ETV Bharat / bharat

ఆ రోగుల చికిత్సపై కరోనా ప్రభావం

author img

By

Published : May 10, 2020, 8:34 AM IST

కరోనా లాక్​డౌన్​ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రక్తదానం చేసేవారి సంఖ్య భారీగా పడిపోయింది. ఫలితంగా తరచూ రక్త మార్పిడి తప్పనిసరిగా చేయించుకోవాల్సి వచ్చే లుకేమియా, థలసేమియా వ్యాధిగ్రస్తులు ఇబ్బందులు పడుతున్నారు. వ్యాధి తీవ్రంగా ఉన్నవారికి మూల కణాల మార్పిడి చేయకపోతే వారి ప్రాణాలకు ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

WB-LOCKDOWN-STEM CELL TREATMENT
రక్త మార్పిడి చికిత్స

కరోనా సంక్షోభం మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తోంది. అనేక పనులు స్తంభించిపోయాయి. ఆరోగ్యపరమైన అంశాలకూ మినహాయింపు లేకుండా పోయింది. రక్త హీనత వంటి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నవారికి పెను విపత్తుగా మారింది. అత్యవసర వైద్య సాయం అందక.. వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది.

ఇలాంటి పరిస్థితే గురుగ్రామ్​ నివాసి సోనియా ఘక్కడ్​కు ఎదురైంది. ఆమె భర్త లుకేమియా (బ్లడ్​ కేన్సర్​)తో బాధపడుతున్నాడు. తరుచూ బోన్​ మ్యారో (ఎముక మజ్జ) మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే లాక్​డౌన్​ వల్ల అది చేయించడం ఆమెకు సాధ్యం కావడం లేదు.

"2 నెలల క్రితం నా భర్తకు బోన్ మ్యారో డయాగ్నైజ్ చేశాం. ఇది తరచూ చేస్తేనే ఆయన బతికే అవకాశం ఉంటుంది. ఆరోగ్య శాఖ నుంచి రక్త మూలకణాల రవాణా కోసం అనుమతి తీసుకున్నాం. కానీ అవి అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం దొరకడం కష్టంగా ఉంది."

- సోనియా ఘక్కడ్​

రక్త సమస్యలతో బాధపడేవారికి మూల కణాల మార్పిడితోనే చికిత్స చేస్తారు. అయితే వ్యక్తుల రక్తం గ్రూపుతో సరిపోయే దాతలు దొరికేందుకు నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు పడుతుందని హెమటాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు పరిమిత సమయమే ఉంటుందన్నారు.

20 శాతానికి పతనం..

లాక్​డౌన్​ నేపథ్యంలో మార్పిడి ప్రక్రియ 20 శాతానికి పడిపోయంది. చాలా ఆసుపత్రులు వీటిని వాయిదా వేస్తున్నాయి. అదనపు కీమోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ముంబయికి చెందిన ధనిశ్​కు మార్చి చివరి వారంలో మూల కణ చికిత్స చేయాల్సి ఉంది. రవాణా సదుపాయం లేని కారణంగా వైద్యులు వాయిదా వేశారని చెబుతున్నాడు ధనిశ్​.

"ప్రస్తుతం నేను కీమోథెరపీ సెషన్​పైనే ఆధారపడ్డాను. ఇది నా డబ్బుతో పాటు నన్ను బలహీనుడిని చేస్తోంది. సమయం మించిపోకముందే పరిస్థితులు త్వరగా చక్కబడాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా."

- ధనిశ్​, లుకేమియా వ్యాధిగ్రస్తుడు

పరిమిత సంఖ్యలో..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రులు కొంత మందిని ఎంపిక చేసుకుని చికిత్స చేస్తున్నాయని ప్రఖ్యాత హెమటాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత మమ్మెన్ ఛాందీ తెలిపారు.

"మేం మా పనిని ఆపలేదు. కొంతమందిని ఎంపిక చేసి చికిత్స చేస్తున్నాం. లాక్​డౌన్​ కారణంగా ప్లేట్​లేట్ల విరాళాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ కొవిడ్​-19 నేపథ్యంలో మార్గదర్శకాలను అనుసరించి అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి."

- మమ్మెన్​ ఛాందీ, టాటా మెడికల్ సెంటర్​ డైరెక్టర్​

ప్రత్యామ్నాయం కీమోథెరపీ..

అయితే థలసేమియాతో బాధపడేవారికి కొంత ఆలస్యం అయినా ఫర్వాలేదని దిల్లీ ఎయిమ్స్​ ఆంకాలజీ విభాగం చీఫ్​ లలిత్ కుమార్ తెలిపారు. పేషెంట్లను అదనపు కీమోథెరపీ సెషన్​ తీసుకోవాలని సూచిస్తున్నారు.

"రక్త కణాల మార్పిడిపై లాక్​డౌన్​ ప్రభావం కచ్చితంగా ఉంది. ప్రస్తుతం బిహార్, ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​కు చెందినవారు దిల్లీ వచ్చేందుకు వీలులేదు. థలసేమియాతో బాధపడేవారికి కొంత జాప్యం జరగవచ్చు. కానీ లుకేమియా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి మాత్రం వైద్య సహకారం అవసరం."

- లలిత్ కుమార్, దిల్లీ ఎయిమ్స్​

లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారి సంఖ్య చాలా తగ్గిపోయిందని లలిత్ తెలిపారు. ఇదే విషయంలో కోకిలాబెన్​ ధీరుభాయి అంబానీ ఆసుపత్రి చిన్న పిల్లల ఆంకాలజీ నిపుణులు శాంతను సేన్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో గ్రీన్​ జోన్లలో రక్త దాతల సంచారానికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రభుత్వ చర్యలు ఇవీ..

ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి స్పందించారు. అత్యవసర వైద్య సేవలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అయితే ప్రత్యేక కారిడార్లు రూపొందించటం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని చెప్పారు.

"ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. రోగి కుటుంబ సభ్యుడు సంబంధిత ఆసుపత్రి లేదా ఆరోగ్య సంస్థను సంప్రదించవచ్చు. అనంతరం దాతల రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి."

- ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి

కరోనా విషయంలోనే కాకుండా ఇతర ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం జాతీయ హెల్ప్​లైన్​ నంబర్​ 104కు ఫోన్​ చేయవచ్చని ఆయన తెలిపారు. 104 నంబరుతో సమాచారం, 1075 నంబరుతో బాధితుల వద్దకే వచ్చి సాయం అందిస్తారని స్పష్టం చేశారు.

కరోనా సంక్షోభం మన జీవితాలపై చాలా ప్రభావం చూపిస్తోంది. అనేక పనులు స్తంభించిపోయాయి. ఆరోగ్యపరమైన అంశాలకూ మినహాయింపు లేకుండా పోయింది. రక్త హీనత వంటి తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్నవారికి పెను విపత్తుగా మారింది. అత్యవసర వైద్య సాయం అందక.. వారి ప్రాణాలకు ముప్పుగా పరిణమిస్తోంది.

ఇలాంటి పరిస్థితే గురుగ్రామ్​ నివాసి సోనియా ఘక్కడ్​కు ఎదురైంది. ఆమె భర్త లుకేమియా (బ్లడ్​ కేన్సర్​)తో బాధపడుతున్నాడు. తరుచూ బోన్​ మ్యారో (ఎముక మజ్జ) మార్పిడి చేయాల్సి ఉంటుంది. అయితే లాక్​డౌన్​ వల్ల అది చేయించడం ఆమెకు సాధ్యం కావడం లేదు.

"2 నెలల క్రితం నా భర్తకు బోన్ మ్యారో డయాగ్నైజ్ చేశాం. ఇది తరచూ చేస్తేనే ఆయన బతికే అవకాశం ఉంటుంది. ఆరోగ్య శాఖ నుంచి రక్త మూలకణాల రవాణా కోసం అనుమతి తీసుకున్నాం. కానీ అవి అందుబాటులో ఉండటం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రక్తం దొరకడం కష్టంగా ఉంది."

- సోనియా ఘక్కడ్​

రక్త సమస్యలతో బాధపడేవారికి మూల కణాల మార్పిడితోనే చికిత్స చేస్తారు. అయితే వ్యక్తుల రక్తం గ్రూపుతో సరిపోయే దాతలు దొరికేందుకు నెలలు, ఒక్కోసారి సంవత్సరాలు పడుతుందని హెమటాలజిస్టులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్నవారికి చికిత్స చేసేందుకు పరిమిత సమయమే ఉంటుందన్నారు.

20 శాతానికి పతనం..

లాక్​డౌన్​ నేపథ్యంలో మార్పిడి ప్రక్రియ 20 శాతానికి పడిపోయంది. చాలా ఆసుపత్రులు వీటిని వాయిదా వేస్తున్నాయి. అదనపు కీమోథెరపీ చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ముంబయికి చెందిన ధనిశ్​కు మార్చి చివరి వారంలో మూల కణ చికిత్స చేయాల్సి ఉంది. రవాణా సదుపాయం లేని కారణంగా వైద్యులు వాయిదా వేశారని చెబుతున్నాడు ధనిశ్​.

"ప్రస్తుతం నేను కీమోథెరపీ సెషన్​పైనే ఆధారపడ్డాను. ఇది నా డబ్బుతో పాటు నన్ను బలహీనుడిని చేస్తోంది. సమయం మించిపోకముందే పరిస్థితులు త్వరగా చక్కబడాలని ఆ దేవున్ని ప్రార్థిస్తున్నా."

- ధనిశ్​, లుకేమియా వ్యాధిగ్రస్తుడు

పరిమిత సంఖ్యలో..

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఆసుపత్రులు కొంత మందిని ఎంపిక చేసుకుని చికిత్స చేస్తున్నాయని ప్రఖ్యాత హెమటాలజిస్ట్, పద్మశ్రీ గ్రహీత మమ్మెన్ ఛాందీ తెలిపారు.

"మేం మా పనిని ఆపలేదు. కొంతమందిని ఎంపిక చేసి చికిత్స చేస్తున్నాం. లాక్​డౌన్​ కారణంగా ప్లేట్​లేట్ల విరాళాలు తగ్గిపోయాయి. అయినప్పటికీ కొవిడ్​-19 నేపథ్యంలో మార్గదర్శకాలను అనుసరించి అన్ని ప్రక్రియలు జరుగుతున్నాయి."

- మమ్మెన్​ ఛాందీ, టాటా మెడికల్ సెంటర్​ డైరెక్టర్​

ప్రత్యామ్నాయం కీమోథెరపీ..

అయితే థలసేమియాతో బాధపడేవారికి కొంత ఆలస్యం అయినా ఫర్వాలేదని దిల్లీ ఎయిమ్స్​ ఆంకాలజీ విభాగం చీఫ్​ లలిత్ కుమార్ తెలిపారు. పేషెంట్లను అదనపు కీమోథెరపీ సెషన్​ తీసుకోవాలని సూచిస్తున్నారు.

"రక్త కణాల మార్పిడిపై లాక్​డౌన్​ ప్రభావం కచ్చితంగా ఉంది. ప్రస్తుతం బిహార్, ఉత్తర్​ప్రదేశ్​, రాజస్థాన్​కు చెందినవారు దిల్లీ వచ్చేందుకు వీలులేదు. థలసేమియాతో బాధపడేవారికి కొంత జాప్యం జరగవచ్చు. కానీ లుకేమియా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నవారికి మాత్రం వైద్య సహకారం అవసరం."

- లలిత్ కుమార్, దిల్లీ ఎయిమ్స్​

లాక్​డౌన్​ మొదలైనప్పటి నుంచి స్వచ్ఛందంగా రక్తదానం చేసేవారి సంఖ్య చాలా తగ్గిపోయిందని లలిత్ తెలిపారు. ఇదే విషయంలో కోకిలాబెన్​ ధీరుభాయి అంబానీ ఆసుపత్రి చిన్న పిల్లల ఆంకాలజీ నిపుణులు శాంతను సేన్​ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లాక్​డౌన్​ సడలింపుల నేపథ్యంలో గ్రీన్​ జోన్లలో రక్త దాతల సంచారానికి వెసులుబాటు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రభుత్వ చర్యలు ఇవీ..

ఈ విషయంపై కేంద్ర ఆరోగ్య శాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి స్పందించారు. అత్యవసర వైద్య సేవలకు అనుమతి ఇవ్వాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇచ్చామన్నారు. అయితే ప్రత్యేక కారిడార్లు రూపొందించటం ప్రస్తుత పరిస్థితుల్లో అసాధ్యమని చెప్పారు.

"ప్రస్తుతం ఉన్న విధానం ప్రకారం.. రోగి కుటుంబ సభ్యుడు సంబంధిత ఆసుపత్రి లేదా ఆరోగ్య సంస్థను సంప్రదించవచ్చు. అనంతరం దాతల రవాణా కోసం రాష్ట్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా దరఖాస్తు చేసుకోవాలి."

- ఆరోగ్య శాఖ ఉన్నతాధికారి

కరోనా విషయంలోనే కాకుండా ఇతర ఆరోగ్య అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం జాతీయ హెల్ప్​లైన్​ నంబర్​ 104కు ఫోన్​ చేయవచ్చని ఆయన తెలిపారు. 104 నంబరుతో సమాచారం, 1075 నంబరుతో బాధితుల వద్దకే వచ్చి సాయం అందిస్తారని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.