ETV Bharat / bharat

మరో 3రోజులు చిదంబరం కస్టడీ పొడిగింపు

నాలుగు రోజుల కస్టడీ గడువు ముగిసిన తర్వాత చిదంబరంను కోర్టు ముందు హాజరుపరిచింది సీబీఐ. విచారణకై మరో 5రోజులు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరగా కోర్టు 3రోజులు పొడిగించింది.

author img

By

Published : Aug 30, 2019, 4:05 PM IST

Updated : Sep 28, 2019, 9:03 PM IST

మరో 3రోజులు చిదంబరం కస్టడీ పొడిగింపు

ఐఎన్​ఎక్స్​ మీడియా అక్రమ లావాదేవీల కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీ మరో మూడు రోజులు పొడిగించింది దిల్లీ కోర్టు. 4 రోజుల సీబీఐ కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరంను కోర్టుకు తీసుకొచ్చారు సీబీఐ అధికారులు.

కేసుకు సంబంధించి విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. ఈ మేరకు సెప్టెంబర్​ 2వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్​ కుహార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

8రోజుల వరకు సాగిన విచారణ

ఇదే కేసుకు సంబంధించి ఆగస్టు 20న చిదంబరం పెట్టుకున్న బెయిల్​ పిటీషన్​ను దిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి 8 రోజులుగా కేంద్ర మాజీ మంత్రిని సీబీఐ విచారణ జరుపుతూనే ఉంది.

సుప్రీంకు చిదంబరం విచారణ పత్రాల అందజేత

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాంండరింగ్​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విచారణకు సబంధించిన పత్రాలను ఈడీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. తన అధికారిక ముద్రతో సీలు వేసిన కవర్​లో ఈ పత్రాలను అందజేసింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించే నేపథ్యంలో విచారణకు సంబంధించిన పత్రాలను ఈడీ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

ఈ కేసులో భాగంగా ఆగస్టు 20న దిల్లీ హైకోర్టులో చిదంబరం బెయిల్​కై అభ్యర్థించగా అందుకు కోర్టు నిరాకరించింది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు కేంద్ర మాజీ మంత్రి. ఈ పిటిషన్​పై సెప్టెంబర్​ 5 న తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీం తెలిపింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా అక్రమ లావాదేవీల కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం కస్టడీ మరో మూడు రోజులు పొడిగించింది దిల్లీ కోర్టు. 4 రోజుల సీబీఐ కస్టడీ గడువు ముగిసిన నేపథ్యంలో చిదంబరంను కోర్టుకు తీసుకొచ్చారు సీబీఐ అధికారులు.

కేసుకు సంబంధించి విచారణ ఇంకా పూర్తి కాలేదని, మరో 5 రోజులు కస్టడీ పొడిగించాలని కోర్టును కోరారు. ఈ మేరకు సెప్టెంబర్​ 2వరకు గడువు పొడిగిస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి అజయ్ కుమార్​ కుహార్​ ఉత్తర్వులు జారీ చేశారు.

8రోజుల వరకు సాగిన విచారణ

ఇదే కేసుకు సంబంధించి ఆగస్టు 20న చిదంబరం పెట్టుకున్న బెయిల్​ పిటీషన్​ను దిల్లీ కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత ఆగస్టు 21న సీబీఐ అరెస్టు చేసింది. అప్పటి నుంచి 8 రోజులుగా కేంద్ర మాజీ మంత్రిని సీబీఐ విచారణ జరుపుతూనే ఉంది.

సుప్రీంకు చిదంబరం విచారణ పత్రాల అందజేత

ఐఎన్​ఎక్స్​ మీడియా మనీలాంండరింగ్​ కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం విచారణకు సబంధించిన పత్రాలను ఈడీ సుప్రీం కోర్టుకు సమర్పించింది. తన అధికారిక ముద్రతో సీలు వేసిన కవర్​లో ఈ పత్రాలను అందజేసింది.

ఐఎన్​ఎక్స్​ మీడియా కేసులో చిదంబరానికి అరెస్టు నుంచి రక్షణ కల్పించే నేపథ్యంలో విచారణకు సంబంధించిన పత్రాలను ఈడీ సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.

ఈ కేసులో భాగంగా ఆగస్టు 20న దిల్లీ హైకోర్టులో చిదంబరం బెయిల్​కై అభ్యర్థించగా అందుకు కోర్టు నిరాకరించింది. దిల్లీ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు కేంద్ర మాజీ మంత్రి. ఈ పిటిషన్​పై సెప్టెంబర్​ 5 న తీర్పును వెలువరించనున్నట్లు సుప్రీం తెలిపింది.

Mumbai, Aug 30 (ANI): Bollywood cutie Ishaan Khatter was spotted in Mumbai's Juhu. Clad in casual attire, he met the shutterbugs with a huge smile. Ishaan will be next seen in 'Khaali Peeli' along with Ananya Panday. Meanwhile, actor Shamita Shetty was also seen in Juhu. She chose maxi dress with denim jacket for her appearance.

Last Updated : Sep 28, 2019, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.