ETV Bharat / bharat

కరోనా: ఐటీబీపీ శిబిరంలోని 200 మంది విడుదల - corona virus updates

దిల్లీలో ఐటీబీపీ దళాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కరోనా వైరస్ ప్రత్యేక శిబిరంలోని 2 వందల మందిని విడుదల చేశారు. మరో 206మందిని మంగళవారం డిశ్చార్జీ చేయనున్నట్లు వెల్లడించారు. వ్యాధి లక్షణాలు లేనందువల్లే వారిని విడుదల చేసినట్లు ప్రకటించారు అధికారులు.

corona
ప్రత్యేక శిబిరం నుంచి 2వందలమంది విడుదల
author img

By

Published : Feb 17, 2020, 8:31 PM IST

Updated : Mar 1, 2020, 3:52 PM IST

దిల్లీలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక శిబిరం నుంచి వ్యాధి లక్షణాలు లేని కారణంగా 200మందిని డిశ్ఛార్జీ చేశారు. ఇటీవల కరోనా వైరస్ భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నేపథ్యంలో వైరస్ కేంద్రస్థానమైన చైనా వుహాన్​ నుంచి వెనక్కి వచ్చిన 650 మందిలో 406 మందిని ఐటీబీపీ దళాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 4వందలమందికీ వ్యాధి సోకలేదని.. తొలి విడతగా 2వందల మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.

"కరోనా వైరస్​కు సంబంధించి 406మందికి సంబంధించిన తుది నివేదికల్లో వ్యాధి లక్షణాలు లేనట్లుగా నిర్ధరణ అయింది. తొలి బ్యాచ్​లో 2వందలమందిని విడుదల చేస్తున్నాం. మిగిలిన వారిని మంగళవారం విడుదల చేస్తాం."

-వివేక్​కుమార్, ఐటీబీపీ అధికార ప్రతినిధి

వైరస్ లేదని నిర్ధరణ అయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి ప్రత్యేక శిబిరాన్ని సందర్శించారు. శిబిరంలోని వారితో సంభాషించారు. అనంతరం వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు.

ఇదీ చూడండి: భారత్​లో ప్రవేశించకుండా​ అడ్డుకున్నారు: బ్రిటన్ ఎంపీ

దిల్లీలో ఏర్పాటు చేసిన కరోనా ప్రత్యేక శిబిరం నుంచి వ్యాధి లక్షణాలు లేని కారణంగా 200మందిని డిశ్ఛార్జీ చేశారు. ఇటీవల కరోనా వైరస్ భయాందోళనలు ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న నేపథ్యంలో వైరస్ కేంద్రస్థానమైన చైనా వుహాన్​ నుంచి వెనక్కి వచ్చిన 650 మందిలో 406 మందిని ఐటీబీపీ దళాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఉంచి వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ 4వందలమందికీ వ్యాధి సోకలేదని.. తొలి విడతగా 2వందల మందిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు అధికారులు.

"కరోనా వైరస్​కు సంబంధించి 406మందికి సంబంధించిన తుది నివేదికల్లో వ్యాధి లక్షణాలు లేనట్లుగా నిర్ధరణ అయింది. తొలి బ్యాచ్​లో 2వందలమందిని విడుదల చేస్తున్నాం. మిగిలిన వారిని మంగళవారం విడుదల చేస్తాం."

-వివేక్​కుమార్, ఐటీబీపీ అధికార ప్రతినిధి

వైరస్ లేదని నిర్ధరణ అయిన నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి ప్రత్యేక శిబిరాన్ని సందర్శించారు. శిబిరంలోని వారితో సంభాషించారు. అనంతరం వైద్య సేవలపై అధికారులతో సమీక్షించారు.

ఇదీ చూడండి: భారత్​లో ప్రవేశించకుండా​ అడ్డుకున్నారు: బ్రిటన్ ఎంపీ

Last Updated : Mar 1, 2020, 3:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.