గుజరాత్లోని వస్త్ర పరిశ్రమలు, హోటళ్లలో వెట్టిచాకిరి చేయించేందుకు రాజస్థాన్ నుంచి తీసుకువచ్చిన 138 మంది బాలలను రక్షించారు రాజస్థాన్, గుజరాత్ బాలల హక్కుల కమిషన్ అధికారులు. నోబెల్ గ్రహీత కైలాశ్ సత్యార్థి నిర్వహించే సామాజిక సంస్థ 'బచ్పన్ బచావో ఆందోళన్' సహకారంతో సూరత్లో సోదాలు నిర్వహించి ఈ బాలలను రక్షించారు.
సోదాల్లో పట్టుకున్న 12 మంది నిందితులను పోలీసులకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. రక్షించిన 138 మంది బాలల్లో 128 మంది రాజస్థాన్కు చెందినవారు కాగా మిగతావారు ఝార్ఖండ్, ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రాలవారు.
బాలలు ఈ దురవస్థ నుంచి బయటపడేందుకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇప్పించనున్నట్లు అధికారులు చెప్పారు. వీరిలో ఎక్కువ మంది రాజస్థాన్లోని గిరిజన ప్రాంతాలకు చెందిన వారే ఉన్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: మానవుల్లో నృత్య నైపుణ్యం చింపాంజీల నుంచే.!