కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎలక్షన్ కమిషన్(ఈసీ)కి ఫిర్యాదు చేసింది భాజపా. ఈ మేరకు ఈసీకి రాసిన లేఖను విడుదల చేసింది. బిహార్లో తొలిదశ పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో.. రాహుల్ ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారని అందులో పేర్కొంది.

బిహార్ అసెంబ్లీ తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 33.10శాతం పోలింగ్ నమోదైంది. ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ ఏర్పాట్లు చేసింది. కరోనా నిబంధనలను పాటిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.