ETV Bharat / bharat

రఫేల్​పై విచారణ అవసరంలేదు: సుప్రీంతో కేంద్రం

రఫేల్ ఒప్పందంపై విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టుకు నివేదించింది కేంద్రం. డిసెంబర్ 14 తీర్పు ముమ్మాటికీ సరైందనేనని పేర్కొంటూ మరో అఫిడవిట్​ దాఖలు చేసింది. ఈ నెల 6న తదుపరి విచారణ జరగనుంది.

author img

By

Published : May 4, 2019, 11:39 AM IST

రఫేల్​పై విచారణ అవసరంలేదు: సుప్రీంతో కేంద్రం

రఫేల్​పై సుప్రీంకోర్టుకు కేంద్రం మరో ప్రమాణపత్రం సమర్పించింది. డిసెంబర్ 14న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సరైందని అఫిడవిట్​లో పేర్కొంది. మీడియాలో వచ్చిన నిరాధార కథనాల ఆధారంగా విచారణ అక్కర్లేదని స్పష్టం చేసింది.

రఫేల్​పై తీర్పును పునఃసమీక్షించాలన్న పిటిషన్​లపై విచారణను మంగళవారం సుప్రీంకోర్టు మే 6కు వాయిదా వేసింది. అదనపు ప్రమాణపత్రం దాఖలుకు నాలుగు వారాల సమయం కావాలని కేంద్రం అభ్యర్థించగా... నేటి(మే4)వరకు గడువిచ్చింది.

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు​ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్​ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్​ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ వేరుగా పిటిషన్​ దాఖలు చేశారు.

రఫేల్​పై సుప్రీంకోర్టుకు కేంద్రం మరో ప్రమాణపత్రం సమర్పించింది. డిసెంబర్ 14న ఇచ్చిన సుప్రీంకోర్టు తీర్పు సరైందని అఫిడవిట్​లో పేర్కొంది. మీడియాలో వచ్చిన నిరాధార కథనాల ఆధారంగా విచారణ అక్కర్లేదని స్పష్టం చేసింది.

రఫేల్​పై తీర్పును పునఃసమీక్షించాలన్న పిటిషన్​లపై విచారణను మంగళవారం సుప్రీంకోర్టు మే 6కు వాయిదా వేసింది. అదనపు ప్రమాణపత్రం దాఖలుకు నాలుగు వారాల సమయం కావాలని కేంద్రం అభ్యర్థించగా... నేటి(మే4)వరకు గడువిచ్చింది.

ఫ్రాన్స్​ నుంచి 36 రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు​ ఒప్పందంలో ఎలాంటి అక్రమాలు జరగలేదని సుప్రీంకోర్టు గతేడాది డిసెంబర్​ 14న తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ కేంద్ర మాజీ మంత్రులు అరుణ్​ శౌరి, యశ్వంత్​ సిన్హా, న్యాయవాది ప్రశాంత్​ భూషణ్​ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఆప్​ నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ వేరుగా పిటిషన్​ దాఖలు చేశారు.

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.