ETV Bharat / bharat

కశ్మీర్​లోకి ఉగ్ర చొరబాటు కుట్ర భగ్నం

author img

By

Published : Sep 27, 2020, 3:26 PM IST

జమ్ముకశ్మీర్​లోకి అంతర్జాతీయ సరిహద్దు గుండా భారీగా ఆయుధాలతో చొరబడేందుకు యత్నించిన ఐదుగురు ఉగ్రవాదులను సరిహద్దు భద్రత దళం(బీఎస్​ఎఫ్​) నిలువరించింది. బలగాల దీటైన సమాధానంతో వెనక్కి తిరిగి పారిపోయారు ముష్కరులు.

BSF foils infiltration
జమ్ముకశ్మీర్​లోకి ఉగ్ర చొరబాటు కుట్ర భగ్నం

భారత్​లోకి భారీగా ఆయుధాలతో చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలను పరుగులు పెట్టించాయి భద్రతా దళాలు. పాక్​ రేంజర్ల సాయంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ముకశ్మీర్​ సాంబా జిల్లాలోకి ప్రవేశించేందుకు యత్నించగా సరిహద్దు భద్రత దళం(బీఎస్​ఎఫ్​) ఉగ్రవాదులను నిలువరించినట్లు అధికారులు తెలిపారు.

" బలగాల దీటైన సమాధానంతో ఐదుగురు ముష్కరులు వెనక్కి తిరిగి పారిపోయారు. గత పదిహేను రోజుల్లో సాంబా జిల్లాలోని సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నించటం ఇది రెండోసారి. శనివారం రాత్రి ఉగ్రవాదుల బృందం సరిహద్దులు దాటేందుకు యత్నిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వారిని అడ్డుకునే ప్రయత్నంలో ముష్కరులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఘగ్వాల్​ ప్రాంతంలోని మంగు చాక్​ సరిహద్దు ఔట్​పోస్ట్​(బీఓపీ) వద్ద రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జరిగింది. ఇదే సమయంలో పాకిస్థాన్​ రేంజర్లు కూడా కాల్పులకు దిగారు. ఇరువురి మధ్య 30 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. బీఎస్​ఎఫ్ దళాల​ దీటైన సమాధానంతో ముష్కరులు వెనక్కి పారిపోయారు."

- బీఎస్​ఎఫ్​ ప్రతినిధి.

ఉగ్రచొరబాటుకు యత్నించిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు అధికారులు. అయితే.. ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమానిత సామగ్రి లభించలేదని తెలిపారు.

సాంబా జిల్లాలో ఈనెల 14వ తేదీ రాత్రి కూడా చొరబాటుకు యత్నించగా.. వారిని అడ్డుకున్నాయి బలగాలు. కొద్ది వారాలుగా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్​.. మరోవైపు ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేసేందుకు యత్నిస్తోంది. పలు సందర్భాల్లో వాటిని ధ్వంసం చేశాయి భద్రతా దళాలు.

ఇదీ చూడండి: యుద్ధ సన్నద్ధతతో సైన్యం​.. అశాంతి సృష్టిస్తే అంతే!

భారత్​లోకి భారీగా ఆయుధాలతో చొరబడేందుకు ప్రయత్నించిన ఉగ్రమూకలను పరుగులు పెట్టించాయి భద్రతా దళాలు. పాక్​ రేంజర్ల సాయంతో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి జమ్ముకశ్మీర్​ సాంబా జిల్లాలోకి ప్రవేశించేందుకు యత్నించగా సరిహద్దు భద్రత దళం(బీఎస్​ఎఫ్​) ఉగ్రవాదులను నిలువరించినట్లు అధికారులు తెలిపారు.

" బలగాల దీటైన సమాధానంతో ఐదుగురు ముష్కరులు వెనక్కి తిరిగి పారిపోయారు. గత పదిహేను రోజుల్లో సాంబా జిల్లాలోని సరిహద్దుల్లో చొరబాట్లకు ప్రయత్నించటం ఇది రెండోసారి. శనివారం రాత్రి ఉగ్రవాదుల బృందం సరిహద్దులు దాటేందుకు యత్నిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. వారిని అడ్డుకునే ప్రయత్నంలో ముష్కరులు కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటన ఘగ్వాల్​ ప్రాంతంలోని మంగు చాక్​ సరిహద్దు ఔట్​పోస్ట్​(బీఓపీ) వద్ద రాత్రి 11.45 గంటల ప్రాంతంలో జరిగింది. ఇదే సమయంలో పాకిస్థాన్​ రేంజర్లు కూడా కాల్పులకు దిగారు. ఇరువురి మధ్య 30 నిమిషాల పాటు కాల్పులు జరిగాయి. బీఎస్​ఎఫ్ దళాల​ దీటైన సమాధానంతో ముష్కరులు వెనక్కి పారిపోయారు."

- బీఎస్​ఎఫ్​ ప్రతినిధి.

ఉగ్రచొరబాటుకు యత్నించిన ప్రాంతంలో తనిఖీలు నిర్వహించినట్లు చెప్పారు అధికారులు. అయితే.. ఆ ప్రాంతంలో ఎలాంటి అనుమానిత సామగ్రి లభించలేదని తెలిపారు.

సాంబా జిల్లాలో ఈనెల 14వ తేదీ రాత్రి కూడా చొరబాటుకు యత్నించగా.. వారిని అడ్డుకున్నాయి బలగాలు. కొద్ది వారాలుగా సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఉల్లంఘిస్తున్న పాకిస్థాన్​.. మరోవైపు ఆయుధాలు, మాదకద్రవ్యాలను డ్రోన్ల ద్వారా చేరవేసేందుకు యత్నిస్తోంది. పలు సందర్భాల్లో వాటిని ధ్వంసం చేశాయి భద్రతా దళాలు.

ఇదీ చూడండి: యుద్ధ సన్నద్ధతతో సైన్యం​.. అశాంతి సృష్టిస్తే అంతే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.