ETV Bharat / bharat

ఆ కూటమి నక్సలిజాన్ని ప్రేరేపిస్తోంది: సీఎం యోగి

author img

By

Published : Oct 21, 2020, 8:46 PM IST

బిహార్​లో జోరుగా ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​. రెండో రోజు ర్యాలీలో భాగంగా జాముయి, భోజ్​పుర్​, పట్నా జిల్లాల్లో పర్యటించారు యోగి. ఈ సందర్భంగా మోదీ, షా ఆధ్వర్యంలోని భాజపా అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించిన ఆయన.. కాంగ్రెస్​, ఆర్జేడీ పార్టీలు కమ్యూనిస్టులతో కలిసి హింసను ప్రేరేపిస్తున్నాయని విమర్శించారు.

UP CM Yogi Adityanath
ఆ కూటమి సీపీఐతో మళ్లీ నక్సలిజాన్ని ప్రేరేపిస్తోంది

బిహార్​లో జోరుగా ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తోంది భాజపా. రెండో రోజూ ఆ రాష్ట్రంలో పర్యటించారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఈ క్రమంలో కాంగ్రెస్​- రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ)లపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు సీపీఎం(ఎమ్​ఎల్​)తో కలిసి రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నక్సలిజం మళ్లీ పురుడు పోసుకుంటుందని విమర్శలు గుప్పించారు.

బుధవారం.. జాముయి, భోజ్​పుర్​, పట్నా జిల్లా ఎన్నికల ర్యాలీలో పాల్గొనారు యోగి. ప్రసంగంలో భాగంగా కేంద్రంలో భాజపా అభివృద్ధిని కొనియాడిన యూపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్​ షాలపై ప్రశంసలు కురిపించారు. కశ్మీర్​లో ఆర్టికల్​-370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, పౌర సవరణ చట్టం(సీఏఏ) వంటి చారిత్రక ఘట్టాలను అక్కడి ప్రజలకు నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రగతి పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పట్నా సిట్టింగ్​ ఎమ్మెల్యే జయవర్ధన్​ యాదవ్​ కోసం ప్రచారం చేసిన ఆయన.. పాలిగంజ్​ వద్ద తన రెండో రోజు ర్యాలీని ముగించారు.

బిహార్​లో జోరుగా ఎన్నికల ప్రచారాలు కొనసాగిస్తోంది భాజపా. రెండో రోజూ ఆ రాష్ట్రంలో పర్యటించారు ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​. ఈ క్రమంలో కాంగ్రెస్​- రాష్ట్రీయ జనతాదళ్​(ఆర్జేడీ)లపై విమర్శలు గుప్పించారు. ఈ రెండు పార్టీలు సీపీఎం(ఎమ్​ఎల్​)తో కలిసి రాష్ట్రంలో హింసను ప్రేరేపిస్తున్నాయని అన్నారు. మహాకూటమి అధికారంలోకి వస్తే నక్సలిజం మళ్లీ పురుడు పోసుకుంటుందని విమర్శలు గుప్పించారు.

బుధవారం.. జాముయి, భోజ్​పుర్​, పట్నా జిల్లా ఎన్నికల ర్యాలీలో పాల్గొనారు యోగి. ప్రసంగంలో భాగంగా కేంద్రంలో భాజపా అభివృద్ధిని కొనియాడిన యూపీ సీఎం.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్​ షాలపై ప్రశంసలు కురిపించారు. కశ్మీర్​లో ఆర్టికల్​-370 రద్దు, అయోధ్యలో రామ మందిర నిర్మాణం, పౌర సవరణ చట్టం(సీఏఏ) వంటి చారిత్రక ఘట్టాలను అక్కడి ప్రజలకు నొక్కి చెప్పారు. కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ ప్రగతి పట్ల దేశ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. పట్నా సిట్టింగ్​ ఎమ్మెల్యే జయవర్ధన్​ యాదవ్​ కోసం ప్రచారం చేసిన ఆయన.. పాలిగంజ్​ వద్ద తన రెండో రోజు ర్యాలీని ముగించారు.

ఇదీ చదవండి: బిహార్​లో యోగికి క్రేజ్​- కీలక స్థానాల్లో ప్రచారం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.