ETV Bharat / bharat

'చర్చల ద్వారానే సరిహద్దు సమస్యకు పరిష్కారం' - భారత విదేశాంగమంత్రి జైశంకర్

చైనా విదేశాంగ మంత్రి వాంగ్​ యీ, భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తో ఫోన్​లో మాట్లాడారు. సరిహద్దు వివాదాన్ని చర్చల ద్వారా పరిష్కరించుకుందామని ఆయన ప్రతిపాదించారు. అయితే సరిహద్దు ఘర్షణ పక్క ప్రణాళిక ప్రకారమే జరిగిందని జైశంకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తానికి చర్చల ద్వారానే వివాదాన్నిపరిష్కరించుకోవాలని ఇరువర్గాలు నిర్ణయించాయి.

Chinese Foreign Minister speaks to Jaishankar
చర్చల ద్వారానే సరిహద్దు సమస్యకు పరిష్కారం: చైనా
author img

By

Published : Jun 17, 2020, 5:47 PM IST

తూర్పు లద్దాక్​లో చెలరేగిన సరిహద్దు వివాదాన్ని భారత్​ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ప్రతిపాదించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తో ఫోన్​లో మాట్లాడిన వాంగ్​ యీ... వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, ప్రశాంతత కొనసాగించేందుకు విభేదాలు పక్కన పెట్టాలని, సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఇంతకు ముందు కుదిరిన ఒప్పందాలను ఇరుదేశాలు పరస్పరం గౌరవించాలని పునరుద్ఘాటించారు వాంగ్​.

ప్రణాళిక ప్రకారమే చేశారు..

గాల్వన్ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిందని జైశంకర్​ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు చైనా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

సైనికులను అదుపులో ఉంచండి..

అయితే భారత సైనికులే హద్దు మీరారని, అందువల్ల వారిని అదుపులో ఉంచి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వాంగ్​ యీ కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది.

న్యాయంగా వ్యవహరిద్దాం..

సరిహద్దు సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇరుదేశాల మధ్య జరిగిన సైనిక స్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి స్థాపనకు కృషి చేయాలని నిర్ణయించాయి.

ఇరువైపులా భారీ ప్రాణనష్టం

గాల్వన్​ లోయ వద్ద భారత్​-చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. భారత్​ వైపు 20 మంది సైనికులు వీర మరణం పొందగా, సుమారు 43 మంది చైనా జవానులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'మోదీజీ... సరిహద్దు ఘర్షణపై మౌనం వీడండి'

తూర్పు లద్దాక్​లో చెలరేగిన సరిహద్దు వివాదాన్ని భారత్​ చైనాలు చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగమంత్రి వాంగ్ యీ ప్రతిపాదించారు. భారత విదేశాంగ మంత్రి జైశంకర్​తో ఫోన్​లో మాట్లాడిన వాంగ్​ యీ... వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి, ప్రశాంతత కొనసాగించేందుకు విభేదాలు పక్కన పెట్టాలని, సంయమనం పాటించాలని పేర్కొన్నారు. ఇంతకు ముందు కుదిరిన ఒప్పందాలను ఇరుదేశాలు పరస్పరం గౌరవించాలని పునరుద్ఘాటించారు వాంగ్​.

ప్రణాళిక ప్రకారమే చేశారు..

గాల్వన్ ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని.. ఓ పక్కా ప్రణాళిక ప్రకారం చేసిందని జైశంకర్​ పేర్కొన్నారు. ఈ దుర్ఘటనకు చైనా బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.

సైనికులను అదుపులో ఉంచండి..

అయితే భారత సైనికులే హద్దు మీరారని, అందువల్ల వారిని అదుపులో ఉంచి, బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని వాంగ్​ యీ కోరినట్లు రాయిటర్స్ పేర్కొంది.

న్యాయంగా వ్యవహరిద్దాం..

సరిహద్దు సమస్యను న్యాయబద్ధంగా పరిష్కరించుకోవడానికి ఇరుదేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి. ఇరుదేశాల మధ్య జరిగిన సైనిక స్థాయి సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండాలని తీర్మానించాయి. వీలైనంత త్వరగా సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించి, శాంతి స్థాపనకు కృషి చేయాలని నిర్ణయించాయి.

ఇరువైపులా భారీ ప్రాణనష్టం

గాల్వన్​ లోయ వద్ద భారత్​-చైనా సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణలో భారీ ప్రాణ నష్టం సంభవించింది. భారత్​ వైపు 20 మంది సైనికులు వీర మరణం పొందగా, సుమారు 43 మంది చైనా జవానులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల విదేశాంగ మంత్రులు ఫోన్లో చర్చలు జరపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇదీ చూడండి: 'మోదీజీ... సరిహద్దు ఘర్షణపై మౌనం వీడండి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.