ETV Bharat / bharat

ఫేక్​ న్యూస్​ దెబ్బకు పోటెత్తిన వలసకూలీలు.. - migrants workers in bengaluru

లాక్​డౌన్ కారణంగా ఆయా రాష్ట్రల్లో చిక్కుకున్న వలస కార్మికులను తరలించేందుకు శ్రామిక్​ రైళ్లను నడుపుతోంది కేంద్రం. స్వస్థలాలకు వెళ్లాలనుకున్న వారు పేరు నమోదు చేసుకుంటే.. ముందుగా సమాచారం ఇచ్చి తరలిస్తున్నారు. అయితే రైళ్లపై తప్పుడు సమాచారం వల్ల బెంగళూరులోని ప్యాలెస్​ మైదానానికి వేల మంది కార్మికులు చేరుకున్నారు. దాంతో ఆ ప్రాంతంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

Chaos as migrants thong Palace grounds in Bengaluru
బెంగళూరు ప్యాలస్​ గ్రౌండ్స్​ ​ వద్ద వలస కార్మికులు
author img

By

Published : May 23, 2020, 7:50 PM IST

శ్రామిక్​ రైళ్లపై తప్పుడు సమాచారం వ్యాప్తితో.. కర్ణాటక బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్​ ప్రాంతానికి వేల మంది వలస కార్మికులు తరలివచ్చారు. ఫలితంగా ఆ పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు.. భారీ సంఖ్యలో చేరుకోవటం వల్ల కార్మికులు ఇబ్బందులు పడ్డారు. వారిని నియంత్రించడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు.

" స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు సేవా సింధు యాప్​ ద్వారా 1,500 మంది నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, బస్సుల ద్వారా రైళ్ల వద్దకు చేరవేస్తామని, ప్యాలెస్​ గ్రౌండ్స్​ ప్రాంతానికి రావాలని వారికి సమాచారం ఇచ్చాం. కానీ, వారు ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయటం ద్వారా భారీ సంఖ్యలో కూలీలు ఆ ప్రాంతానికి వచ్చారు. అది గందరగోళ పరిస్థితికి దారి తీసింది."

– అధికారులు.

సంఘటన స్థలానికి రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సుధాకర్​ చేరుకుని కార్మికులు శాంతియుతంగా ఉండాలని కోరారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని, అందరిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు సహకరించాలని కోరారు. ఆ సమయంలోనే ఓ యువకుడికి ఫిట్స్​ రావటం వల్ల అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేశారు మంత్రి.

ప్రస్తుతం టికెట్లు, అవసరమైన పత్రాలు ఉన్న వారిని మాత్రమే అనుమతించామని, మిగతావారు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు.

Chaos as migrants thong Palace grounds in Bengaluru
ప్యాలస్ గ్రౌండ్స్​​ వద్ద వలస కార్మికులు
Chaos as migrants thong Palace grounds in Bengaluru
వలస కార్మికులతో మాట్లాడుతున్న మంత్రి
Chaos as migrants thong Palace grounds in Bengaluru
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి

శ్రామిక్​ రైళ్లపై తప్పుడు సమాచారం వ్యాప్తితో.. కర్ణాటక బెంగళూరు ప్యాలెస్ గ్రౌండ్స్​ ప్రాంతానికి వేల మంది వలస కార్మికులు తరలివచ్చారు. ఫలితంగా ఆ పరిసరాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు.. భారీ సంఖ్యలో చేరుకోవటం వల్ల కార్మికులు ఇబ్బందులు పడ్డారు. వారిని నియంత్రించడానికి అధికారులు తీవ్రంగా శ్రమించారు.

" స్వరాష్ట్రాలకు వెళ్లేందుకు సేవా సింధు యాప్​ ద్వారా 1,500 మంది నమోదు చేసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి, బస్సుల ద్వారా రైళ్ల వద్దకు చేరవేస్తామని, ప్యాలెస్​ గ్రౌండ్స్​ ప్రాంతానికి రావాలని వారికి సమాచారం ఇచ్చాం. కానీ, వారు ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని చేరవేయటం ద్వారా భారీ సంఖ్యలో కూలీలు ఆ ప్రాంతానికి వచ్చారు. అది గందరగోళ పరిస్థితికి దారి తీసింది."

– అధికారులు.

సంఘటన స్థలానికి రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి సుధాకర్​ చేరుకుని కార్మికులు శాంతియుతంగా ఉండాలని కోరారు. ఎవరూ ఆందోళనకు గురికావద్దని, అందరిని పంపేందుకు ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. అధికారులకు సహకరించాలని కోరారు. ఆ సమయంలోనే ఓ యువకుడికి ఫిట్స్​ రావటం వల్ల అతన్ని ఆస్పత్రికి తరలించేందుకు సాయం చేశారు మంత్రి.

ప్రస్తుతం టికెట్లు, అవసరమైన పత్రాలు ఉన్న వారిని మాత్రమే అనుమతించామని, మిగతావారు తమ వంతు వచ్చే వరకు వేచి ఉండాలని సూచించారు.

Chaos as migrants thong Palace grounds in Bengaluru
ప్యాలస్ గ్రౌండ్స్​​ వద్ద వలస కార్మికులు
Chaos as migrants thong Palace grounds in Bengaluru
వలస కార్మికులతో మాట్లాడుతున్న మంత్రి
Chaos as migrants thong Palace grounds in Bengaluru
అధికారులతో మాట్లాడుతున్న మంత్రి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.