ETV Bharat / bharat

కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 9,386 కేసులు

author img

By

Published : Aug 27, 2020, 7:59 PM IST

Updated : Aug 27, 2020, 8:59 PM IST

భారత్​లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. దేశంలో ఇప్పటికే 33 లక్షల మంది వైరస్​ బారిన పడగా.. 60 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటక, తమిళనాడు, కేరళ, ఉత్తర్​ప్రదేశ్​, మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో కొవిడ్​ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి.

Coronavirus new cases and deaths in India
కర్ణాటకలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 9,386 కేసులు

దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కర్ణాటకలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,386 కేసులు వెలుగుచూశాయి. మరో 141మంది కొవిడ్​కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 9వేలు దాటింది.

మహా కరోనా పంజా...

మహారాష్ట్రలో ఒక్కరోజే 14,718మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 355 మంది వైరస్​కు బలయ్యారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 33వేలు దాటగా... ఇప్పటివరకు 23,444 మంది మరణించారు.

తమిళనాట 4లక్షలు దాటిన కేసులు

తమిళనాడులో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 4లక్షల 3వేలు దాటింది. కొత్తగా రాష్ట్రంలో 5,981 కొవిడ్​ కేసులు బయటపడగా... మరో 109మంది చనిపోయారు.

ఉత్తర్​ప్రదేశ్​

యూపీలో తాజాగా 5,463 మంది మహమ్మారి బారిన పడ్డారు. 76 మంది కరోనాకు బలయ్యారు.

  • బంగాల్​లో ఒక్కరోజే 2,997 మందికి కరోనా సోకింది. మరో 53మంది మృత్యువాతపడ్డారు.
  • కేరళలో తాజాగా 2,406 కేసులు బయటపడగా... 10 మంది చనిపోయారు.
  • దిల్లీలో కొత్తగా 1,840 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • పంజాబ్​లో గురువారం 1,746 మంది కరోనా బారిన పడ్డారు.
  • జమ్ముకశ్మీర్​లో కొత్తగా 655మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 14 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి: 'ఎన్ని ఆధారాలిచ్చినా పాక్ పనిచేయదంతే'

దేశంలో కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. కర్ణాటకలో ఒక్కరోజే రికార్డు స్థాయిలో 9,386 కేసులు వెలుగుచూశాయి. మరో 141మంది కొవిడ్​కు బలయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 9వేలు దాటింది.

మహా కరోనా పంజా...

మహారాష్ట్రలో ఒక్కరోజే 14,718మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 355 మంది వైరస్​కు బలయ్యారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 7 లక్షల 33వేలు దాటగా... ఇప్పటివరకు 23,444 మంది మరణించారు.

తమిళనాట 4లక్షలు దాటిన కేసులు

తమిళనాడులో మొత్తం వైరస్​ బాధితుల సంఖ్య 4లక్షల 3వేలు దాటింది. కొత్తగా రాష్ట్రంలో 5,981 కొవిడ్​ కేసులు బయటపడగా... మరో 109మంది చనిపోయారు.

ఉత్తర్​ప్రదేశ్​

యూపీలో తాజాగా 5,463 మంది మహమ్మారి బారిన పడ్డారు. 76 మంది కరోనాకు బలయ్యారు.

  • బంగాల్​లో ఒక్కరోజే 2,997 మందికి కరోనా సోకింది. మరో 53మంది మృత్యువాతపడ్డారు.
  • కేరళలో తాజాగా 2,406 కేసులు బయటపడగా... 10 మంది చనిపోయారు.
  • దిల్లీలో కొత్తగా 1,840 మందికి కొవిడ్ పాజిటివ్​గా తేలింది. మరో 22 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • పంజాబ్​లో గురువారం 1,746 మంది కరోనా బారిన పడ్డారు.
  • జమ్ముకశ్మీర్​లో కొత్తగా 655మందికి కరోనా పాజిటివ్​గా తేలింది. మరో 14 మంది మృతి చెందారు.

ఇదీ చూడండి: 'ఎన్ని ఆధారాలిచ్చినా పాక్ పనిచేయదంతే'

Last Updated : Aug 27, 2020, 8:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.