ETV Bharat / bharat

కరోనా​పై పోరుకు కేంద్రం పక్కా ప్రణాళిక

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌ భారత్‌లో మూడోదశకు చేరకముందే నియంత్రణ చర్యలను సవాలుగా తీసుకొని ముందుకెళుతోంది కేంద్రం. స్థానికంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాధి సోకినట్లు స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ.. బాధితులకు సత్వర వైద్యం అందించేందుకు రాష్ట్రాల్లో పెద్దఎత్తున ప్రత్యేక ఆస్పత్రులు, ఐసొలేషన్‌ కేంద్రాల్ని ఏర్పాటు చేయిస్తోంది. రైలు పెట్టెలను ఐసొలేషన్‌ వార్డులుగా మార్చే వినూత్న ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు సైన్యాన్ని సిద్ధం చేస్తోంది.

author img

By

Published : Mar 28, 2020, 8:39 PM IST

Center struggles over Corona with a side plan
పక్కా ప్రణాళికతో కరోనాపై కేంద్రం పోరాటం

దేశంలో క్రమంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం సహా నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల సమన్వయంతో ముందజాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాల్లో వైరస్‌ బారిన పడిన వేలాది మందికి చికిత్స అందించేందుకు ఆయా ప్రభుత్వాలు సతమతమవుతుండగా.. ఎలాంటి విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కరోనాకు చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రులు, ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆరోగ్యం నిలకడగా ఉన్న రోగులను ఐసొలేషన్‌ నుంచి సాధారణ వార్డుకు మార్చేలా కొన్ని ప్రభుత్వ, ఆస్పత్రుల్లో బెడ్‌లను రిజర్వులో ఉంచుకోవాలని సూచించింది.

సర్వం సిద్ధంగా ఉంచుకోండి...

రాష్ట్రప్రభుత్వాలు వేలాది కేసులు బయటపడినప్పటికీ... చికిత్స అందించేందుకు అన్నిరకాలుగా సమాయత్తమయ్యాయి. ఇందుకు అవసరమైన వెంటిలేటర్లు, ఔషధాలు, ఇతర పరికరాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పెద్ద ఆస్పత్రులు, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలు కూడా భారీగా వెంటిలేటర్లు, మాస్క్‌లు, ఇతర సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. సైన్యం కూడా కోవిడ్‌-19కు చికిత్స కోసం 28 సర్వీసు ఆస్పత్రులను, పరీక్షల కోసం ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. పెద్దఎత్తున వెంటిలేటర్ల తయారీ బాధ్యతను కేంద్రం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు అప్పగించింది.

రైళ్లను ఐసొలేషన్​ వార్డులుగా..

రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ-డీఆర్​డీఓ వైద్యసిబ్బంది రక్షణకు అవసరమైన వస్తువులు, శానిటైజర్ల తయారీలో నిమగ్నమైంది. మరోవైపు వేలాది రైళ్లను కలిగి ఉన్న రైల్వేశాఖ నాన్‌ ఏసీ కోచ్‌లను ఐసొలేషన్‌ వార్డులుగా మారుస్తోంది. ప్రతి రైల్వే జోన్‌ పరిధిలో వారానికి 10 కోచ్‌లను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మార్చనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కోవిడ్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ-ఎయిమ్స్​ కూడా ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ ఏర్పాటు చేసింది.

వారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందే..

సాధారణ జలుబు చేసినా కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం వెంటాడుతున్న వేళ.. కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో ఓ స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచార పత్రాన్ని విడుదల చేసింది. గత 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణించి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనా సోకిన వారిని కలిసిన వారు, వారి వెంట తిరిగినవారు కూడా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. వైద్యరంగంలో పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు తప్పనిసరని పేర్కొంది.

దేశంలో క్రమంగా విస్తరిస్తున్న కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం సహా నివారణ దిశగా కేంద్ర ప్రభుత్వం.. రాష్ట్రాల సమన్వయంతో ముందజాగ్రత్త చర్యలను ముమ్మరం చేసింది. అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ వంటి దేశాల్లో వైరస్‌ బారిన పడిన వేలాది మందికి చికిత్స అందించేందుకు ఆయా ప్రభుత్వాలు సతమతమవుతుండగా.. ఎలాంటి విపత్తునైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు కేంద్రం పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాల్లో కరోనాకు చికిత్స కోసం ప్రత్యేక ఆస్పత్రులు, ఐసొలేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఆరోగ్యం నిలకడగా ఉన్న రోగులను ఐసొలేషన్‌ నుంచి సాధారణ వార్డుకు మార్చేలా కొన్ని ప్రభుత్వ, ఆస్పత్రుల్లో బెడ్‌లను రిజర్వులో ఉంచుకోవాలని సూచించింది.

సర్వం సిద్ధంగా ఉంచుకోండి...

రాష్ట్రప్రభుత్వాలు వేలాది కేసులు బయటపడినప్పటికీ... చికిత్స అందించేందుకు అన్నిరకాలుగా సమాయత్తమయ్యాయి. ఇందుకు అవసరమైన వెంటిలేటర్లు, ఔషధాలు, ఇతర పరికరాలను సిద్ధం చేసుకుంటున్నాయి. పెద్ద ఆస్పత్రులు, ప్రైవేటు వైద్యవిద్య కళాశాలలు కూడా భారీగా వెంటిలేటర్లు, మాస్క్‌లు, ఇతర సామగ్రిని సిద్ధంగా పెట్టుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ కోరింది. సైన్యం కూడా కోవిడ్‌-19కు చికిత్స కోసం 28 సర్వీసు ఆస్పత్రులను, పరీక్షల కోసం ఐదు పరీక్షా కేంద్రాలను సిద్ధం చేసింది. పెద్దఎత్తున వెంటిలేటర్ల తయారీ బాధ్యతను కేంద్రం భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌కు అప్పగించింది.

రైళ్లను ఐసొలేషన్​ వార్డులుగా..

రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ-డీఆర్​డీఓ వైద్యసిబ్బంది రక్షణకు అవసరమైన వస్తువులు, శానిటైజర్ల తయారీలో నిమగ్నమైంది. మరోవైపు వేలాది రైళ్లను కలిగి ఉన్న రైల్వేశాఖ నాన్‌ ఏసీ కోచ్‌లను ఐసొలేషన్‌ వార్డులుగా మారుస్తోంది. ప్రతి రైల్వే జోన్‌ పరిధిలో వారానికి 10 కోచ్‌లను ఐసొలేషన్‌ కేంద్రాలుగా మార్చనున్నట్లు రైల్వేశాఖ ప్రకటించింది. కోవిడ్‌ సవాళ్లను ఎదుర్కొనేందుకు అఖిలభారత వైద్యవిజ్ఞాన సంస్థ-ఎయిమ్స్​ కూడా ప్రత్యేక టాస్క్‌పోర్స్‌ ఏర్పాటు చేసింది.

వారంతా పరీక్షలు చేయించుకోవాల్సిందే..

సాధారణ జలుబు చేసినా కరోనా వైరస్‌ సోకిందేమోనన్న భయం వెంటాడుతున్న వేళ.. కరోనా పరీక్షలు ఎవరు చేయించుకోవాలో ఓ స్పష్టత ఇచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ సమాచార పత్రాన్ని విడుదల చేసింది. గత 14 రోజుల్లో విదేశాల్లో ప్రయాణించి వచ్చిన ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది. కరోనా సోకిన వారిని కలిసిన వారు, వారి వెంట తిరిగినవారు కూడా తప్పకుండా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. వైద్యరంగంలో పనిచేస్తున్న ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు తప్పనిసరని పేర్కొంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.