ETV Bharat / bharat

దుబే వ్యవహారంపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్​

author img

By

Published : Jul 10, 2020, 5:59 PM IST

ఎనిమిది మంది పోలీసుల ప్రాణాలను బలిగొని ఎన్​కౌంటర్​లో హతమైన వికాస్​ దుబేకు సంబంధించిన ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్​ జడ్జితో న్యాయవిచారణ జరపాలని డిమాండ్ చేసింది కాంగ్రెస్​. అప్పుడే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయంది. అతనికి ఎవరు రక్షణ కల్పించారు, ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయ నేతలకు-నేరస్థులకు మధ్య సంబంధాలేంటి వంటి విషయాల గురించి ప్రజలకు తెలుస్తాయని వ్యాఖ్యానించింది.

Cong demands judicial probe by sitting SC judge into entire episode involving gangster Dubey
దుబే ఘటనలపై న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్​

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాన్పుర్​లో 8మంది పోలీసులను బలిగొన్న కరుడుగట్టిన నేరస్థుడు వికాస్​ దుబే ఎన్​కౌంటర్​లో హతమవ్వడం వల్ల కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్​ వ్యాఖ్యానించింది. దుబేకు సంబంధించిన ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. అప్పుడే అసలు నిజాలు ప్రజలకు తెలుస్తాయని మీడియా సమావేశంలో అన్నారు. దుబేకు రక్షణ కల్పించిన శక్తులు, ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయ నేతలకు-నేరస్థులకు మధ్య సంబంధాల గురించి వాస్తవాలు వెలుగులోకి రావాలన్నారు.

దుబే అరెస్టయి కోర్టులో నోరు విప్పితే రాజకీయనేతలు, పోలీసులు, నేరస్థుల మధ్య సంబంధాలు బయట పడతాయనే భయంతో ఎన్​కౌంటర్​లో అతడిని హతం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు సుర్జేవాలా. దుబే లాంటి కరుడు గట్టిన నేరస్థుడు స్వేచ్ఛగా బయట తిరగడాన్ని గమనిస్తే యూపీలో యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం శాంతి భద్రతలకు ఏ విధంగా కట్టుబడి ఉందో అర్థమవుతోందని విమర్శించారు.

కాన్పుర్​ ఘటనపై సుప్రీం సిట్టింగ్​ జడ్జితో విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా డిమాండ్​ చేశారు. ఈ కేసులో నిజాలు బహిర్గతమైతేనే 8 మంది పోలీసుల మృతికి న్యాయం జరిగినట్లవుతుందన్నారు.

ఇదీ చూడండి: గ్యాంగ్​స్టర్ దుబే హతం- అచ్చం సినిమాలానే!

ఉత్తర్​ప్రదేశ్​ ప్రభుత్వంపై విపక్షాలు విరుచుకుపడుతున్నాయి. కాన్పుర్​లో 8మంది పోలీసులను బలిగొన్న కరుడుగట్టిన నేరస్థుడు వికాస్​ దుబే ఎన్​కౌంటర్​లో హతమవ్వడం వల్ల కొత్త ప్రశ్నలు లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్​ వ్యాఖ్యానించింది. దుబేకు సంబంధించిన ఘటనలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణ్​దీప్​ సుర్జేవాలా. అప్పుడే అసలు నిజాలు ప్రజలకు తెలుస్తాయని మీడియా సమావేశంలో అన్నారు. దుబేకు రక్షణ కల్పించిన శక్తులు, ఉత్తర్​ప్రదేశ్​లో రాజకీయ నేతలకు-నేరస్థులకు మధ్య సంబంధాల గురించి వాస్తవాలు వెలుగులోకి రావాలన్నారు.

దుబే అరెస్టయి కోర్టులో నోరు విప్పితే రాజకీయనేతలు, పోలీసులు, నేరస్థుల మధ్య సంబంధాలు బయట పడతాయనే భయంతో ఎన్​కౌంటర్​లో అతడిని హతం చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు సుర్జేవాలా. దుబే లాంటి కరుడు గట్టిన నేరస్థుడు స్వేచ్ఛగా బయట తిరగడాన్ని గమనిస్తే యూపీలో యోగి ఆదిత్యనాథ్​ ప్రభుత్వం శాంతి భద్రతలకు ఏ విధంగా కట్టుబడి ఉందో అర్థమవుతోందని విమర్శించారు.

కాన్పుర్​ ఘటనపై సుప్రీం సిట్టింగ్​ జడ్జితో విచారణ జరపాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా డిమాండ్​ చేశారు. ఈ కేసులో నిజాలు బహిర్గతమైతేనే 8 మంది పోలీసుల మృతికి న్యాయం జరిగినట్లవుతుందన్నారు.

ఇదీ చూడండి: గ్యాంగ్​స్టర్ దుబే హతం- అచ్చం సినిమాలానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.