ETV Bharat / bharat

'కో-పైలట్​ను కాపాడేందుకు ఎంతో ప్రయత్నించాం.. కానీ'

author img

By

Published : Aug 9, 2020, 3:33 PM IST

కేరళ విమాన ప్రమాద ఘటనలో మరణించిన కో పైలట్​ అఖిలేశ్​ కుమార్​ చివరివరకు ప్రాణాలతో పోరాడారని... సహాయక చర్యల్లో పాల్గొన్న ఓ వలంటీర్ తెలిపారు. బాధితుడిని తక్షణమే తమ సొంత వాహనంలో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయిందని ఈటీవీ భారత్​తో చెప్పారు.

Co-Pilot had a pulse during the rescue, Tried hard to revive him: Rescue volunteer
'కో-పైలట్​ను కాపాడటానికి ఎంతో ప్రయత్నించాం..కానీ'

ఎయిర్​ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఓ వ్యక్తి​ ఐదుగురి ప్రాణాలను కాపాడారు. తాలూకా విపత్తు స్పందనా దళం(టీడీఆర్​ఎఫ్​) వలంటీర్ ఆసిఫ్​ కొండోటి ప్రమాదం గురించి తెలిసిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని.. ఐదుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

విమానం రెండు ముక్కలుగా పడి ఉన్న దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు ఆసిఫ్​. అక్కడి మహిళలు, పిల్లలు సాయం కోసం ఎదురుచూస్తున్నారని... తక్షణమే తాను రక్షణ చర్యలు చేపట్టానని చెప్పారు​. అంబులెన్సు​లు, ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది రాకముందే స్థానికుల సాయంతో వారి వారి వాహనాలు, టాక్సీల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

అయితే... రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో ఆసిఫ్​ కాక్​పిట్​లోకి ప్రవేశించి కో పైలట్​ అఖిలేశ్​ కుమార్​ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అఖిలేశ్​ ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు చెప్పారు..

''ఆ సమయంలో నేను పైలట్​​(కెప్టెన్​ దీపక్​ సాథే) వద్దకు వెళ్లి పల్స్​ చెక్​ చేశాను. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. అక్కడే తీవ్ర గాయాలతో ఉన్న కో పైలట్​(అఖిలేశ్​ కుమార్​) నాడీని పరిశీలించగా.. ఆయన ప్రాణాలతో ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తరలించాం.''

- ఆసిఫ్, వలంటీర్​

అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు అఖిలేశ్​ కుమార్​. ఆయన భార్య గర్భిణి. కో పైలట్​ మరణవార్తతో ఇప్పుడు ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వస్థలం.. ఉత్తర్​ప్రదేశ్​లోని మథుర.

వర్షాన్ని లెక్కచేయకుండా..

ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురి ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడినందుకు ఆసిఫ్.. దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసిఫ్ స్నేహితులు జాసిర్ జావేద్, జజీర్, సిద్దిఖీ​ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత వారి వాహనాల్లోనే... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ల్యాండింగ్​కు​ క్లియరెన్స్​ వచ్చాకే కూలిన విమానం!

ఎయిర్​ ఇండియా విమానం ప్రమాదానికి గురైన ఘటనలో ఓ వ్యక్తి​ ఐదుగురి ప్రాణాలను కాపాడారు. తాలూకా విపత్తు స్పందనా దళం(టీడీఆర్​ఎఫ్​) వలంటీర్ ఆసిఫ్​ కొండోటి ప్రమాదం గురించి తెలిసిన 10 నిమిషాల్లోనే ఘటనా స్థలానికి చేరుకొని.. ఐదుగురు ప్రయాణికులను ఆసుపత్రికి తరలించారు.

విమానం రెండు ముక్కలుగా పడి ఉన్న దృశ్యం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందన్నారు ఆసిఫ్​. అక్కడి మహిళలు, పిల్లలు సాయం కోసం ఎదురుచూస్తున్నారని... తక్షణమే తాను రక్షణ చర్యలు చేపట్టానని చెప్పారు​. అంబులెన్సు​లు, ఎన్​డీఆర్​ఎఫ్​ సిబ్బంది రాకముందే స్థానికుల సాయంతో వారి వారి వాహనాలు, టాక్సీల్లో క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు.

అయితే... రక్షణ చర్యలు చేపట్టే క్రమంలో ఆసిఫ్​ కాక్​పిట్​లోకి ప్రవేశించి కో పైలట్​ అఖిలేశ్​ కుమార్​ వద్దకు వెళ్లారు. ఆ సమయంలో అఖిలేశ్​ ఇంకా ప్రాణాలతోనే ఉన్నట్లు చెప్పారు..

''ఆ సమయంలో నేను పైలట్​​(కెప్టెన్​ దీపక్​ సాథే) వద్దకు వెళ్లి పల్స్​ చెక్​ చేశాను. కానీ అప్పటికే ఆయన చనిపోయారు. అక్కడే తీవ్ర గాయాలతో ఉన్న కో పైలట్​(అఖిలేశ్​ కుమార్​) నాడీని పరిశీలించగా.. ఆయన ప్రాణాలతో ఉన్నట్లు తెలిసింది. వెంటనే ఆస్పత్రికి తరలించాం.''

- ఆసిఫ్, వలంటీర్​

అయితే.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు అఖిలేశ్​ కుమార్​. ఆయన భార్య గర్భిణి. కో పైలట్​ మరణవార్తతో ఇప్పుడు ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన స్వస్థలం.. ఉత్తర్​ప్రదేశ్​లోని మథుర.

వర్షాన్ని లెక్కచేయకుండా..

ముగ్గురు పిల్లలతో సహా ఐదుగురి ప్రాణాలను ప్రమాదం నుంచి కాపాడినందుకు ఆసిఫ్.. దేవునికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసిఫ్ స్నేహితులు జాసిర్ జావేద్, జజీర్, సిద్దిఖీ​ కూడా సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత వారి వాహనాల్లోనే... క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ల్యాండింగ్​కు​ క్లియరెన్స్​ వచ్చాకే కూలిన విమానం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.