ETV Bharat / bharat

భారత్​లో 83కు చేరిన కరోనా కేసులు​

author img

By

Published : Mar 14, 2020, 1:05 PM IST

Updated : Mar 14, 2020, 4:29 PM IST

భారత్​లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటివరకు 83మందికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ అయ్యింది. మహారాష్ట్రలో మరో ఇద్దరికి వైరస్​ ఉన్నట్లు తేలగా.. ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 19కి చేరింది. ఈ మహమ్మారి భయంతో థియేటర్లు, పాఠశాలలు అన్నీ మూసేశారు. ఆర్​ఎస్​ఎస్​ వార్షిక సమావేశాన్ని వాయిదా వేశారు.

Coronavirus cases rise to 83 in India: Officials
భారత్​లో 83కు చేరిన కరోనా కేసులు​

భారత్​లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 83 మందికి ఈ వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 17 మంది విదేశీయులున్నారు. మహారాష్ట్రలో మరో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా​ తేలింది. తద్వారా ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 19కి చేరినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు ఇటీవల దుబాయ్ ​నుంచి వచ్చారు. పుణెలో 10కేసులు నమోదు కాగా.. ముంబయి, నాగ్​పుర్​లో 3 కేసులు గుర్తించారు అధికారులు. ఇక ఠాణేలో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డారు.

థియేటర్లు, పబ్లిక్​ పార్కులు బంద్​...

కరోనా వ్యాప్తి భయంతో మహారాష్ట్రలో పాఠశాలలు, సినిమా థియేటర్లు, వ్యాయామ శాలలు, స్విమ్మింగ్ పూల్స్​, పబ్లిక్​ పార్కులను మూసేశారు. రాజస్థాన్​లోనూ ఈ తరహా నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.

కరోనా వైరస్​ అనుమానితుల పరార్​...

నాగ్​పుర్​లోని మాయో ఆసుపత్రిలో ఐదుగురు కరోనా వైరస్​ అనుమానితులు ఐసోలేషన్​ వార్డు నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరికి వైరస్​ పరీక్షల్లో నెగిటివ్​ రాగా.. నలుగురి రిపోర్డులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిలో ముగ్గురు తిరిగి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

ఆర్​ఎస్​ఎస్​ సమావేశం వాయిదా

Coronavirus cases rise to 83 in India: Officials
ఆర్​ఎస్​ఎస్​ ట్వీట్​

ఆర్​ఎస్​ఎస్​ వార్షిక సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ కార్యదర్శి సురేష్​ భయ్యాజి జోషి తెలిపారు. మార్చి 15 నుంచి 17 వరకు జరగాల్సిన ఈ సమావేశాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ఆఫీసు తరలింపు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్​ సంస్థ.. తమ శాటిలైట్​ ఆఫీస్​ బిల్డింగ్​లలో ఒకదానిని ఖాళీ చేయించింది. సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కరోనా సోకిన వ్యక్తిని కలిశాడనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది.

పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా...

దిల్లీలో ఇప్పటివరకు ఏడుగురికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ కాగా.. ఉత్తర్​ప్రదేశ్​లో 11మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక కర్ణాటకలో ఆరుగురు, లద్దాఖ్​​లో ముగ్గురికి కరోనా సోకింది.

రాజస్థాన్​, తమిళనాడు, తెలంగాణ, జమ్ముకశ్మీర్​, ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదయ్యింది. కేరళలో 19 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

భారత్​లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 83 మందికి ఈ వైరస్​ సోకినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. వీరిలో 17 మంది విదేశీయులున్నారు. మహారాష్ట్రలో మరో ఇద్దరికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్​గా​ తేలింది. తద్వారా ఆ రాష్ట్రంలో కేసుల సంఖ్య 19కి చేరినట్లు వైద్య అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు ఇటీవల దుబాయ్ ​నుంచి వచ్చారు. పుణెలో 10కేసులు నమోదు కాగా.. ముంబయి, నాగ్​పుర్​లో 3 కేసులు గుర్తించారు అధికారులు. ఇక ఠాణేలో ఒకరు ఈ వైరస్ బారిన పడ్డారు.

థియేటర్లు, పబ్లిక్​ పార్కులు బంద్​...

కరోనా వ్యాప్తి భయంతో మహారాష్ట్రలో పాఠశాలలు, సినిమా థియేటర్లు, వ్యాయామ శాలలు, స్విమ్మింగ్ పూల్స్​, పబ్లిక్​ పార్కులను మూసేశారు. రాజస్థాన్​లోనూ ఈ తరహా నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం.

కరోనా వైరస్​ అనుమానితుల పరార్​...

నాగ్​పుర్​లోని మాయో ఆసుపత్రిలో ఐదుగురు కరోనా వైరస్​ అనుమానితులు ఐసోలేషన్​ వార్డు నుంచి పరారయ్యారని పోలీసులు తెలిపారు. వారిలో ఒకరికి వైరస్​ పరీక్షల్లో నెగిటివ్​ రాగా.. నలుగురి రిపోర్డులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వారిలో ముగ్గురు తిరిగి వచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఇద్దరి కోసం వెతుకుతున్నట్లు తెలిపారు.

ఆర్​ఎస్​ఎస్​ సమావేశం వాయిదా

Coronavirus cases rise to 83 in India: Officials
ఆర్​ఎస్​ఎస్​ ట్వీట్​

ఆర్​ఎస్​ఎస్​ వార్షిక సమావేశాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఆ సంస్థ కార్యదర్శి సురేష్​ భయ్యాజి జోషి తెలిపారు. మార్చి 15 నుంచి 17 వరకు జరగాల్సిన ఈ సమావేశాన్ని కరోనా వ్యాప్తి నేపథ్యంలో వాయిదా వేసినట్లు పేర్కొన్నారు.

ఆఫీసు తరలింపు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో బెంగళూరులోని ఇన్ఫోసిస్​ సంస్థ.. తమ శాటిలైట్​ ఆఫీస్​ బిల్డింగ్​లలో ఒకదానిని ఖాళీ చేయించింది. సంస్థలో పని చేస్తున్న ఓ ఉద్యోగి కరోనా సోకిన వ్యక్తిని కలిశాడనే అనుమానంతో ఈ నిర్ణయం తీసుకుంది.

పలు రాష్ట్రాల్లో కేసుల వివరాలు ఇలా...

దిల్లీలో ఇప్పటివరకు ఏడుగురికి వైరస్​ సోకినట్లు నిర్ధరణ కాగా.. ఉత్తర్​ప్రదేశ్​లో 11మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. ఇక కర్ణాటకలో ఆరుగురు, లద్దాఖ్​​లో ముగ్గురికి కరోనా సోకింది.

రాజస్థాన్​, తమిళనాడు, తెలంగాణ, జమ్ముకశ్మీర్​, ఆంధ్రప్రదేశ్​, పంజాబ్​ రాష్ట్రాల్లో ఒక్కో కేసు నమోదయ్యింది. కేరళలో 19 మంది ఈ వైరస్ బారిన పడ్డారు.

Last Updated : Mar 14, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.