ETV Bharat / bharat

పౌరసత్వ బిల్లులో నిబంధనలపై నిఘా సంస్థల ఆందోళన

author img

By

Published : Dec 11, 2019, 6:48 AM IST

పౌరసత్వ సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలపై భారత నిఘా సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. ఈ బిల్లును ఉపయోగించుకుని పాక్​ నిఘా సంస్థలు తమ ఏజెంట్లను మన దేశంలోకి పంపించే అవకాశం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ మేరకు పార్లమెంటరీ కమిటీ ముందు నిఘా సంస్థల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

Concerns of intelligence agencies over provisions in the Citizenship Bill
పౌరసత్వ బిల్లులో నిబంధనలపై నిఘా సంస్థల ఆందోళన

పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన పీడనకు గురై మనదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. విపక్షాలు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ లోక్‌సభలో దానికి ఆమోదముద్ర పడింది. అయితే, భారత నిఘా సంస్థలైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) పౌరసత్వ సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలపై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పాక్‌ నిఘా సంస్థ తమ ఏజెంట్లను మనదేశంలోకి పంపించేందుకు ఈ బిల్లును ఉపయోగించుకునే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వ బిల్లుకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ముందు ఐబీ, రా ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నిర్ధారణ కష్టమే

మతపరమైన హింసను కారణంగా చూపుతూ దశాబ్దాల క్రితమే పలువురు మనదేశంలోకి శరణార్థులుగా ప్రవేశించారు. వారు చూపిన కారణం వాస్తవమైనదేనా అనే సంగతిని ప్రస్తుతం నిర్ధారించుకోవడం కష్టమని కమిటీ ఎదుట ఐబీ పేర్కొంది. ఇటీవలి కాలంలోనే వచ్చినవారైతే మాత్రం.. ఆయా దేశాల్లో పరిస్థితుల తీవ్రతను మీడియా కథనాల ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పింది. శరణార్థుల దరఖాస్తులపై విదేశీయుల నమోదు కార్యాలయం ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తామంది. విదేశాల్లో మతపరమైన పీడనను కారణంగా చూపుతూ ఇప్పటివరకు 31,313 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

లొసుగుగా మారే అవకాశం!

శత్రు దేశాల నిఘా సంస్థలు తమ ఏజెంట్లు, మద్దతుదారులను భారత్‌లోకి పంపించేందుకు పౌరసత్వ బిల్లును లొసుగుగా ఉపయోగించుకునే అవకాశముందని కమిటీ ముందు ‘రా’ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి పరిణామాలు దేశ భద్రతకు ప్రతికూలంగా మారే అవకాశముందని పేర్కొంది. పాక్‌ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

- సంజీబ్‌ బారువా, ఈటీవీ భారత్‌ ప్రతినిధి

పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా విపరీతమైన చర్చ నడుస్తోంది. అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల్లో మతపరమైన పీడనకు గురై మనదేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. విపక్షాలు గట్టిగా వ్యతిరేకించినప్పటికీ లోక్‌సభలో దానికి ఆమోదముద్ర పడింది. అయితే, భారత నిఘా సంస్థలైన ఇంటెలిజెన్స్‌ బ్యూరో(ఐబీ), రీసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌(రా) పౌరసత్వ సవరణ బిల్లులోని కొన్ని నిబంధనలపై ఆందోళన చెందుతున్నాయి. ముఖ్యంగా పాక్‌ నిఘా సంస్థ తమ ఏజెంట్లను మనదేశంలోకి పంపించేందుకు ఈ బిల్లును ఉపయోగించుకునే అవకాశముందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పౌరసత్వ బిల్లుకు సంబంధించిన పార్లమెంటరీ కమిటీ ముందు ఐబీ, రా ప్రతినిధులు ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడించారు.

నిర్ధారణ కష్టమే

మతపరమైన హింసను కారణంగా చూపుతూ దశాబ్దాల క్రితమే పలువురు మనదేశంలోకి శరణార్థులుగా ప్రవేశించారు. వారు చూపిన కారణం వాస్తవమైనదేనా అనే సంగతిని ప్రస్తుతం నిర్ధారించుకోవడం కష్టమని కమిటీ ఎదుట ఐబీ పేర్కొంది. ఇటీవలి కాలంలోనే వచ్చినవారైతే మాత్రం.. ఆయా దేశాల్లో పరిస్థితుల తీవ్రతను మీడియా కథనాల ద్వారా తెలుసుకోవచ్చునని చెప్పింది. శరణార్థుల దరఖాస్తులపై విదేశీయుల నమోదు కార్యాలయం ఆధ్వర్యంలో విచారణ నిర్వహిస్తామంది. విదేశాల్లో మతపరమైన పీడనను కారణంగా చూపుతూ ఇప్పటివరకు 31,313 మంది భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది.

లొసుగుగా మారే అవకాశం!

శత్రు దేశాల నిఘా సంస్థలు తమ ఏజెంట్లు, మద్దతుదారులను భారత్‌లోకి పంపించేందుకు పౌరసత్వ బిల్లును లొసుగుగా ఉపయోగించుకునే అవకాశముందని కమిటీ ముందు ‘రా’ ఆందోళన వ్యక్తం చేసింది. అలాంటి పరిణామాలు దేశ భద్రతకు ప్రతికూలంగా మారే అవకాశముందని పేర్కొంది. పాక్‌ గూఢచర్య సంస్థ ‘ఐఎస్‌ఐ’ని దృష్టిలో పెట్టుకొని ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

- సంజీబ్‌ బారువా, ఈటీవీ భారత్‌ ప్రతినిధి

Pokhran (Rajasthan), Dec 10 (ANI): Indian Army fired Excalibur precision guided ammunition from M-777 artillery howitzers in Pokhran firing ranges in Rajasthan on December 09. Excalibur penetrates 8-10 inches thick concrete walls and reduces chances of collateral damage when used against enemy. The holes on rooftop showed concrete penetration capability of the ammunition, which can be fired only from M-777 howitzers. The ammunition was fired at both concrete and sand bunkers.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.