సరిహద్దుల వెంబడి మరోసారి వక్రబుద్ధిని చాటుకుంది పాకిస్థాన్. జమ్ముకశ్మీర్ బారాముల్లా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి కాల్పులకు తెగబడింది. ఈ కాల్పుల్లో బీఎస్ఎఫ్ ఎస్సై రాకేష్ డోభాల్ వీరమరణం పొందారని భారత ఆర్మీ పేర్కొంది. మరో సైనికుడికి తీవ్ర గాయాలయ్యాయని తెలిపింది.
రాకేష్ ఉత్తరఖాండ్లోని రిషికేష్ ప్రాంతానికి చెందినవారని ఆర్మీ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో ఇంకా కాల్పులు కొనసాగుతున్నాయని, బీఎస్ఎఫ్ ఇందుకు దీటుగా స్పందిస్తోందని సీనియర్ ఆర్మీ అధికారి పేర్కొన్నారు.
ఇదీ చదవండి:'పాంగాంగ్లో కొత్త నిర్మాణాల కూల్చివేతకు అంగీకారం'