ETV Bharat / bharat

భారత్​తో వివాదంపై చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు

కొద్ది రోజులుగా భారత్​-చైనా సరిహద్దులో ఉద్రిక్త వాతావరణ నెలకొంది. ఈ నేపథ్యంలో తమ మధ్య ఉన్న భేదాభిప్రాయాలు ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలను ప్రభావితం చేయకుండా చూసుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు భారత్​లోని చైనా రాయబారి సన్​ వైడాంగ్​. పరస్పర సహకారంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.

author img

By

Published : May 27, 2020, 7:52 PM IST

China, India should not let differences shadow overall ties: Chinese envoy
'భారత్​-చైనా సంబంధాలపై అవి ప్రభావం చూపకూడదు'

భారత్​-చైనా మధ్య ఉన్న భేదాభిప్రాయాలు.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపకూడదని జాగ్రత్త వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు భారత్​లోని చైనా రాయబారి సన్​ వైడాంగ్. ఇరు దేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో వైడాంగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరు దేశాల మధ్య ఉన్న భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వైడాంగ్​ సూచించారు. ఒకరినొకరు ఏ విధంగా కూడా హాని పరుచుకోకూడదన్న ప్రాథమిక నియమానికి ఇరుదేశాలు కట్టుబడి ఉండాలన్నారు.

"మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఆ ప్రభావం మన ద్వైపాక్షిక సంబంధాలపై పడకూడదు. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. చైనా-భారత్​ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. తన అభివృద్ధితో పాటు భారత్​కు వృద్ధి చెందాలని చైనా కోరుకుంటోంది. తమ లక్ష్యాలను ఛేదించడానికి ఇరు దేశాలు సహకరించుకోవాలి."

-- సన్​ వైడాంగ్​, భారత్​లోని చైనా రాయబారి.

భారత్​, చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం అంతకంతకూ ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితులు మరో డోక్లాంను తలపించేలా ఉన్నాయి. కరోనా విజృంభించిన వేళ.. సైనికుల చొరబాటు చర్యతో భారత్​ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది చైనా.

ఇదీ చూడండి:- ఢీ అంటే ఢీ: సరిహద్దులో భారత్​- చైనా బలగాల మోహరింపు

భారత్​-చైనా మధ్య ఉన్న భేదాభిప్రాయాలు.. ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపకూడదని జాగ్రత్త వహించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు భారత్​లోని చైనా రాయబారి సన్​ వైడాంగ్. ఇరు దేశాలు పరస్పర విశ్వాసంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. వాస్తవాధీన రేఖ వెంబడి భారత్​-చైనా సైనికుల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న తరుణంలో వైడాంగ్​ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇరు దేశాల మధ్య ఉన్న భేదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని వైడాంగ్​ సూచించారు. ఒకరినొకరు ఏ విధంగా కూడా హాని పరుచుకోకూడదన్న ప్రాథమిక నియమానికి ఇరుదేశాలు కట్టుబడి ఉండాలన్నారు.

"మన మధ్య ఉన్న భేదాభిప్రాయాలను సరైన రీతిలో అర్థం చేసుకోవాలి. ఆ ప్రభావం మన ద్వైపాక్షిక సంబంధాలపై పడకూడదు. అదే సమయంలో చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలి. చైనా-భారత్​ ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. తన అభివృద్ధితో పాటు భారత్​కు వృద్ధి చెందాలని చైనా కోరుకుంటోంది. తమ లక్ష్యాలను ఛేదించడానికి ఇరు దేశాలు సహకరించుకోవాలి."

-- సన్​ వైడాంగ్​, భారత్​లోని చైనా రాయబారి.

భారత్​, చైనా మధ్య తలెత్తిన సరిహద్దు వివాదం అంతకంతకూ ముదురుతోంది. ప్రస్తుత పరిస్థితులు మరో డోక్లాంను తలపించేలా ఉన్నాయి. కరోనా విజృంభించిన వేళ.. సైనికుల చొరబాటు చర్యతో భారత్​ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నిస్తోంది చైనా.

ఇదీ చూడండి:- ఢీ అంటే ఢీ: సరిహద్దులో భారత్​- చైనా బలగాల మోహరింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.