ETV Bharat / bharat

రైళ్లలో 20 కొత్త సౌకర్యాలు- జర్నీ మరింత సౌఖ్యం! - coolers in trains

ఇకపై రైలు కదిలే రెండు నిమిషాల ముందు ఓ గంట మోగనుంది. ప్రతి కోచ్​లోనూ సీసీటీవీ మానిటర్లు, విద్యుత్​ లేకుండా నడిచే కూలర్లు కనిపించనున్నాయి. ఇవే కాదు ఇప్పటి వరకు రైళ్లలో లేని 20 కొత్త సౌకర్యాలు అమలు చేయాలని నిర్ణయించింది రైల్వే బోర్డు.

train
రైలు
author img

By

Published : Jul 12, 2020, 7:17 PM IST

Updated : Jul 12, 2020, 7:26 PM IST

ఇకపై రైళ్లలో ప్రయాణికులు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వినూత్న వసతులు కల్పించాలని నిర్ణయించింది రైల్వే బోర్డు.

2018లో రైల్వే ఓ వెబ్​ పోర్టల్​ను సృష్టించింది. అందులో, రైళ్లలో కొత్తగా అమలు చేయాల్సిన, మెరుగు పరచాల్సినవి ఏవైనా ఉంటే.. వినూత్న ఆలోచనలను పోర్టల్​లో ఎంటర్​ చేసేలా జోనల్​ ఉద్యోగులకు అవకాశం కల్పించింది. జోనల్​ స్టేషన్లలో అమలు చేసిన, వినూత్న పథకాల వివరాలను పొందుపరచాలని సూచించింది. అప్పటి నుంచి 2019 డిసెంబర్​ వరకు ఆ పోర్టల్​లో దాదాపు 2,645 ఆలోచనలను పంచుకున్నారు ఉద్యోగులు. వాటిలో 20 ఆలోచనలను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది భారతీయ రైల్వే. ఈ మేరకు, జోనల్​ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సరికొత్త ఫీచర్లు ఇవే..

  • కొన్ని సార్లు రైలు కదులుతుందని తెలియక, నీళ్ల బాటిల్​ కోసమో, చిరుతిళ్ల కోసమో రైలు దిగి మళ్లీ రైలు దగ్గరకు వచ్చే సరికి కదిలిపోతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా.. రైలు కదలడానికి రెండు నిమిషాల ముందు ఓ గంట మోగేలా ఏర్పాటు చేసింది అలహాబాద్​ డివిజన్​లోని ఓ జంక్షన్​​. ఈ మూవింగ్​ బెల్​ ఆలోచనను ఇప్పుడు అన్ని జోన్లు అమలు చేయనున్నాయి.
  • ప్రతి కోచ్​లోనూ దృశ్యాలు రికార్డ్​ చేయగలిగే సీసీటీవీ మానిటర్లు ఏర్పాటు చేయనుంది రైల్వే. హమ్​సఫర్ ఎక్స్​ప్రెస్​​ వంటి రైళ్లలో ఇప్పటికే సీసీటీవీలు ఉన్నప్పటికీ.. మానిటర్లు మాత్రం లేవు. అయితే, ఇప్పుడు ఉత్తర మధ్య రైల్వే 18 హమ్​సఫర్​ కోచ్​లలో ఈ మానిటర్లను ఏర్పాటు చేసింది. వీటివల్ల రైళ్లలో నేరాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది.
  • పశ్చిమ రైల్వేలోని కొన్ని రైల్వే స్టేషన్లలో విద్యుత్​ అవసరం లేకుండానే నడిచే వాటర్​ కూలర్లను పెట్టించారు. ఒక్కొక్కటి రూ. 1.25 లక్షలు విలువ చేసే ఈ కూలర్లను దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.
  • నార్త్ సెంట్రల్ రైల్వేలోని అలహాబాద్ డివిజన్​ క్యారేజ్​ వాగన్ విభాగం.. రైలు నడుస్తున్నప్పుడు పట్టాలు తప్పే అవకాశాన్ని ముందే గుర్తించేందుకు హాట్ యాక్సిల్ బాక్స్ డిటెక్టర్​లను అభివృద్ధి చేసింది.
  • రైళ్లు ఎలాంటి కండిషన్​లో ఉన్నాయి, ఏవైనా సాంకేతిక లోపాలున్నాయా అని పరిశీలించాలంటే ఇన్నాళ్లు ఓ మనిషి తప్పనిసరిగా ఉండాల్సివచ్చేది. కానీ ఇప్పడు ఆ అల్ట్రా సోనిక్ డిటెక్షన్​ కోసం, ఓ వెహిక్యులర్​ సిస్టమ్​ను అభివృద్ధి చేసింది ఉత్తర మధ్య రైల్వే. ఇప్పుడు ఈ పద్ధతిని అన్ని రైళ్లకూ వర్తింపచేయనుంది రైల్వే శాఖ.
  • కరోనా వేళ.. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఓ మొబైల్​ యాప్​ లేదా బ్లూటూత్​ ద్వారా టికెట్లు ముద్రించుకునేలా ఏర్పాటు చేయనుంది రైల్వే. అంటే, ఇకపై రిజర్వేషన్​ లేని​ టికెట్ల కోసం కౌంటర్ వద్ద బారులు తీరకుండా,​ ఆన్​లైన్​లోనే టికెట్లు పొందేలా.. స్టేషన్​లలో ​యూటీఎస్​ కనెక్టివిటీ వసతి కల్పించనుంది.
  • రైళ్ల వేగం, పట్టాల ఉష్ణోగ్రతను అంచనా వేసేందుకు పైరోమీటర్​ విధానాన్ని అమలు చేస్తోంది తూర్పు మధ్య రైల్వే. ఆ స్ఫూర్తితో అన్ని జోన్లు ఇకపై ఈ పద్ధతిని పాటించనున్నాయి.

మరో మూడు నెలల్లో ఈ 20 వినూత్న సౌకర్యాలను ఏర్పాటు చేసి.. నివేదిక పంపించాల్సిందిగా జోన్లను ఆదేశించింది రైల్వే బోర్డు.

ఇదీ చదవండి: స్మగ్లింగ్​ కేసు: కేరళకు బంగారు కి'లేడీ'

ఇకపై రైళ్లలో ప్రయాణికులు మరింత సురక్షితంగా, సౌకర్యవంతంగా ప్రయాణించేందుకు వినూత్న వసతులు కల్పించాలని నిర్ణయించింది రైల్వే బోర్డు.

2018లో రైల్వే ఓ వెబ్​ పోర్టల్​ను సృష్టించింది. అందులో, రైళ్లలో కొత్తగా అమలు చేయాల్సిన, మెరుగు పరచాల్సినవి ఏవైనా ఉంటే.. వినూత్న ఆలోచనలను పోర్టల్​లో ఎంటర్​ చేసేలా జోనల్​ ఉద్యోగులకు అవకాశం కల్పించింది. జోనల్​ స్టేషన్లలో అమలు చేసిన, వినూత్న పథకాల వివరాలను పొందుపరచాలని సూచించింది. అప్పటి నుంచి 2019 డిసెంబర్​ వరకు ఆ పోర్టల్​లో దాదాపు 2,645 ఆలోచనలను పంచుకున్నారు ఉద్యోగులు. వాటిలో 20 ఆలోచనలను తక్షణమే అమలు చేయాలని నిర్ణయించింది భారతీయ రైల్వే. ఈ మేరకు, జోనల్​ మేనేజర్లకు ఆదేశాలు జారీ చేసింది.

సరికొత్త ఫీచర్లు ఇవే..

  • కొన్ని సార్లు రైలు కదులుతుందని తెలియక, నీళ్ల బాటిల్​ కోసమో, చిరుతిళ్ల కోసమో రైలు దిగి మళ్లీ రైలు దగ్గరకు వచ్చే సరికి కదిలిపోతుంది. అలాంటి ఇబ్బంది లేకుండా.. రైలు కదలడానికి రెండు నిమిషాల ముందు ఓ గంట మోగేలా ఏర్పాటు చేసింది అలహాబాద్​ డివిజన్​లోని ఓ జంక్షన్​​. ఈ మూవింగ్​ బెల్​ ఆలోచనను ఇప్పుడు అన్ని జోన్లు అమలు చేయనున్నాయి.
  • ప్రతి కోచ్​లోనూ దృశ్యాలు రికార్డ్​ చేయగలిగే సీసీటీవీ మానిటర్లు ఏర్పాటు చేయనుంది రైల్వే. హమ్​సఫర్ ఎక్స్​ప్రెస్​​ వంటి రైళ్లలో ఇప్పటికే సీసీటీవీలు ఉన్నప్పటికీ.. మానిటర్లు మాత్రం లేవు. అయితే, ఇప్పుడు ఉత్తర మధ్య రైల్వే 18 హమ్​సఫర్​ కోచ్​లలో ఈ మానిటర్లను ఏర్పాటు చేసింది. వీటివల్ల రైళ్లలో నేరాలు తగ్గే అవకాశం ఉంది కాబట్టి వీటిని దేశవ్యాప్తంగా అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది.
  • పశ్చిమ రైల్వేలోని కొన్ని రైల్వే స్టేషన్లలో విద్యుత్​ అవసరం లేకుండానే నడిచే వాటర్​ కూలర్లను పెట్టించారు. ఒక్కొక్కటి రూ. 1.25 లక్షలు విలువ చేసే ఈ కూలర్లను దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది బోర్డు.
  • నార్త్ సెంట్రల్ రైల్వేలోని అలహాబాద్ డివిజన్​ క్యారేజ్​ వాగన్ విభాగం.. రైలు నడుస్తున్నప్పుడు పట్టాలు తప్పే అవకాశాన్ని ముందే గుర్తించేందుకు హాట్ యాక్సిల్ బాక్స్ డిటెక్టర్​లను అభివృద్ధి చేసింది.
  • రైళ్లు ఎలాంటి కండిషన్​లో ఉన్నాయి, ఏవైనా సాంకేతిక లోపాలున్నాయా అని పరిశీలించాలంటే ఇన్నాళ్లు ఓ మనిషి తప్పనిసరిగా ఉండాల్సివచ్చేది. కానీ ఇప్పడు ఆ అల్ట్రా సోనిక్ డిటెక్షన్​ కోసం, ఓ వెహిక్యులర్​ సిస్టమ్​ను అభివృద్ధి చేసింది ఉత్తర మధ్య రైల్వే. ఇప్పుడు ఈ పద్ధతిని అన్ని రైళ్లకూ వర్తింపచేయనుంది రైల్వే శాఖ.
  • కరోనా వేళ.. భౌతిక దూరం పాటించేందుకు వీలుగా ఓ మొబైల్​ యాప్​ లేదా బ్లూటూత్​ ద్వారా టికెట్లు ముద్రించుకునేలా ఏర్పాటు చేయనుంది రైల్వే. అంటే, ఇకపై రిజర్వేషన్​ లేని​ టికెట్ల కోసం కౌంటర్ వద్ద బారులు తీరకుండా,​ ఆన్​లైన్​లోనే టికెట్లు పొందేలా.. స్టేషన్​లలో ​యూటీఎస్​ కనెక్టివిటీ వసతి కల్పించనుంది.
  • రైళ్ల వేగం, పట్టాల ఉష్ణోగ్రతను అంచనా వేసేందుకు పైరోమీటర్​ విధానాన్ని అమలు చేస్తోంది తూర్పు మధ్య రైల్వే. ఆ స్ఫూర్తితో అన్ని జోన్లు ఇకపై ఈ పద్ధతిని పాటించనున్నాయి.

మరో మూడు నెలల్లో ఈ 20 వినూత్న సౌకర్యాలను ఏర్పాటు చేసి.. నివేదిక పంపించాల్సిందిగా జోన్లను ఆదేశించింది రైల్వే బోర్డు.

ఇదీ చదవండి: స్మగ్లింగ్​ కేసు: కేరళకు బంగారు కి'లేడీ'

Last Updated : Jul 12, 2020, 7:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.