్​ భాసిన్ నేతృత్వం వహించనున్నారు. ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం ఏబీబీఎఫ్​ను సీవీసీ ఏర్పాటుచేసింది.

బోర్డు ఛైర్మన్, సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించారు. బ్యాంకుల్లో జరిగే భారీస్థాయి కుంభకోణాలపై దర్యాప్తు సంస్థల కంటే ముందే ఏబీబీఎఫ్​ ప్రాథమిక విచారణ చేపట్టనుంది. పీఎస్‌బీలకు సంబంధించిన కేసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు సీబీఐ కూడా ఏబీబీఎఫ్​కు సిఫార్సు చేయవచ్చు.

ఏబీబీఎఫ్​ సిఫార్సుల మేరకు బ్యాంకు మోసాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకెళ్లవచ్చని పేర్కొంది సీవీసీ. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో జరిగే మోసాలను ఎప్పుటికప్పుడు విశ్లేషిస్తూ ఆర్బీఐకు సమాచారమందించేందుకు ఏబీబీఎఫ్​ తోడ్పడుతుందని పేర్కొంది.

బ్యాంకుల్లో జరుగుతోన్న మోసాలపై కేంద్ర నిఘా కమిషన్​ (సీవీసీ) దృష్టి సారించింది. రూ.50 కోట్లకు పైబడిన బ్యాంకు మోసాలపై దర్యాప్తు సహా చర్యలను సిఫార్సు చేసేందుకు నిపుణులతో కూడిన సలహా మండలిని ఏర్పాటు చేస్తూ సీవీసీ నిర్ణయం తీసుకుంది.

అడ్వైజరీ బోర్డ్ ఫర్ బ్యాంకింగ్ ఫ్రాడ్స్ (ఏబీబీఎఫ్)​ పేరిట నలుగురు సభ్యులతో ఏర్పాటైన ఈ ప్యానెల్‌కు విజిలెన్స్ మాజీ కమిషనర్ టీఎమ్​ భాసిన్ నేతృత్వం వహించనున్నారు. ఆర్బీఐతో సంప్రదింపుల అనంతరం ఏబీబీఎఫ్​ను సీవీసీ ఏర్పాటుచేసింది.

బోర్డు ఛైర్మన్, సభ్యుల పదవీకాలం రెండేళ్లుగా నిర్ణయించారు. బ్యాంకుల్లో జరిగే భారీస్థాయి కుంభకోణాలపై దర్యాప్తు సంస్థల కంటే ముందే ఏబీబీఎఫ్​ ప్రాథమిక విచారణ చేపట్టనుంది. పీఎస్‌బీలకు సంబంధించిన కేసుల్లో సాంకేతిక సమస్యలు తలెత్తినపుడు సీబీఐ కూడా ఏబీబీఎఫ్​కు సిఫార్సు చేయవచ్చు.

ఏబీబీఎఫ్​ సిఫార్సుల మేరకు బ్యాంకు మోసాలపై ప్రభుత్వ రంగ బ్యాంకులు ముందుకెళ్లవచ్చని పేర్కొంది సీవీసీ. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థలో జరిగే మోసాలను ఎప్పుటికప్పుడు విశ్లేషిస్తూ ఆర్బీఐకు సమాచారమందించేందుకు ఏబీబీఎఫ్​ తోడ్పడుతుందని పేర్కొంది.

Bulandshahr (UP), Aug 25 (ANI): The six accused in the Bulandshahr case were welcomed with garlands after they were released on bail on August 24. They received overwhelming support. Some group of people cheers the slogans of 'Jai Shri Ram', 'Bharat Mata ki Jai', and 'Vande Mataram'.
Last Updated : Sep 28, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.