ETV Bharat / bharat

'చైనా విరాళాలను మోదీ ఎందుకు స్వీకరిస్తున్నారు?'

author img

By

Published : Jun 28, 2020, 6:32 PM IST

సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో పీఎం కేర్స్​కు చైనా సంస్థలు అందిస్తున్న విరాళాలను మోదీ ఎందుకు స్వీకరిస్తున్నారని కాంగ్రెస్​ ప్రశ్నించింది. చైనా తీరును మోదీ ఎందుకు తప్పుపట్టడం లేదని నిలదీసింది.

Cong says PM CARES Fund accepted Chinese donations, asks why Modi not calling China aggressor
'చైనా విరాళాలను మోదీ ఎందుకు స్వీకరిస్తున్నారు?'

రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​ విరాళాలపై భాజపా చేసిన విమర్శలను కాంగ్రెస్​ తిప్పికొట్టింది. పీఎం కేర్స్​కు చైనా సంస్థల నుంచి విరాళాలు అందుతున్నాయని.. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ వాటిని ఎందుకు స్వీకరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ను.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరేళ్లలో 18సార్లు ఎందుకు కలిశారని కాంగ్రెస్​ సీనియర్​ నేత అభిషేక్​ మను సింఘ్వీ ప్రశ్నించారు. సరిహద్దులో ఇంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ... చైనా తీరును మోదీ ఎందుకు తప్పుపట్టడం లేదని అడిగారు.

"పీఎం కేర్స్​ ద్వారా చైనా సంస్థల నుంచి ప్రధానికి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మోదీ తన వ్యాఖ్యలపై తాను నిలబడకుండా.. చైనా సంస్థల నుంచి వందల కోట్లను స్వీకరిస్తే.. ఇక చైనా దుశ్చర్యల నుంచి దేశాన్ని ఎలా రక్షిస్తారు?"

--- అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

కరోనాపై పోరులో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలో పీఎం కేర్స్​ను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. అప్పటి నుంచి అందిన విరాళాల వివరాలను, వాటిని ఉపయోగించిన తీరును ప్రజల ముందు ఉంచాలని డిమాండ్​ చేస్తోంది కాంగ్రెస్​.

భాజపా అధ్యక్షులు కూడా...

2007 నుంచి చైనా కమ్యూనిస్ట్​ పార్టీతో భాజపాకు సంబంధాలున్నాయని సింఘ్వీ ఆరోపించారు. రాజ్​నాథ్​ సింగ్​, నితిన్​ గడ్కరీ, అమిత్​ షాలు చైనాతో అనేక మార్లు సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు.

"దేశ రాజకీయ పార్టీల చరిత్రలో భాజపా మినహా.. ఏ పార్టీ అధ్యక్షులు ఇన్నిసార్లు చైనాతో సంప్రదింపులు జరపలేదు. భాజపాకు 'నేను, నాకు, రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​' అనే సొంత లాభాలు తప్ప ఇంకేవీ ముఖ్యం కాదు. జాతీయ భద్రతను అస్సలు పట్టించుకోవడం లేదు."

---అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​ విరాళాలపై భాజపా చేసిన విమర్శలను కాంగ్రెస్​ తిప్పికొట్టింది. పీఎం కేర్స్​కు చైనా సంస్థల నుంచి విరాళాలు అందుతున్నాయని.. సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ వాటిని ఎందుకు స్వీకరిస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీసింది.

చైనా అధ్యక్షుడు జిన్​పింగ్​ను.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరేళ్లలో 18సార్లు ఎందుకు కలిశారని కాంగ్రెస్​ సీనియర్​ నేత అభిషేక్​ మను సింఘ్వీ ప్రశ్నించారు. సరిహద్దులో ఇంత ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ... చైనా తీరును మోదీ ఎందుకు తప్పుపట్టడం లేదని అడిగారు.

"పీఎం కేర్స్​ ద్వారా చైనా సంస్థల నుంచి ప్రధానికి భారీ మొత్తంలో విరాళాలు అందుతున్నాయి. ఇది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మోదీ తన వ్యాఖ్యలపై తాను నిలబడకుండా.. చైనా సంస్థల నుంచి వందల కోట్లను స్వీకరిస్తే.. ఇక చైనా దుశ్చర్యల నుంచి దేశాన్ని ఎలా రక్షిస్తారు?"

--- అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

కరోనాపై పోరులో భాగంగా ఈ ఏడాది మార్చి నెలలో పీఎం కేర్స్​ను ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. అప్పటి నుంచి అందిన విరాళాల వివరాలను, వాటిని ఉపయోగించిన తీరును ప్రజల ముందు ఉంచాలని డిమాండ్​ చేస్తోంది కాంగ్రెస్​.

భాజపా అధ్యక్షులు కూడా...

2007 నుంచి చైనా కమ్యూనిస్ట్​ పార్టీతో భాజపాకు సంబంధాలున్నాయని సింఘ్వీ ఆరోపించారు. రాజ్​నాథ్​ సింగ్​, నితిన్​ గడ్కరీ, అమిత్​ షాలు చైనాతో అనేక మార్లు సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు.

"దేశ రాజకీయ పార్టీల చరిత్రలో భాజపా మినహా.. ఏ పార్టీ అధ్యక్షులు ఇన్నిసార్లు చైనాతో సంప్రదింపులు జరపలేదు. భాజపాకు 'నేను, నాకు, రాజీవ్​ గాంధీ ఫౌండేషన్​' అనే సొంత లాభాలు తప్ప ఇంకేవీ ముఖ్యం కాదు. జాతీయ భద్రతను అస్సలు పట్టించుకోవడం లేదు."

---అభిషేక్​ సింఘ్వీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.