ETV Bharat / bharat

దిల్లీ అల్లర్లలో బాలిక గల్లంతు- 3 రోజులైనా తెలియని ఆచూకీ

author img

By

Published : Feb 27, 2020, 4:52 PM IST

Updated : Mar 2, 2020, 6:41 PM IST

దిల్లీలో చెలరేగిన హింస కారణంగా సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బయటకు వెళ్లిన వారు ఇళ్లకు వస్తారనే నమ్మకం లేదు. ఈ నేపథ్యంలో పరీక్ష రాసేందుకు పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యం కాగా.. అనేకమంది అల్లర్ల కారణంగా సొంతవారికి దూరంగా ఉండాల్సి వస్తోంది.

Class 8 student who went to take exam missing since Monday
దిల్లీ అల్లర్లతో స్తంభించిన జనజీవనం.. బాలిక అదృశ్యం

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల ఈశాన్య దిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన వారు పుట్టకొకరు, చెట్టుకొకరు చొప్పును అవుతున్నారు. బయటకు వెళ్లినవారు ఇళ్లకు వస్తారన్న నమ్మకం లేదు. ఇలానే మూడు రోజులు క్రితం పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక సోమవారం పరీక్ష రాయడానికి ఖజూరి ఖాస్​ ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లింది. ప్రతి రోజు ఆమెను ఇంటికి తీసుకొచ్చే తండ్రి తమ పరిసరాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకొని సాయంత్రం వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో సాయంత్రం అమె ఇంటికి రాలేదు. సోనియా విహార్​ శివారులో ఉండే ఈ బాలిక 4.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతోంది.

" రోజు నా కుమార్తెను సాయంత్రం 5.20గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంటికి తీసుకొస్తుంటా. కానీ సోమవారం మా పరిసరాల్లో ఆందోళనలు మిన్నంటడం వల్ల పాఠశాలకు చేరుకోలేకపోయా. తర్వాత నా కూతురు ఇంటికి రాలేదు. "

- బాలిక తండ్రి

బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. త్వరలో బాలికను గుర్తిస్తామని పేర్కొన్నారు.

ఇంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులు..

మౌజ్​పూర్​లో నివాసం ఉండే మహ్మద్​ సబీర్ కుటుంబ సభ్యులు శివ్​ విహార్​లోని తన మరో ఇంట్లో చిక్కుకున్నారని తెలిపారు. వారిని కనీసం చరవాణిలో కూడా సంప్రదించడం కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారాయన.

"శివ్ విహార్​లో నాకు ఓ ఇల్లు ఉంది. నా ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటున్నారు. అల్లర్ల కారణంగా నేను వారి దగ్గరకు వెళ్లడం లేదు. రాత్రి నుంచి వారితో ఫోను కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం ఇక్కడ ఇంకా ఉద్రక్తంగానే ఉంది. చివరిసారిగా వారు నాతో మాట్లాడినప్పుడు ఇంటి దగ్గర నిరసనకారులు ఉన్నారని, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పోలీసులే నా పిల్లల్ని కాపాడాలి. "

- మహ్మద్​ సబీర్​

మౌజ్​పూర్​, జఫ్రాబాద్​, బాబర్​పూర్, యమునా విహార్, శివ్​ విహార్​, భజ్నపూరా, చాంద్​బాగ్​, ఘోండా, పరిసర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 34మంది మృతి చెందారు. 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితులను సరిదిద్దేందుకు పోలీసులు, పారా మిలటరీ బృందాలు రంగంలోకి దిగాయి. దిల్లీ పోలీసులు ఇప్పటివరకు 18 కేసులు నమోదు చేసి 106 మందిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: 'ఆ మంటల్లో పడి మీరు చావలేదుగా'

పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడం వల్ల ఈశాన్య దిల్లీలో జనజీవనం స్తంభించిపోయింది. ఒకే కుటుంబానికి చెందిన వారు పుట్టకొకరు, చెట్టుకొకరు చొప్పును అవుతున్నారు. బయటకు వెళ్లినవారు ఇళ్లకు వస్తారన్న నమ్మకం లేదు. ఇలానే మూడు రోజులు క్రితం పాఠశాలకు వెళ్లిన ఓ విద్యార్థిని అదృశ్యమైంది.

ఎనిమిదో తరగతి చదువుతున్న 13 ఏళ్ల బాలిక సోమవారం పరీక్ష రాయడానికి ఖజూరి ఖాస్​ ప్రాంతంలోని పాఠశాలకు వెళ్లింది. ప్రతి రోజు ఆమెను ఇంటికి తీసుకొచ్చే తండ్రి తమ పరిసరాల్లో జరుగుతున్న అల్లర్లలో చిక్కుకొని సాయంత్రం వెళ్లలేకపోయారు. ఈ క్రమంలో సాయంత్రం అమె ఇంటికి రాలేదు. సోనియా విహార్​ శివారులో ఉండే ఈ బాలిక 4.5 కిలో మీటర్ల దూరంలో ఉన్న పాఠశాలలో చదువుతోంది.

" రోజు నా కుమార్తెను సాయంత్రం 5.20గంటలకు పాఠశాలకు వెళ్లి ఇంటికి తీసుకొస్తుంటా. కానీ సోమవారం మా పరిసరాల్లో ఆందోళనలు మిన్నంటడం వల్ల పాఠశాలకు చేరుకోలేకపోయా. తర్వాత నా కూతురు ఇంటికి రాలేదు. "

- బాలిక తండ్రి

బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. త్వరలో బాలికను గుర్తిస్తామని పేర్కొన్నారు.

ఇంట్లో చిక్కుకున్న కుటుంబ సభ్యులు..

మౌజ్​పూర్​లో నివాసం ఉండే మహ్మద్​ సబీర్ కుటుంబ సభ్యులు శివ్​ విహార్​లోని తన మరో ఇంట్లో చిక్కుకున్నారని తెలిపారు. వారిని కనీసం చరవాణిలో కూడా సంప్రదించడం కుదరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారాయన.

"శివ్ విహార్​లో నాకు ఓ ఇల్లు ఉంది. నా ఇద్దరు పిల్లలు అక్కడే ఉంటున్నారు. అల్లర్ల కారణంగా నేను వారి దగ్గరకు వెళ్లడం లేదు. రాత్రి నుంచి వారితో ఫోను కూడా మాట్లాడలేదు. ప్రస్తుతం ఇక్కడ ఇంకా ఉద్రక్తంగానే ఉంది. చివరిసారిగా వారు నాతో మాట్లాడినప్పుడు ఇంటి దగ్గర నిరసనకారులు ఉన్నారని, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. పోలీసులే నా పిల్లల్ని కాపాడాలి. "

- మహ్మద్​ సబీర్​

మౌజ్​పూర్​, జఫ్రాబాద్​, బాబర్​పూర్, యమునా విహార్, శివ్​ విహార్​, భజ్నపూరా, చాంద్​బాగ్​, ఘోండా, పరిసర ప్రాంతాల్లో జరిగిన అల్లర్లలో 34మంది మృతి చెందారు. 200 మందికిపైగా గాయపడ్డారు. పరిస్థితులను సరిదిద్దేందుకు పోలీసులు, పారా మిలటరీ బృందాలు రంగంలోకి దిగాయి. దిల్లీ పోలీసులు ఇప్పటివరకు 18 కేసులు నమోదు చేసి 106 మందిని అరెస్టు చేశారు.

ఇదీ చదవండి: 'ఆ మంటల్లో పడి మీరు చావలేదుగా'

Last Updated : Mar 2, 2020, 6:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.