పవిత్ర చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ సందర్భంగా నేడు ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను వేద మంతోచ్ఛారణల మధ్య శాస్త్రీయంగా తిరిగి తెరిచారు. అభిజిత్ లజ్ఞంలో మధ్యాహ్నం 12.35 గంటలకు గంగోత్రి, 12.41 నిమిషాలకు యమునోత్రి పుణ్యక్షేత్రాలు తెరుచుకున్నాయి.
కరోనా దృష్ట్యా ఈ ఏడాది భక్తులను దర్శనానికి అనుమతించడం లేదు. ఈ కారణంగా ప్రారంభ పూజల్లో భక్తుల రద్దీ కనిపించలేదు. ఆలయ పూజాధికాలకు సంబంధించిన ముఖ్యులు, అధికారులు మాత్రమే ఈ ఉత్సవానికి హాజరయ్యారు.

గంగోత్రి, యమునోత్రి పుణ్యక్షేత్రాలను భౌతిక దూరం పాటిస్తూ శాస్త్రీయంగా తెరిచారు. అభిజిత్ లజ్ఞంగా పేర్కొంటున్న 12.35 నిమిషాలకు గంగోత్రి తలుపులను తెరిచారు. ఈ సందర్భంగా మూలవిరాట్ గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. కేదార్నాథ్ ఆలయం ఈ నెల 29న, భద్రీనాథ్ మే 15న తెరుచుకుంటాయి.

శీతాకాలంలో మంచు కారణంగా గంగామాత ముఖుబా గ్రామానికి, యమున మాత ఖుషిమఠ్కు వస్తారని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో ఆరునెలలపాటు చార్ధామ్ యాత్రను నిలిపేస్తారు. శీతాకాలం ముగిసిన అనంతరం ఆలయాలు పునఃప్రారంభమవుతాయి.

ఇదీ చూడండి: 'కరోనా టెస్టుల్లో దూకుడేది? ఇలా అయితే కష్టమే'